గోకులానికి ఎలాటి బట్టలతో వెళ్ళాడో వాటి తోనే బలరాముడు మధురకు వచ్చి, తిన్నగా కృష్ణు డింటికి వెళ్ళాడు. కృష్ణుడతని పాదాలకు నమస్కారం చేసి, స్వాగతం తెలిపాడు. తరవాత అన్నదమ్ము లిద్దరూ వసుదేవుడి ఇంటికి వెళ్ళారు. వసుదేవుడు బలరాముణ్ణి కౌగలించుకుని, విశేషాలు అడిగాడు. బలరాముడు గోకులంలో తాను చేసిన ఘనకార్యం ఒకటి చెప్పాడు.
అతను ఒకనాడు తాను కూర్చున్న చోటి నుంచి కాళిందీనదిని పిలిచి, తన దగ్గిరికి వచ్చి, తన చేత స్నానం చేయించమన్నాడు. కాళిందీనది రాలేదు. బలరాముడికి కోపం వచ్చింది. అతను తన నాగలిని కాళిందికి వేసి లాగాడు. ఆ విధంగా బృందావనానికి కాళింది కాలువ ఒకటి ఏర్పడి, గోపకులకు చాలా ఉపకారం జరిగింది.
కొంతకాలం గడిచింది. ఒకనాడు కృష్ణుడు యాదవుల సభలో ఒక ప్రతిపాదన ఈ విధంగా చేశాడు :
"మనం నివసించే ఈ మధుర లాటిది ప్రపంచంలో మరొకటి లేదు. ఇలాటి క్షేత్రం కూడా మరెక్కడా ఉండదు. మేం వ్రేపల్లెలో పెరిగినా, పుట్టటం ఇక్కడే పుట్టాం. ఇక్కడికే తిరిగివచ్చి సకలైశ్వ ర్యాలూ సంపాదించుకున్నాం. అయితే, ఇక్కడ మనకు శత్రుబాధ జాస్తి అయింది. ప్రపంచంలో ఉండే రాజులందరూ జరా సంధుడి వెంట ఎత్తివచ్చి, ఎటువంటి హింసాకాండ జరిపారో మీరు చూశారు కద! ఈ ప్రమాదం తుదముట్ట లేదు. మనకు మంది మార్బలం ఉన్నది. ఏనుగులూ, గుర్రాలూ, రధాలూ ఉన్నాయి. పుష్క తెలంగా బంగారమూ, రత్నరాసులూ ఉన్నాయి. కాని ఏం లాభం? మన శత్రు వులు వచ్చి పడ్డప్పుడల్లా మనం మనకున్నది నష్టపోతున్నాం. ఇది సహించరానిది. అందు చేత మనం ఇక్కడినుంచి వెళ్ళిపోవటం నాకు కర్తవ్య మనిపిస్తున్నది. మనం ఉండటానికి మరొక ప్రదేశం చూస్తాను. అక్కడికి పోయి సుఖంగా ఉందాం.”
కృష్ణుడు చెప్పిన మాటలు యాదవులకు సరిగా ఉన్నట్టే తోచాయి. జరాసంధుణ్ణి చంపటం సాధ్యం కాదు. అతని వెనక అంతులేని సేన లుంటున్నాయి. యుద్ధం చెయ్యవచ్చు. ఆ యుద్ధం ఎప్పటికీ తెగదు. జరిగేడల్లా ఉభయ పక్షాలవారూ నాశనం కాపటం. కృష్ణుడు నిరపాయ స్థలం చూపే పక్షంలో అక్కడికి పోవటమే మంచిదని యాదవనాయకులనుకున్నారు.
కృష్ణుడు యాదవుల నందరినీ ఫలాని చోటికి తీసుకుపోవాలని తన మనసులో నిశ్చయించుకుని, అందరినీ ప్రయాణ సన్నాహాలు చేయమన్నాడు.
ఇదే సమయంలో కాలయవనుడనే వాడు మధుర మీదికి సైన్యాలతో సహా బయలుదేరాడనీ, జరాసంధుడు కూడా అదే ప్రయత్నం ప్రారంభించాడనీ తెలియ వచ్చింది. ఈ సంగతి వింటూనే కృష్ణుడు, " మనం ఇవాళే బయలుదేరుదాం. ఈ రోజు చాలా బాగుంది," అని తన వారికి చెప్పాడు. వసుదేవుడూ, ఉగ్రసేనుడూ, బలరామ కృష్ణులూ, వారి వెంట వృష్టి, అంధక వీరులూ, వారి కుటుంబాలూ, అంతులేని ఏనుగులతో, రథాలతో, గుర్రాలతో, తమ సంపద లన్నిటినీ వెంట తీసుకుని మధురా నగరం విడిచి, పడమటి దిక్కుగా ప్రయాణ మయారు. వారు అలా రోజూ ప్రయాణం చేస్తూ పశ్చిమ సముద్రతీరాన్ని చేరు కున్నారు. అది అనేక చెట్లతోపులతో కూడు కుని ఉన్న గురువుప్రదేశం. ఆ ప్రాంతం లోనే పూర్వం ఏకలవ్యుడు ద్రోణాచార్యు లను పూజించాడు.
ఎక్కడ ఇళ్ళు కట్టాలో, ఎక్కడ తోటలు పెంచాలో, ఎక్కడ నీటి సదుపాయా లున్నాయో బాగా ఆలోచించి, అక్కడ ఒక అందమైన నగరం నిర్మించి, దానికి ద్వారావతి అని పేరు పెట్టారు. అందరికీ నగరంలో మంచి ఇళ్ళు ఏర్పాటయాయి.. యాదవులకు శత్రుభయం తీరిపోయింది. వాళ్ళు సుఖంగా, నిశ్చింతగా ద్వారావతిలో జీవించసాగారు. అయితే ద్వారవతీ నిర్మా Eణానికి ముందు చాలా కథ నడిచింది.
ఎటువంటి శత్రువునూ లక్ష్యపెట్టని కృష్ణుడు కాలయవనుడికి వెరిచి, మధుర విడిచిపెట్టి, పడమటి సముద్రాన నగరం నిర్మించుకోవటానికి కారణం ఉన్నది. అదొక చిన్న కథ.
ఒకప్పుడు వృష్టి, అంధకకులాల వారికి గర్గు డని ఒక గురువు ఉండేవాడు. అతను ఆజన్మబ్రహ్మచర్యం అవలంబించాడు. గర్గుడు యాదవుల మధ్య ఉండగా ఒకసారి ఎవడో ఆయనను చూసి, మగవాడు కాదు, ఆడది అని అపహాస్యం చేశాడు. యాదవులు ఆ మాట విని ఊరుకున్నారు గాని తమ ఆక్షేపణ తెలపలేదు.
గర్గుడికి మండిపోయింది. అతను అడవికి వెళ్లి, పన్నెండేళ్ళ పాటు లోహ చూర్ణం తింటూ, అతి ప్రచండమైన తపస్సు చేసి, శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని, వృష్టి, అంధకులను పీడించగల కొడుకు తనకు కలిగేటట్టు వరం పొందాడు. ఈ సంగతి తెలిసి, కొడుకులు లేని యవనేశ్వరుడు, అతన్ని పిలుచుకు పోయి, తన గోవుల మందల మధ్య అతనికి నివాసం ఏర్పాటు చేసి, అతనికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు.
గర్గుడు అలా గోవుల మందల మధ్య నివసిస్తూండగా ఒక అప్సరస గోపిక రూపంలో అతని వద్దకు వచ్చి, ఈశ్వరా దేశం ప్రకారం గర్భవతి అయి, కాలయవనుణ్ణి కన్నది. ఆ కుర్రవాణ్ణి యవనరాజు తన కొడుకుగా పెంచి, పెద్దవాణ్ణి చేశాడు. కాల యవనుడు గొప్ప తేజోవంతుడూ, పరా క్రమవంతుడూగా పెరిగాడు. అతను ఎంతటి వారిని లక్ష్యపెట్టేవాడు కాడు.
ఒకనాడు యవనరాజు వద్దకు నారదుడు వచ్చాడు. అప్పుడు కాలయవను డాయనను, ప్రపంచంలో గొప్ప వీరు లెవరు ?” అని అడిగాడు.
"ఈ నాడు యాదవులను మించిన వీరులు ప్రపంచంలో లేరు,” అంటూ నార దుడు చాలా గొప్పగా వర్ణించి చెప్పాడు. నారదుడి మాటలు వింటున్న కొద్దీ కాల యవనుడికి మాత్సర్యం పుట్టుకొచ్చింది. శకవంశానికి చెందిన రాజులూ, హిమాల యంలో ఉండే దస్యులూ అత నెలా చెబితే అలా నడుచుకుంటారు. ఆందుచేత వారి నందరినీ చేర్చి ఒక సేనగా తయారుచేసి, ఏనుగులనూ, గుర్రాలనూ, గాడిదలనూ అమితంగా వెంటబెట్టుకుని, మధుర మీదికి కాలయవనుడు బయలుదేరాడు.
ఈ సంగతి నారదుడి వల్ల నే విని కృష్ణుడు పరిస్థితి అంతా చక్కగా ఆలోచించి, మధుర విడిచి వెళ్ళటమే కర్తవ్యమని నిశ్చయించు కున్నాడు. తానీ నిశ్చయానికి రాగానే యాదవులను హెచ్చరించాడు.
కృష్ణుడు మరొక పని కూడా చేశాడు. అతను ఒక కుండలో ఒక కాలసర్పాన్ని ఉంచి, దానికి వాసెన కట్టి, ఒక దూత చేతికిచ్చి కాలయవనుడి దగ్గిరికి పంపుతూ, ఇలా చెప్పమన్నాడు : "ఈ కుండలో ఉన్న కాలసర్పం లాటిది కృష్ణుడి పరాక్రమం.”
ఆ మాట విని కాలయవనుడు ఏమీ అనక, కాలసర్పం ఉన్న కుండలో కండ చీమలను కొన్నిటిని వేసి, మళ్లీ వాసెన కట్టి, దాన్ని తీసుకుపోయి కృష్ణుడి కియ్య మన్నాడు. "నువు ఎంత బలవంతుడివైనా, అనేక మంది మధ్య ఒంటరిగా చిక్కితే నీ బలం ఎందుకూ పనికిరాదు," అని కాల యవనుడి సందేశం. దాని అంతరార్థం గ్రహించి కృష్ణుడు మధురానగరం నుంచి, యాదవులందరితోనూ బయలుదేరాడు.
అతను ద్వారావతి నుంచి నిరాయుధు డుగా, కాలినడకన బయలుదేరి తన శత్రువు ఉండే నగరం చేరాడు. అక్కడి వాళ్ళు కృష్ణుణ్ణి గుర్తించి, "చుట్టు ముట్టండి. పట్టుకోండి," అని ఆర్భాటం చేశారు. ఈ లోపల కృష్ణుడి రాక విన్న కాలయవనుడు తాను కూడా నిరాయు ధుడూ, పాదచారీ అయి కృష్ణుడికి ఎదురు వచ్చి, కృష్ణుణ్ణి సమీపించాడు. కాని కృష్ణుడు అతనికి చేయి ఇవ్వబోయేవాడి లాగా నటిస్తూ, ఇవ్వకుండానే అతి వేగంగా ఒక గుహలో ప్రవేశించాడు.
ఆ గుహలో ముచికుందు డనేవాడు నిద్ర పోతున్నాడు. ఈ ముచికుందుడు మాంధాత కొడుకు. అతను దేవాసుర యుద్ధంలో చాలా కాలం యుద్ధం చేసి, దేవతలకు విజయం చేకూర్చి, శ్రమతీకటానికి నిద్ర పోబోతూ, తనకు నిద్రాభంగం కలిగించిన వాణ్ణి తన చూపులతోనే భస్మం చేసేటట్టు వరం పొందాడు. ఈ సంగతి కృష్ణుడికి తెలుసు. అతను గుహలో ప్రవేశిస్తూనే ముచికుందుడి తల వైపున దాక్కున్నాడు.
అతని వెనకగా గుహలోకి వచ్చిన కాల యవనుడు, నిద్రపోతున్న ముచికుందుణ్ణి చూసి కృష్ణుడే నని భ్రమపడి, కాలితో తన్ని, "ఇలా చావు తప్పించుకుందా మను కుంటున్నావా? లే, లే. నీ బలం తెలి సింది," అంటూ వికటాట్టహాసం చేశాడు.
నిద్రాభంగం కలిగి ముచికుందుడు లేచి కూర్చుని, కాలయవనుడి కేసి కోపంగా చూశాడు. మరుక్షణమే కాలయవనుడు, పిడుగుపడిన చెట్టులాగా అయి, నిలువునా లేచిన మంటలలో బూడిద అయిపోయాడు.
తరవాత కృష్ణుడు తాపీగా ముచికుందుడి ఎదటపడి, "అయ్యా, నీ ఎక్కడ ఉన్న సంగతి నాకు నారదుడి ద్వారా తెలిసింది. నా పని నీ మూలాన నెరవేరింది. తృప్తి పడ్డాను. ఇక వెళ్ళివస్తాను,” అన్నాడు.
ముచికుందుడు కృష్ణుణ్ణి చూసి, "అయ్యా, నీ వెవరు? ఇక్కడికి ఏం పని మీద వచ్చావు? నాకు నిద్రాభంగం కలి గించిన ఈ మనిషి ఎవరు? నే నిక్కడ ఎంతకాలంగా నిద్రపోతున్నాను? తెలిస్తే చెప్పు,” అన్నాడు.
దానికి కృష్ణుడిలా చెప్పాడు :
"చంద్రుడికి సాటి అనదగినవాడు నహుషుడు. ఆయన కొడుకు యయాతి. యయాతికి అయిదుగురు కొడుకులు. వారందరిలోకీ పెద్దవాడు యదువు. ఆ యదువు సంతతిలో వసుదేవు డనే మహనీయుడు పుట్టాడు. ఆ వసుదేవుడికి దేవకి అనే భార్య యందు నేను పుట్టాను. ఆయనకు రోహిణి అనే భార్యయందు పుట్టిన బలరాముడికి తమ్ముణ్ణి, నన్ను వాసుదేవు డంటారు. నీ కోపాగ్నికి ఆహుతి అయిన అతను కాలయవనుడనే ప్రసిద్ధుడు, వరంవల్ల పుట్టినవాడు. మరొకవిధంగా చావనివాడు, నా శత్రువు. నీవు త్రేతా యుగంలో పుట్టినట్టు విన్నాను. ఇప్పుడు కలియుగం సమీపిస్తున్నది.”
ముచికుందుడు గుహ నుంచి బయటికి వస్తూ తిరిగి రాజ్యం చేసుకుందా మను కున్నాడు. కాని తీరా భూమి మీద సంచ రించే మనుషుల అల్పప్రమాణమూ, అల్ప బుద్ధులూ, అల్ప పరాక్రమమూ చూస్తే ఆయనకు రాజ్యాలేలా అనిపించలేదు. అందుచేత ఆయన తపస్సు చేసుకోవటానికి హిమాలయారణ్యాలలోకి వెళ్ళిపోయాడు.
తన ప్రబల శత్రువు చనిపోయాక కృష్ణుడు కాలయవనుడి సేనలోని ప్రధాన వీరులను తన దివ్యాస్త్రాలతో ఆనాయా సంగా చంపేసి, మిగిలిన సేనలను తన వశం చేసుకుని, అతి వేగంగా వెళ్ళి తన వారిని చేరుకున్నాడు. ఇదంతా జరిగాకనే ద్వారావతీనగర నిర్మాణం జరిగింది.
ద్వారావతీ నిర్మాణానికి విశ్వకర్మ సహాయంపొంద నిశ్చయించి కృష్ణుడు ఆ దేవశిల్పిని స్మరించాడు. వెంటనే విశ్వ కర్మ ప్రత్యక్షమై, "నన్నెందుకు స్మరిం చావు? నా వల్ల ఏం పని కావాలి?" అని అడిగాడు.
"స్వర్గంలో ఇంద్రుడి నగరం ఎలా ఉత్తమంగా ఉంటుందో, భూలోకంలో అలా సర్వోత్తమంగా ఉండే నగరాన్ని నాకు కట్టి పెట్టాలి," అన్నాడు కృష్ణుడు.
"ఈ జనాని కంతకూ తగిన నగరం నిర్మించాలంటే ఇక్కడ ఉన్న ప్రదేశం చాలదు. సముద్రం కొంత వెనక్కు పోయి నట్టయితే, చక్కని విశాలనగరం నిర్మించ వచ్చు,” అన్నాడు విశ్వకర్మ.
కృష్ణుడు సముద్రుణ్ణి ప్రార్థించాడు. సముద్రుడు ప్రత్యక్షమై, ఎటుచూసినా పన్నెండు యోజనా లుండేటట్టుగా భూమి వదిలి, తాను వెనక్కు వెళ్ళిపోయాడు. అప్పుడక్కడ విశ్వకర్మ దివ్యమైన నగరాన్ని నిర్మించాడు. బంగారపు కోటా, ఆకాశాన్ని అంటే మణిగోపురాలూ, ఎత్తయిన ప్రాసా దాల వరసలూ, హర్మ్యాలూ, చక్కని రాజ మార్గమూ, చైత్యాలూ, సభలూ, చావడులూ, తోరణాలూ, బు రు జు లూ, బావులూ, సరస్సులూ, కల్పిత శిలోద్యానాలూ అవత రించాయి. రాజభవనంలో కృష్ణుడు ఉన్న తాసనంలో కూర్చుంటే, యాదవ ప్రముఖు లందరూ సభతీరారు. కృష్ణుడు విశ్వకర్మను' సముచితంగా సత్కరించి ఇంద్రలోకానికి పంపేశాడు.