16. రుక్మిణీ వివాహ ప్రయత్నం | Rukmini Marriage Effort | Lord Krishna Avatar Story in Telugu

writer
0
ఒకనాటి రాత్రి కృష్ణుడు తన తండ్రి ఇంట ఉండి ఒక ఆలోచన చేశాడు. తన వారికి వైభవోపేతమైన ద్వారకానగరం ఏర్పడింది. కాని వారికి జీవనం సుఖప్రదంగా జరిగే ఒనరు ఏర్పడలేదు. అందుచేత అతను శంఖనిధిని తలుచుకున్నాడు. వెంట నే శంఖనిధి ప్రత్యక్షమై, చేతులు మోడ్చి నమస్కరించి, "స్వామీ, ఎందుకు నన్ను స్మరించావు? నీ నీ ఆజ్ఞ ఏమిటో తెలిస్తే నిర్వర్తిస్తాను," అన్నది.

"నిధిదేవతా, దరిద్రుడు చచ్చినవాడితో సమానం. నా వారిలో దీనులూ, అనాధులూ, ఆర్తులూ ఉండగా చూసి సహించలేను. అన్ని ఇళ్ళలోనూ సంపత్సమృద్ధి ఉండే టట్టు చూడు," అన్నాడు కృష్ణుడు.

"చిత్తం," అని శంఖనిధి వెళ్ళి మిగిలిన ఎనిమిది నిధులనూ కలుసుకుని, కృష్ణుడి కోరిక తెలిపింది. వెంటనే ద్వారక అంతటా నవనిధులూ వెలిశాయి. ఆ నగరంలో పేదవాడంటూ లేకుండా పోయాడు.

ఇదే విధంగా కృష్ణుడు మరొకసారి వాయుదేవుణ్ణి స్మరించాడు. వాయుదేవుడు వచ్చి కృష్ణుడికి నమస్కరించి నిలబడ్డాడు. 

"వాయుదేవుడా, బలంలో నీకు చాలిన వాడు ఎవడూ లేడు. నా కొక పని చేసి పెట్టాలి. అదేమిటంటే, ఇంద్రుడికి విశ్వ కర్మ సుధర్మ అనే సభ చేసి యిచ్చాడు. మా యాదవులకు కూడలిగా ఒక మంచి సభ అవసరం. అందుచేత నువు ఇంద్రు డితో నా ఆజ్ఞగా చెప్పి, అతని అనుమతి మీద మా కా సభ తెచ్చిపెట్టు,” అన్నాడు కృష్ణుడు. వాయుదేవుడు సరేనని దేవలోకా నికి వెళ్ళి, దేవతలతో కృష్ణుడి కోరిక చెప్పి, వారి అంగీకారంతో సుధర్మ అనే సభాభవ నాన్ని తెచ్చి, కృష్ణుడికి అప్పగించి వెళ్ళి పోయాడు.

ఈ విధంగా కృష్ణుడు సమస్త లోకాల లోనూ ఉన్న సర్వోత్తమమైన వస్తువులన్నీ తెప్పించి ద్వారకలో ఉంచాడు. కృష్ణుడు తాను పై నుండి పరిపాలన నడుపుతూ ఈ విధంగా ముఖ్యస్థానాలలో వారి వారిని నియమించాడు. రాజు ఉగ్రసేనుడు; కాశ్యపుడనే బ్రాహ్మణుడు పురోహితుడు; వికద్రుడు మంత్రి; వివిధ రాజ్యాంగ శాఖలు నిర్వహించటానికి పదిమంది యాదవ ప్రముఖులు, మంచి మేధావులైన వృద్ధులు నియమించబడ్డారు; దారుకుడు కృష్ణుడికి సారధి; అస్త్రవిద్యలో ద్రోణా చార్యుడితో సమానుడనదగిన సాత్యకి సేనాధిపతి.

ఈ విధంగా ప్రజల జీవితాన్ని వ్యవ స్థాపించిన మీదట ద్వారక భూలోక స్వర్గంలాగా, అత్యంత వైభవంగా విల సిల్లింది. రైవతుడికి రేవతి అనే చక్కని కుమార్తె ఉన్నది. ఆమెను బలరాముడు పెళ్ళాడాడు. ఆ తరువాత కృష్ణుడికి వివాహ మయింది. అదొక కథ.

వింధ్యపర్వతానికి దక్షిణంగా విదర్భ దేశం ఉన్నది. అందులో కుండిననగరాన్ని భీష్మకు డనే రాజు పాలించేవాడు. ఆయనకు రుక్మి అనే కొడుకుండేవాడు. ఈ రుక్మి మేటి వీరుడు. అతను ద్రుము డనే రాజు వద్ద అనేక అస్త్రాలూ, పరశురాముడి నుంచి బ్రహ్మాస్త్రమూ పొందాడు. అతనికి మొదటి నుంచీ కృష్ణుడంటే ఎంతో మత్సరం ఉండేది.

ఆ రుక్మికి చెల్లెలు రుక్మిణి, గొప్ప తేజ స్వతి, అసమాన సౌందర్యవతి. ఆమె అందం మూడు లోకాలలోనూ ప్రఖ్యాతి పొందినది. ఆమె గొప్పతనాన్ని మూడు ముక్కలలో చెప్పవచ్చు, కృష్ణుడి ప్రేమకు పాత్రురాలయింది; మన్మధుడు ఆమె గర్భాన తిరిగి జన్మించాడు; మునీశ్వరు లామెను దేవతగా పూజించారు. అంత కంటె ఇంకేం చెప్పాలి?

రుక్మిణిని గురించి తన ఆప్తులు చెప్పు కుంటూంటే కృష్ణుడు విన్నాడు. అదే విధంగా కృష్ణుణ్ణి గురించి నలుగురూ చెప్పు కుంటూంటే రుక్మిణి విన్నది. ఇద్దరి మన సులలోనూ ఒకరి మీద ఒకరికి అనురాగం పుట్టు కొచ్చింది. దాని ఫలితంగా ఇద్దరూ మన్మధావస్థలకు గురి అయి, వేదన అను భవించారు.

"నేను వరించిన దాన్ని నాకు కాకుండా చెయ్యగలవాడు మూడు లోకాలలోనూ ఎవడున్నాడు ?” అన్న ధైర్యంతో ఉన్నాడు కృష్ణుడు. రుక్మిణి మనస్సులో కృష్ణుడి ఆలోచన తప్ప మరొక ఆలోచన లేకుండా పోయింది.

కాని రుక్మికి కృష్ణుడంటే బొత్తిగా పడదు. "నందగోపుడి యింట పశువులను కాచిన వాడికీ నాకూ వంతేమిటి?" అన్న ధీమాలో ఉన్నాడతను.

ఇలా ఉండగా, మగధ దేశంలోని గిరి ప్రజపురం నుంచి జరాసంధుడు రుక్మిణిని శిశుపాలుడి కివ్వవలసిందని కబురు చేశాడు. శిశుపాలుడు జరాసంధుడి పెంపుడు కొడుకు. వాస్తవానికి అతని తండ్రి దమఘోషుడు. అతని తల్లి వసుదేవుడి తోబుట్టువైన శ్రుత శ్రవ. దమఘోషుడూ జరాసంధుడూ జ్ఞాతులు. అందుచేత దమఘోషుడు, జరా సంధుడు కోరిన మీదట తన నలుగురు కొడుకులలోనూ పెద్దవాడైన శిశుపాలుణ్ణి అతడికి పెంపుడిచ్చాడు. 

శిశుపాలుడికి సునీధుడనే పేరు కూడా ఉన్నది.

జరాసంధుడు శిశుపాలుడికి రుక్మిణి నిచ్చి పెళ్ళి చెయ్యమని కబురు చెయ్య గానే రుక్మిణి తండ్రి అయిన భీష్మకుడు సరే నన్నాడు. నిజానికి భీష్మకుడి ఉదేశం రుక్మిణిని కృష్ణుడి రిస్తేనే బాగుంటుందని. కాని రుక్మికి కృష్ణుడంటే ద్వేషమని ఆయ నకు తెలుసు. రుక్మి తన చెల్లెలిని శిశు పాలుడికే ఇవ్వాలన్న ఉదేశం బయట పెట్టాడు. కొడుకుకు ఎదురు చెప్పటం ఇష్టం. లేక భీష్మకుడు సరేనన్నాడు.

తన కోరిక ఈడేరినందుకు జరాసంధుడు సంతోషించి తన ఆప్తులైన రాజు లందరికీ శుభలేఖలూ, ఆహ్వానాలూ పంపాడు. అంగ, వంగ, కళింగ, పౌండ్ర, పాండ్య, కాశ, కరూశ మొదలైన రాజు అనేకమంది పెళ్ళికి బయలుదేరారు. శిశుపాలుడికి తోడుగా వచ్చిన వారిలో కరూశ రాజకుమారుడు పౌండ్రక వాసుదేవుడూ, ఏకలవ్యుడి కొడుకు వీర్యవంతు డనేవాడూ, దంతవక్త్రుడి కొడుకు సువక్త్రు డనేవాడూ, ఇంకా అనేక మంది ఇతర రాజకుమారులూ ఉన్నారు. ఈ బలగాన్ని అంతనూ వెంట బెట్టుకుని జరాసంధుడు కుండిననగరానికి వచ్చాడు. 

రుక్మి అనేక రధాలనూ, ఏనుగులనూ, గుర్రాలనూ వెంట బెట్టుకుని ఎదురు వచ్చి, జరాసంధుడికి స్వాగతం తెలిపి, సమస్త మర్యాదలు జరిపి, వచ్చిన వారందరినీ విడుదులలో ఏర్పాటు చేశాడు.

ముహూర్తాలు పెట్టే వాళ్ళు వచ్చి, మర్నాడే లగ్నం ఉన్నదన్నారు. వెంటనే ఆ విషయం నగరమంతటా చాటింపు వేశారు. రాజులందరూ తమ తమ హెూదా లకు తగినట్టుగా సేనలను అలంకరించారు. శిశుపాలుడు పెళ్ళికొడుకై తన తోటి రాజ కుమారుల మధ్య ఉల్లాసంగా ఉన్నాడు.

ఇక్కడ ఇలా ఉంటే అక్కడ ద్వార కకు నారదుడు వచ్చాడు. తెల్లని శరీ రమూ, బంగారు రంగులో ధగధగా మెరిసే జుట్టుముడి, శరీరం మీద ధరించిన చర్మము, నెత్తిన నెమలి ఈకల గొడుగూ, గాలి తాకుడుకు నాదం చేస్తున్న వీణాఈ అవతారాన్ని ద్వార కాపురవాసులు అతి వింతగా చూశారు.

నారదుడు వచ్చాడని లోపలికి కబురు రాగానే, ఉగ్రసేనుడూ, వాసుదేవుడూ, కృష్ణ బలరాములూ, మిగిలిన యాదవ ప్రముఖులూ ఎదురు వచ్చి, నారదుణ్ణి సుధర్మ సభాభవనానికి తీసుకు పోయి, ఒక బంగారు ఆసనం మీద కూర్చోబెట్టి, అర్ఘ్యపాద్యాలిచ్చి సత్కరించారు.

కృష్ణుడు అందరినీ కూర్చోమని, తాను కూడా కూర్చుని, చేతులు జోడించి, "నువు క్షేమంగా ఉన్నావా, నారదా? లోకాలకూ, దేవతలకు క్షేమమే కదా? లోకాలన్నీ స్వేచ్ఛగా సంచరించే నీకు తెలియని వేముంటుంది? ఒకటి మాత్రం నిజం, నీ రాకకు ఏదో ప్రయోజనం ఉంటుంది. మా యాదవ వంశానికి ఏదో మంచి చెయ్య చానికే నువు వచ్చి ఉండాలి. నీ రాకవల్ల మేము ధన్యులమైనా మనటానికి ఎలాటి సందేహమూ లేదు,” అన్నాడు.

కృష్ణుడు చేసిన స్తోత్రపాఠాలకు ప్రీతుడై నారదుడు ఇలా అన్నాడు:

"నువు తలచుకున్నంత మాత్రాన సమస్త ప్రాణులకూ క్షేమం కలుగుతుంది గదా, అన్ని యుగాలలోనూ నీ పాద సేవ లోనే ముణిగితేలే నా బోటి వాళ్ళ క్షేమం వేరే అడగాలా ?"

ఇలా అని నారదుడు తన వీణను శ్రుతి చేసి, కృష్ణుడి సంతోషం కోసరం అత్యంత మధురంగా వాయించాడు; మీనావతారం దగ్గిర నుంచీ రామావతారం వరకూ గల అవతార కథలను పాటలుగా పాడాడు; తరువాత కృష్ణుడి బాలక్రీడలూ, పరాక్రమాలూ, కాళీయమర్దనమూ, గోవర్ధనోద్ధరణా, కంసవధా మొదలైనవి ప్రస్తుతించుతూ చక్కని పాటలు పాడాడు. ఆయన పాటలు విన్న వాళ్ళందరూ తన్మ యత్వంలో ముణిగిపోయారు. నారదుడు ఆ పాటలలో కీర్తించిన కృష్ణుడు తమకు ఆత్మీయుడూ, నాయకుడూ అయినందుకు వాళ్ళు ఎంతో గర్వపడ్డారు. నారదుడు పాట చాలించి, వీణ పక్కన పెట్టెయ్య గానే, ఏ మేమి కబుర్లు చెబుతాడో వినా లని చాలా ఆతురతగా ఉన్నారు.

అప్పుడు కృష్ణుడు నారదుడి కేసి నవ్వుతూ చూసి, "బాబూ, ఒక్కటి కూడా బీరు పోనివ్వకుండా నేను చేసిన పనులన్నీ ఏ కరు పెట్టావు, చాలు గాని నువ్విప్పుడు వచ్చిన పని ఏమిటో చెబుతావా? నువు ఊరికే వచ్చేవాడివి కావు," అన్నాడు.

అందుకు నారదుడిలా చెప్ప నారంభించాడు:

"దక్షిణ సముద్రతీరాన గోకర్ణ మనే మహా పుణ్యక్షేత్రం ఉన్నది. అక్కడ శంక రుడు దివ్య లింగరూపంలో ఉంటాడు. ఆ దేవుడి ముందు వీణ వాయించి, సంకీ ర్తన చేసి, భక్తితో అర్చన చేసి, అక్కడి నుంచి కదిలి కుబేరుణ్ణి చూద్దామని బయలు దేరాను. దారిలో కుండినపురాన్ని ఏలే భీష్మకుణ్ణి చూశాను. అతను కూడా నన్ను చాలా గౌరవించి, సంతోష పెట్టాడు. అయితే అక్కడ నాకు జరాసంధుడు మొదలుకుని భూమి మీద ఉండే రాజులందరూ కన పడ్డారు. వీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారని భీష్మకుణ్ణి అడిగాను. అడిగితే, తన కుమా ర్తెను రుక్మిణిని చేది దేశపు రాజైన శిశు పాలుడి కిచ్చి పెళ్ళి చేస్తూ అందరినీ ఆహ్వా నించాననీ, రేపు ఉదయమే లగ్నమనీ చెప్పాడు. సరే, ఈ ముక్క నీ చెవిని వేసి పోదామని వచ్చాను.”

నారదు డింకా ఇలా అన్నాడు: 

"నీ మనసులో ఆ రుక్మిణిని నువు కోరు కున్నావు. ఆ భీష్మకుడేమో ఆ పిల్లను నీ పగవాడి కిచ్చి పెళ్ళి చేయ సంకల్పిం చాడు. ఈ పెళ్ళి నిర్విఘ్నంగా జరిగి పోతుంది. ఇలాగే జరిగినట్టయితే నీకు ఎంత అపకీర్తి చూడు. అందుచేత ఏం చేస్తా వంటే, ఉగ్రసేన మహారాజును వెంట బెట్టుకుని, సాత్యకినీ, మిగిలిన యోధు లనూ, సేనలనూ తీసుకుని ఈ పూటే బయలుదేరు. అక్కడికి వెళ్ళి, అక్కడ చేరిన రాజుల మూకలను చావబాది, సంతోషంగా ఆ పిల్లను తెచ్చుకో. నీ దగ్గిర సుదర్శనచక్రం ఉండగా అసాధ్యమేమిటి? ఇంకో సంగతి చెబుతాను విను. నేను ఆకాశమార్గాన అదృశ్యంగా ఉండి, ఆ రుక్మిణి లీలోద్యానంలో తన చెలికత్తెల మధ్య కూర్చుని కంట తడి పెట్టుకుంటూం డటం చూశాను. నిన్నే తలుచుకోవటమూ, నిన్ను గురించే మాట్లాడటమూ, నిన్ను చూడటం కోసం ఆరాటపడటమూ తప్ప ఆ పిల్లకు మరో ప్రపంచమే ఉన్నట్టు లేదు. పాపం, ఆ పిల్ల స్థితి వర్ణనాతీతంగా ఉన్నది. నున్నటి చెక్కిళ్ళు వడిలిపోయి, కన్నీరుతో తడిసి ఉన్నాయి. మెడలో ఒంటి పేట హారం తప్ప లేదు. పాపిట చెదిరిపోయింది. జుట్టంతా రేగి ఉన్నది. ఊపిరి విడిచినప్పు డల్లా ప్రాణం పోతుందేమో నన్నట్టుగా తోస్తున్నది. శరీరం కంపించిపోతున్నది. చెలికత్తెలు ఎన్ని నైత్యోపచారాలు చేసినా ఏమీ ఫలితం లేకుండా ఉన్నది. వాళ్ళు నీ పేరు తప్ప మరెవరి పేరెత్తినా చచ్చి పోతానని చెలికత్తెలతో అంటున్నది. నిజంగా ఆమెను చూస్తే ఎంత కటికవాడికి కూడా గుండె కరిగిపోతుంది. సహజ కరుణా స్వభావుడివైన నువు ఏ మాత్రమూ చూస్తూ ఊరుకోదగదు. పాపం, ఆ రుక్మిణి ప్రాణాలు ఎలాగైనా కాపాడు. కాపాడటం నీ వంటి వాడికి ధర్మం. ఇక నేను వెళ్ళివస్తాను.” 

ఈ మాట కాస్తా అని నారదుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)