కరవీరపురం చేరుతూనే కృష్ణుడు అక్కడి కావలివాళ్ళతో తాను ఫలానా అనీ, సృగాల వాసుదేవుడితో యుద్ధానికి తామంతా వచ్చా మనీ, వెంటనే ఆ సృగాలవాసుదేవుడు వచ్చి యుద్ధం చెయ్యవలిసిందనీ చెప్పి కబురు చేశాడు. వాళ్ళు వెళ్ళి తమ రాజుకు యీ వార్త చెప్పారు.
ఆ మాట వింటూనే సృగాలవాసుదేవుడు కోపంతో కళ్ళెర్ర చేసి, పూర్వం సూర్యుడు తనను మెచ్చి ఇచ్చిన బంగారు రధం ఎక్కి, బంగారు కవచం ధరించి, అమోఘ మైన విల్లూ, బాణాలూ, ఖడ్గమూ మొద లైన ఆయుధాలు వెంట తీసుకుని, సైన్యాన్ని వెంట రావద్దని చెప్పి, ఒంటరిగా బయలు దేరి వచ్చాడు.
యమధర్మరాజు లాగా వచ్చే సృగాల వాసుదేవుణ్ణి చూసి బలరామకృష్ణులు సంభ్రమం చెందారు. దమఘోషుడు వారిద్దరికీ ఉత్సాహం కలిగించాడు. తర వాత కృష్ణుడు తన రధాన్ని శత్రురధానికి ఎదురుగా నడిపించుకుంటూ వెళ్ళాడు. ఆ మీద ఇద్దరికీ భయంకరమైన ద్వంద్వ యుద్ధం జరిగింది.
ఒకరి పైన ఒకరు బాణవర్షం కురిపిం చారు. ఒకరు వేసిన అస్త్రాలను ఒకరు ఛేదించారు. కృష్ణుడు తన విరోధి విల్లు విరగగొట్టి, సారథిని చంపాడు. సృగాలవాసు దేవుడు లక్ష్యపెట్టక, మరొక విల్లు తీసు కుని, రథాన్ని తానే నడుపుకుంటూ కృష్ణుడితో, "గోమంతం దగ్గిర కొందరు రాజులను జయించి, ఆ గర్వంతో ఇక్కడికి గర్వంతో ఇక్కడికి వచ్చావు. ఆ రాజులు మూఢులు, ఆల్పులు. నేను ఒంటరిగా వచ్చాను. నువు కూడా ఒంటరిగానే నాతో యుద్ధానికి వచ్చావు. ఇది ధర్మయుద్ధం. ఈ ప్రపంచంలో ఇద్దరు వాసుదేవు లుండటానికి వీల్లేదు. అందుచేత నిన్ను చంపి, నేనొక్కణ్ణి వాసుదేవుడని పించుకుంటాను,” అన్నాడు.
కృష్ణుడు వెటకారంతో, "నీలో ఇంకా యుద్ధ వాంఛ ఉన్నట్టయితే నీ ప్రతాపం చూపించు, చూస్తాను. తరువాత నేను చేసే దేదో చేస్తాను. దాన్ని గురించి ఇప్పుడు చెప్పవలిసిన పని లేదు,” అన్నాడు.
సృగాలవాసుదేవుడు అతి వేగంగా కృష్ణుడి పై బాణాలూ, తోమరాలూ, చక్రాలూ, గొడ్డళ్ళూ, పరిఘలూ, ఖడ్గాలూ విసిరి, చీకటి కమ్మే లాగా చేశాడు.
కృష్ణుడది చూసి, "నీ శక్తి చూపావు, చూశాను. ఇదుగో నేను చేయబోతున్నది,” అంటూ తన చక్రాయుధాన్ని అతడి మీద ప్రయోగించాడు. అది మహాభయంకరంగా తిరుగుతూ మెరుపులా వెళ్ళి, సృగాలవాసు దేవుడి తలను రెండుగా నరికి, కృష్ణుడి చేతికి తిరిగి వచ్చింది.
ఈ విధంగా సృగాలవాసుదేవుడు విని, అతని యుద్ధంలో చనిపోయాడని అంతఃపుర కాంతలు గొల్లున ఏడుస్తూ తమ భర్త పడిపోయిన చోటికి వచ్చారు. పట్టపు రాణి తన కొడుకైన శక్రదేవుణ్ణి తెచ్చి, కృష్ణుడి పాదాల మీద పడేసి, ఏడ్చింది. కృష్ణు డామె నోదార్చి, మంత్రులనూ సామంతులనూ, పౌరముఖ్యులనూ, పురో హితులనూ పిలిపించి, శక్రదేవుడికి రాజ్యాభిషేకం చేయించాడు.
తరవాత కృష్ణుడు మధుకకు తిరిగి పోతా డని తెలిసి అతని మేనమామ అయిన దమఘోషుడు, వెళ్ళివస్తానని చెప్పి, తన సైన్యంతో సహా చేదిదేశానికి వెళ్ళిపోయాడు.
బలరామకృష్ణులు అయిదు రోజులు ప్రయాణించి ఆరో నాటికి మధురా నగ రాన్ని చేర వచ్చారు. నగరం అంత దూరాన కనబడగానే కృష్ణుడు పాంచజన్యం పూరిం చాడు. ఆ శంఖనాదం విని యాదవులు, ఉగ్రసేనుణ్ణి, ప్రధాన పురోహితులనూ వెంటబెట్టుకుని, ఏనుగులనూ, గుర్రాలనూ, సైనికులనూ ఆయత్తపరిచి, గొడుగులు తీసు కుని, మంగళవాద్యాలతో సహా ఎదురు వచ్చారు. వందిమాగధుల స్తోత్రాలూ, బ్రాహ్మణుల ఆశీర్వాదాలూ మారుమోగు తూండగా బలరామకృష్ణులు మహావైభవంగా మధురా ప్రవేశం చేశారు.
కృష్ణబలరాముల చేత ఓడిపోయి మగధకు తిరిగి పోయిన జరాసంధుడు అవ మానంతో కుమిలిపోతున్నాడు. అంతమంది రాజులనూ, అంత సేననూ వెంట పెట్టుకుని పోయి, ఇద్దరు యాదవ కుమారుల చేతిలో ఓడి పారిపోవటం కన్న సిగ్గుబాటు ఇంకే ముంటుంది? ఈ అవమానంతో అతనికి మనశ్శాంతి లేకుండా పోయింది.
చివరకు జరాసంధుడు రాజుల నంద రినీ తిరిగి సమావేశపరిచి, " పాపిష్ఠి దేవుడు అనుకూలించక పోయేసరికి మనం, ఇంత బలపరాక్రమా లుండి కూడా ఇద్దరు గోప బాలకుల చేతిలో దెబ్బ తిన్నాం. మనకు కలిగిన ఈ అపఖ్యాతి శాశ్వతంగా ఉండి పోతుంది. అలా కాకుండా చెయ్యాలంటే మనం ఆ యాదవు లిద్దరినీ ఎలాగైనా ఆ చంపటం తప్ప మరొక మార్గం లేదు. మీ రందరూ మీ, మీ సైన్యాలతో మధుర పైకి బయలుదేరండి. మన బలాల ముందు క్షుద్రులైన యాదవులు నిలవటం కల్ల," అని చెప్పాడు.
ఈ మాటకు అందరూ సమ్మతించారు. ఎందుచేతంటే, వారంతా గోమంతం దగ్గిర అవమానం పొందినవారే. పై పెచ్చు వారిలో జరాసంధుడి దాయాదులూ, గోడలు అక్కడక్కడా బద్దలు కొట్టాలి. సగోత్రీకులూ, మిత్రులూ, బంధువులూ ఉన్నారు. పౌండ్ర, కళింగ, దంతవక్త్ర, శిశు పాల, సాల్వ, రుక్ష్మి, గాంధార, త్రిగర్త, భగదత్తులూ, మరికొందరూ కృష్ణద్వేషులు. అంగ, వంగ, విదేహ, కాశ, కరూశ, మద్ర, పాండ్య మొదలైన దేశాల రాజులు కూడా జరాసంధుడి పక్షాన పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు. తిరిగి ఇరవైఒక్క అక్షౌహిణీల సేన సమకూడింది. వాళ్ళు అంచె ప్రయా ణాల మీద మధురానగరాన్ని చేరవచ్చి, నగరం చుట్టూ ఉండే తోటలలో యమున పొడుగునా విడిశారు.
కృష్ణుడు మొదలైనవాళ్ళు కోట గోడ లెక్కి చూస్తే జరాసంధుడి సేన ప్రళయానికి ముందుండే సముద్రం లాగా కన బడింది. కృష్ణుడు బలరాముణ్ణి చూసి నవ్వుతూ, "భూభారం తగ్గించటానికి దేవుడి ఏర్పాటు చేసినట్టున్నది,” అన్నాడు.
ఇద్దరూ కలిసి సేనలతో శత్రువును ఎదిరించటానికి నిశ్చయించారు.
జరాసంధుడు తన వెంట వచ్చిన రాజులతో తన యుద్ధ తంత్రు ఈ విధంగా చెప్పాడు. వెంటనే సేనలు మధురా నగరాన్ని చుట్టుముట్టాలి. గునపాలతో కోట నగరాన్ని పూర్తిగా నాశనం చెయ్యాలి. గోమంతపర్వతాన్ని చుట్టుముట్టినప్పుడు ఎవ రెవరు ఏయే దిక్కులలో నిలబడ్డారో, అదేవిధంగా మధుర చుట్టూ కూడా నిల బెట్టాడు జరాసంధుడు.
ఈసారి యాదవులు జరాసంధుడితో యద్దమంటే జంకలేదు. నిజానికి జరా సంధుడి బలాలముందు తమ బలాలు ఎందుకూ పనికిరావు, కాని తమ వెంట కృష్ణుడున్నాడు. అదే వారి ధైర్యం. గరుత్మం తుడి జెండా గల రథంలో చక్రం మొదలుగా గల ఆయుధాలు పెట్టుకుని కృష్ణుడూ, నాగలి, రోకలి మొదలైన ఆయుధాలు వెంటబెట్టుకుని బలరాముడూ యుద్ధానికి వస్తుంటే చాలా కనులపండువుగా కనిపిం చింది. వాళ్ళిద్దరూ ఉగ్రసేనుడితోసహా తమ సేనకు ముందుండి నడుస్తూ, జరాసంధుడి సేనను సమీపించారు. తన సేనకు ముందు నిలబడి ఉన్న జరాసంధుడు వాళ్ళను ఎదుర్కొని, కృష్ణుడి పక్కనే ఉన్న ఉగ్ర సేనుడితో, "భోజవంశం వారు రాజ్యా లేలితే, యాదవులు వారికి సేవచేస్తారు. అలాటి భోజవంశంలో పుట్టి కూడా నువు వంశ ప్రతిష్ఠ పోగొట్టుకున్నావు. నీ కన్న మూర్ఖుడుంటాడా? ఈ కృష్ణుడు నీ కొడు కును చంపి రాజ్యం కాజేసి, ఉత్త సింహాసనం మటుకు నీ కిచ్చాడు. వాడు పెట్టే పిండాకూడు తింటున్నావు. ఎందుకు? ఏళ్ళు వచ్చాయి! నీదీ ఒక జన్మేనా? సిగ్గు లేక ఈ భోగం ఎలా అనుభవిస్తున్నావు? ఈ కృష్ణుడికి నువు బంటువు తప్ప రాజువు కావు,” అన్నాడు.
కృష్ణుడిది విని మండిపడి, "గౌరవ నీయుడైన ఉగ్రసేనుణ్ణి నిందించటంలోనే ఉన్నదా ఏమిటి నీ పౌరుషం? ఏమైనా అనదలిస్తే నన్నే అను. నీకు నేనేగదా అసలు విరోధిని? ఆ రోజు గోమంతం దగ్గిర నాతో యుద్ధం చేసినవాడవేగదా. హాస్యాస్ప దంగా మాట్లాడకు. ఈసారైనా పారిపోకుండా నిలిచి యుద్ధం చెయ్యి, నా ప్రతాపం పూర్తిగా చూతువుగాని," అంటూ సంధుణ్ణి, సారథినీ బాణాలతో కొట్టి, అతని విల్లు విరగగొట్టాడు.
ఉభయపక్షాల వీరుల మధ్యా తీవ్రంగా యుద్ధం సాగింది. ఈ యుద్ధంలో ఉగ్ర సేనుడు కూడా గొప్ప పరాక్రమం ప్రదర్శిం చాడు. ఒకసారి కృష్ణుడికి రుక్మికి ద్వంద్వ యుద్ధం జరిగింది. అందులో రుక్మి చిత్తుగా ఓడి తప్పుకు పోయాడు.
బలరాముడు చెలరేగి తన పక్షంవాళ్ళను మందను తోలినట్టు తోలటం చూసి జరా సంధుడు అతన్ని ప్రతిఘటించాడు. ఇద్దరూ ఒకరి రథాలొకరు ధ్వంసం చేసుకుని, గదా యుద్ధానికి దిగారు. వాళ్ళ యుద్ధం చూడ టానికి మిగిలినవాళ్ళంతా యుద్ధం మానే శారు. వాళ్ళిద్దరూ ఒకరి దెబ్బలు ఒకరు తప్పించుకుంటూ, ఒకరి నొకరు గదలతో మోదుకుంటూ, రక్తధారలు కార్చుతూ, భూమి దద్దరిల్లేలాగా, రెండు పెద్ద పులుల మాదిరి యుద్ధం చేశారు. చివరకు ఎవరిని ఎవరూ చంపకుండానే ఆ గదా యుద్ధం ముగిసింది.
ఈ విధంగా కొన్ని రోజులపాటు యుద్ధం జరిగింది. జరాసంధుడు కోరిన విధంగా అతనికి విజయం లభించలేదు. అతని బలాలు రోజు రోజుకూ క్షీణిస్తున్నాయి. అతను ప్రాణం విసిగి, దైవం తనకు అను కూలించటం లేదనుకుని, తన పక్షాన వచ్చిన రాజులనూ, సేవలనూ వెంట బెట్టుకుని మగధకు తిరిగిపోయాడు.
కాని జరాసంధుడు అంకటితో వదల లేదు. ఇదేవిధంగా అతను మధుర మీదికి పద్దెనిమిదిసార్లు దండెత్తి వచ్చాడు. కృష్ణుణ్ణి చంపటం జరాసంధుడి వల్లా కాలేదు, జరా సంధుణ్ణి చంపటం కృష్ణుడి వల్లా కాలేదు. కారణం, జరాసంధుడు మరొకరి చేతిలో చావవలిసి ఉన్నాడు.
రోజులు సుఖంగా గడుస్తున్నాయి. బల రాముడికి తన చిన్ననాటి విషయాలన్నీ జ్ఞాపకం వచ్చి, ఒకసారి గోకులం చూడా లనిపించింది. కృష్ణుడితో చెబితే అతన్ని వెళ్ళిరమ్మన్నాడు, కాని తాను బయలుదేర లేదు. బలరాముడు అరణ్యప్రాంతాలకు తగిన వేషం వేసుకుని వ్రేపల్లెకు వెళ్ళాడు. అతన్ని అంత దూరంలోనే చూసి గోపకులు పరమానందంతో ఎదురు వెళ్ళారు. బల రాముడు కొందరికి దణ్ణాలు పెట్టాడు, కొందరి చేత పెట్టించుకున్నాడు, మరి కొందరిని కౌగిలించుకున్నాడు. గోపిక లందరూ అతని చుట్టూ మూగితే వారం దరినీ ప్రేమగా పలకరించాడు.
వృద్ధగోపులు అతన్ని తమ మధ్య కూర్చోబెట్టుకుని ఇష్టాగోష్ఠి జరిపారు.
"నాయనా, నువు రావటం గొప్ప విశేషం. ఎటువంటి వాళ్ళకైనా జన్మస్థలం మీద ప్రేమ పోదనటానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి? మీ అన్న దమ్ములు చాణూరముష్టికులను చంపారు, కంసుణ్ణి హతమార్చారు, గోమంతం దగ్గిర మహా సేనను జయించారు, సృగాల వాసుదేవుణ్ణి చంపారు, ఎంతో కీర్తి సంపాదించారు. అయినా నువు గోవులను కాచిన చోటు వెతుక్కుంటూ వచ్చావు ! " అన్నారు గోపవృద్ధులు.
"మీరు పెంచబట్టేగదా మాకీ ఖ్యాతి వచ్చింది? మీవంటి బంధువులు కావాలంటే మటుకు దొరుకుతారా ? నాకూ, నా తమ్ము డికీ ఆ రాజభోగాల మీద మనసు పోదు. ఇక్కడ చిన్నతనంలో గడిపిన రోజులు మరుద్దామన్నా మరవలేం,” అన్నాడు బలరాముడు.
ఈ మాటకు అందరూ సంతోషించి అతను తాగటానికి, తినటానికి ఉత్తమమైన పానీయాలూ, భక్ష్యాలూ పెట్టి ఎంతో ప్రేమతో ఆదరించారు.