1. కాలనేమి కథ | Demon Kalanemi Vadh | Lord Krishna Avatar Story in Telugu

writer
0
ఆదికాలంలో కాలనేమి అనే గొప్ప రాక్షసుడుండేవాడు. వాడికి నూరు చేతులూ, నూరు తలలూ ఉండేవి. చూడటానికి మహాభయంకరంగా, నూరు శిఖరాలు గల నల్లని పర్వతం లాగుండేవాడు. అసాధారణమైన బలానికి తోడు, వాడు తపస్సు చేసి బ్రహ్మ నుంచి గొప్ప వరాలు కూడా పొంది బాగా మదించాడు.

ఆ కాలంలో దేవదానవులకు తరుచు యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఒకప్పుడు దానవులు గెలిచేవారు, ఒకప్పుడు దేవతలు గెలిచేవారు. ఒకసారి యుద్ధంలో దేవతలు ఘనవిజయం సాధించి, దానవులను తరిమి కొట్టారు. అది తెలిసి కాలనేమికి మహాగ్రహం వచ్చింది. వాడు దానవనాయకులందరినీ కూడగట్టి, వారిని యుద్ధానికి ప్రోత్సహించి, సైన్యాలను సమకూర్చుకుని, ఇంద్రుడి పైకి యుద్ధానికి వచ్చాడు. ఇంద్రుడి నాయకత్వాన దేవతలూ, కాలనేమి నాయకత్వాన దానవులూ తలపడి, మహాభయంకరంగా యుద్ధం చేశారు.

ఆ యుద్ధంలో కాలనేమి ఇంద్రుడితో బాటు మిగిలిన దిక్పాలకులను కూడా చిత్తుగా ఓడించేశాడు. మూడు లోకాలూ అతని అధీనమయాయి. విష్ణుమూర్తి దేవతలకు జరిగిన పరాభవాన్ని చూస్తూ కూడా, కాలనేమికి కాలపరిపాకం కాలేదని గ్రహించి ఏమీ చెయ్యకుండా ఊరుకున్నాడు.

కాలనేమికి మాత్రం విష్ణువును కూడా జయించాలని బుద్ధి పుట్టింది. అతను విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి, "నీవు మా మధుకైటభులను చంపావు, మా దైత్యులలో మణిలాటి హిరణ్యకశిపుణ్ణి గోళ్ళతో చీల్చి చంపావు, మా బలిని పాతాళానికి తొక్కేసి, మూడు లోకాలూ ఆక్రమించావు. మా దైత్య స్త్రీల కన్నీరుతో దేవతలనే పొలాన్ని తడిపి కాపాడావు. అందుకు పగతీర్చుకోవటానికి వచ్చాను,” అన్నాడు.

"పోతరించి కారుకూతలు కూసిన మాత్రాన నీచేత ఏమవుతుంది? శూరుడైన వాడెక్కడైనా ప్రగల్భాలాడతాడా ? బ్రహ్మ ఇచ్చిన వరాల మూలాన పొగరెక్కి ఒళ్ళు తెలియని పనులు చేశావు. పూర్వం దానవులకు పట్టిన గతే నీకు పట్టబోతుంది. నిన్ను తప్పక చంపి దేవతలకు వారి వారి స్థానాలు తిరిగి ఇప్పిస్తాను," అని విష్ణుమూర్తి అన్నాడు.

ఆ మాటలు విని కాలనేమి ఉగ్రుడై, ఘోరమైన తన గదను గరుత్మంతుడికి గురి చూసి విసిరి, పెద్ద పెడబొబ్బ పెట్టాడు. అది గరుత్మంతుణ్ణి, వజ్రాయుధం కొండను తాకినట్టు తాకింది. విష్ణువు నిర్ఘాంతపోయాడు. ఆయన గరుత్మంతుడి బాధ పోగొట్టి, తన శరీరంతోబాటు గరుడుడి శరీరం కూడా పెంచి, చేతిలోకి తన సుదర్శనచక్రం తీసుకుని కాలనేమి పై విసిరాడు. అది వెళ్ళి కాలనేమి తలలనూ, చేతులనూ తరిగిపారేసింది. ఆ రాక్షసుడి శరీరం మటుకు ఇంకా అలాగే నిలబడి ఉండటం చూసి గరుత్మంతుడు తన రెక్కలు విసిరి, గాలి పుట్టించి ఆ శరీరాన్ని పడిపోయేలాగుచేశాడు. ఇది చూసి కాలనేమి అనుచరులైన రాక్షసవీరులు బెదిరి, ఎక్కడివాళ్ళక్కడ కుక్కిన పేలలాగా అయి పోగా, విష్ణువు వాళ్ళను చంపేశాడు.

రాక్షసులు చావగానే బ్రహ్మా, ఇంద్రుడూ, ఇతర దేవతలు విష్ణువును చూడవచ్చి, ఆయనను ప్రశంసించారు.

"ఇంక మీకు రాక్షస భయం ఉండదు. ఎప్పటిలాగే మీరు మీమీ లోకాలను నిశ్చింతగా ఏలుకోండి. ఇక యజ్ఞాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కాని దుష్టబుద్ధులైన రాక్షసులను మాత్రం ఒక కంట కనిపెట్టి ఉండండి,” అని విష్ణువు వారితో చెప్పాడు.

తరువాత ఆయన పాలసముద్రానికి వెళ్ళి, తన శేషపాన్పుపైన పడుకుని యోగనిద్రలో ముణిగిపోయాడు. విష్ణువు యోగనిద్రలో ఉండగానే కృతయుగం వెళ్ళి పోయింది, త్రేతాయుగం కూడా అంతానికి వచ్చింది. ఆ సమయంలో భూదేవి ప్రజా భారం హెచ్చయిందని ఆక్రోశించింది. ఆ ఆక్రోశం విని దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి, బ్రహ్మను వెంటబెట్టుకుని విష్ణు వును చేరి, ఆయనను యోగనిద్ర నుంచి మేల్కొలిపారు.

విష్ణువు మెల్లిగా కళ్ళు తెరిచి దేవతలను చూసి, "ఏం ఇలా వచ్చారు? మీరంతా సుఖంగా ఉన్నారు గద? లోకాలు రాక్షస బాధ లేకుండా సుఖంగా ఉన్నాయి గద?" అని కుశలప్రశ్నలు వేశాడు.

బ్రహ్మ చేతులు జోడించి, "మహాను భావా, రాజుల మధ్య ఏ విధమైన శత్రు త్వాలూ లేవు. సత్యమూ, ధర్మమూ

స్థిరంగా ఉన్నాయి. యాగాలు చక్కగా జరుగుతున్నాయి, దేవకార్యాలూ, పితృ కార్యాలూ తృప్తికరంగా సాగుతున్నాయి, ఎవరికీ రోగాలూ, రొష్టులూ లేవు. మాన వులు సంపూర్ణాయువు కలిగి ఉన్నారు. ఏ పట్టణం చూసినా, పల్లె చూసినా అపార మైన జనసంఖ్య కలిగి ఉన్నది. జనభారం మొయ్యలేనో అని భూదేవి ఆక్రోశిస్తున్నది. ధర్మహాని కలగకుండా ఈ భూభారాన్ని తగ్గించే ఉపాయ మేదో నీవే చూడాలి. నీవు మేరుపర్వతానికి దయచేసి, అక్కడ మా అందరికీ కర్తవ్యబోధ చెయ్యవలసిందని నా ప్రార్థన,” అన్నాడు.

విష్ణువు లేచి కూర్చుని తన ఆభరణాలు చక్కజేసుకుని, బట్ట బిగించుకుని, నిల బడి, తన శంఖచక్రాది ఆయుధాలు ధరించి, గరుడవాహనారూఢుడై క్షణంలో మేరుపర్వ తానికి వచ్చాడు. ఆ పర్వతం మీద పూర్వం విశ్వకర్మ నిర్మించిన దివ్యమైన సభ ఒకటి ఉన్నది.

ఆ సభలో ఉన్నతాసనం మీద మహా విష్ణువు కూర్చున్నాడు. మిగిలిన వారంతా ఉచితాసనాల పైన కూర్చున్నారు. ఆ సభకు యక్షులూ, గంధర్వులూ, సిద్ధులూ, విద్యా ధరులూ, నాగులూ మొదలైన వారంతా కూడా వచ్చారు.

అక్కడికి భూదేవి పుట్టెడు దిగులుతో వచ్చింది. ఆమెను చూడగానే అందరూ ఒక్కసారిగా మాట్లాడారు. వాయుదేవుడు చెయ్యెత్తి ఆ కలకలమంతా వారించి, భూదేవితో ఆమె అక్కడికి వచ్చిన పని ఏదో చెప్పమన్నాడు.

ER మీకు తెలియనిదేమున్నది? రాజులు అపారంగా పెరిగిపోయారు. ప్రజాభారంతో కృశించిపోతున్నాను. ఈ భారం తగ్గకపోతే నేను బతకలేను. ఈ విష్ణుమూర్తి తలచు కుంటే ఈ పని జరుగుతుంది. పెద్దలు మీరంతా కూడా ఉన్నారు,” అన్నది భూదేవి విచారంగా.

విని భూదేవి చెప్పిన ఈ మాటలు సభలోవాళ్ళు తమలోతాము మాట్లాడుకుని, బ్రహ్మదేవుడితో, " భూదేవి బాధ మాన్చటం మన కర్తవ్యం. నీవు పెద్దవాడవు, సృష్టి కర్తవు," అన్నారు.

అప్పుడు బ్రహ్మ లేచి సభాసదులతో ఇలా చెప్పాడు:

" ఒకనాటి సాయంకాలం నేనూ, కశ్యప మహాముని సముద్రతీరాన కూర్చుని తత్వ విచారం జరుపుతూండగా, చంద్రోదయం వేళ గంగాసంగమం చేత పొంగిన సము ద్రుడు ఆకాశమంత ఎత్తులేచి, మేము

కూర్చున్న ప్రదేశమంతా ఆక్రమించటమే గాక మమ్మల్ని కూడా తడిపాడు. నేను నవ్వుతూ, "ఇదేం పని? శాంతించు!" అన్నాను. వెంటనే సముద్రుడు శాంతించి, మానవరూపం ధరించి, గంగతో సహా మా ఎదట నిలిచాడు. అప్పుడు నేను భవిష్యత్తు గురించి ఆలోచించి, "సము ద్రుడా, ఇలా రాజసం చూపావు గనక భూమిపై రాజువుగా జన్మించు. నేను చెప్పు గానే శాంతించావు గనక శంతను డనే పేరుతో, ఈ గంగనే భార్యగా చేసుకుని జీవించు,” అన్నాను. సముద్రుడు. నాకు నమస్కరించి, "పర్వపువేళా, గాలి ఎగ

t వీచినప్పుడూ, చంద్రోదయవేళా పొంగటం నా స్వభావ లక్షణం. అందులో దుర్బుద్ధి ఏమీ లేదు. అలాటప్పుడు నన్ను శపించటం ధర్మమా ?" అని దీనంగా అన్నాడు. 'నాయనా, లోకహితం కోరి నేనీ మాట అన్నాను. నీవు పవిత్రమైన భరతవంశంలో పుట్టు. ఈ గంగకు వసువులను కని, వారికి వసిష్ఠు డిచ్చిన శాపం తీర్చు. తరవాత సత్యవతి అనే ఆమెకు వంశోద్ధారకులైన కొడుకు లిద్దరిని కని జన్మ చాలించు,' అని చెప్పాను. ఆ శంతనుడి కైన విచిత్ర వీర్యుడికి ధృతరాష్ట్రుడూ, కొడు పాండుడు అనే కొడుకులు కలుగుతారు. ధృతరాష్ట్రుడికి నూరుగురు కొడుకులూ, పాండుడికి అయిదుగురు కొడుకులూ పుట్టు తారు. ఆ నూరుగురికీ, అయిదుగురికి మధ్య రాజ్యకాంక్ష కారణంగా మహాయుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో భూమిపై గల రాజులందరూ నశిస్తారు. అనేక లక్షల ఏను గులూ, గుర్రాలూ, సైనికులూ పీనుగులై పోతారు. భూభారం తగ్గిపోయి ఈ భూదేవి సుఖపడుతుంది. కలహకారకుడైన కలి అంశ ధృతరాష్ట్రుడి భార్య గర్భానా, యముడి అంశ పాండుడి భార్య గర్భానా పుట్టటం జరుగుతుంది. ఇంకా అనేకమంది

కూర్చున్న ప్రదేశమంతా ఆక్రమించటమే గాక మమ్మల్ని కూడా తడిపాడు. నేను నవ్వుతూ, "ఇదేం పని? శాంతించు!" అన్నాను. వెంటనే సముద్రుడు శాంతించి, మానవరూపం ధరించి, గంగతో సహా మా ఎదట నిలిచాడు. అప్పుడు నేను భవిష్యత్తు గురించి ఆలోచించి, "సము ద్రుడా, ఇలా రాజసం చూపావు గనక భూమిపై రాజువుగా జన్మించు. నేను చెప్పు గానే శాంతించావు గనక శంతను డనే పేరుతో, ఈ గంగనే భార్యగా చేసుకుని జీవించు,” అన్నాను. సముద్రుడు. నాకు నమస్కరించి, "పర్వపువేళా, గాలి ఎగ

t వీచినప్పుడూ, చంద్రోదయవేళా పొంగటం నా స్వభావ లక్షణం. అందులో దుర్బుద్ధి ఏమీ లేదు. అలాటప్పుడు నన్ను శపించటం ధర్మమా ?" అని దీనంగా అన్నాడు. 'నాయనా, లోకహితం కోరి నేనీ మాట అన్నాను. నీవు పవిత్రమైన భరతవంశంలో పుట్టు. ఈ గంగకు వసువులను కని, వారికి వసిష్ఠు డిచ్చిన శాపం తీర్చు. తరవాత సత్యవతి అనే ఆమెకు వంశోద్ధారకులైన కొడుకు లిద్దరిని కని జన్మ చాలించు,' అని చెప్పాను. ఆ శంతనుడి కైన విచిత్ర వీర్యుడికి ధృతరాష్ట్రుడూ, కొడు పాండుడు అనే కొడుకులు కలుగుతారు. ధృతరాష్ట్రుడికి నూరుగురు కొడుకులూ, పాండుడికి అయిదుగురు కొడుకులూ పుట్టు తారు. ఆ నూరుగురికీ, అయిదుగురికి మధ్య రాజ్యకాంక్ష కారణంగా మహాయుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో భూమిపై గల రాజులందరూ నశిస్తారు. అనేక లక్షల ఏను గులూ, గుర్రాలూ, సైనికులూ పీనుగులై పోతారు. భూభారం తగ్గిపోయి ఈ భూదేవి సుఖపడుతుంది. కలహకారకుడైన కలి అంశ ధృతరాష్ట్రుడి భార్య గర్భానా, యముడి అంశ పాండుడి భార్య గర్భానా పుట్టటం జరుగుతుంది. ఇంకా అనేకమంది

దేవముఖ్యుల అంశలు వేరువేరు మానవ జన్మలెత్తుతాయి.”

విని బ్రహ్మ చెప్పిన ఈ మాటలు అందరూ ఆయనను అభినందించారు. అదే సమయంలో నారదుడా సభకు విచ్చేశాడు. ఆయన వీణ వాయిస్తూ పాట పాడి, విష్ణు వునూ, దేవతలనూ రంజింపజేసి, విష్ణు వుతో, "దేవా, భూమిపై గల రాజకులాన్ని నిర్మూలించటానికి ఈ దేవతలందరూ తల పెట్టిన ఈ పని నీవు పూనుకోకుండా ఎలా సఫలమవుతుంది? భూమి పైన నీ అంశ ఒకటి అవతరించాలి, మిగిలినవారి అంశ లకు ఉత్సాహప్రేరణ లివ్వాలి, అప్పుడు

అలా ఈ దేవకార్యం నెరవేరదు. అది ఉండగా, ఈ దేవాంశలతో పుట్టేవారి కెవ్వరికీ సాధ్యంకాని పని మరొకటి ఉన్నది. దాన్ని గురించి హెచ్చరించటానికే నేనింత త్వరగా ఇక్కడికి వచ్చాను. అదేమిటంటే, దేవాసుర యుద్ధంలో నీచేత చచ్చిన రాక్షసు లందరూ భూమి పైన మానవజన్మ లెత్తి ఉన్నారు. రాముడి చేత రావణుడు చచ్చిన అనంతరం ఆ రాక్షసుడి మేనల్లుడూ, మధు వనే వాడి కొడుకూ అయిన లవణు డనే వాడు, రాముడి ఆజ్ఞపై శత్రుఘ్నుడి చేత చంపబడ్డాడు. శత్రుఘ్నుడు అక్కడి మధు పనాన్ని నిర్మూలించి, మధుర అనే పేరు గాని

గల మహానగరం నిర్మించాడు. అక్కడ అనేక తరాల రాజులు పాలించి దాన్ని వృద్ధికి తెచ్చారు. ఇప్పుడక్కడ ఆనాటి కాలనేమి, కంసుడనే పేరుతో ఉగ్రసేను డనే భోజ వంశపురాజుకు కొడుకుగా పుట్టి ఉన్నాడు. వాడికి పూర్వజన్మ దుర్వాసన ఇంకా అలాగే ఉన్నది. వాడు తన తండ్రిని చెరలో పెట్టి, తానే `రాజై కూర్చున్నాడు. ఇలాగే అనేక మంది రాక్షసులు తిరిగి భూమిపై పుట్టారు. కాలనేమి మిత్రులందరూ కంసుడికి భృత్యు లుగా పుట్టి కాళిందీతీరానా, బృందావనం లోనూ, మధురాపురం లోనూ, ఇతరచోట్లా ఉన్నారు. కొందరు రాక్షసులు ప్రాగ్జ్యోతి షంలో పుట్టి నరకాసురుడికి సహాయంగా ఉన్నారు. ఈ రాక్షసుల నందరినీ చంప టానికి నీవు మానవావతార మెత్తవలిసి ఉన్నది,” అన్నాడు.

విష్ణువు ఈ మాటలు విని, బ్రహ్మ కేసి నేను అలాగే అవతార మెత్తు తిరిగి,

తాను. సృష్టికర్త నన్నెక్కడ పుట్ట మంటాడు?” అన్నాడు.

దానికి బ్రహ్మ, " వరుణుడి యజ్ఞధేను వులను కశ్యపుడు కాజేశాడు. కశ్యపుడి భార్యలైన అదితీ, సురభి వాటిని వరుణు డికి తిరిగి ఇయ్యకుండా అడ్డపడ్డారు. వరు ణుడు నాతో ఈ సంగతి మొర పెట్టుకోగా, నేను కశ్యపుణ్ణి, అతని భార్యలనూ మానవ జన్మ లెత్తమని శపించాను. ఆ కశ్యపుడు వసుదేవుడై పుట్టి కంసుడి ఆవులకు అధి పతిగా ఉన్నాడు. కశ్యపుడి భార్యలు దేవకీ, రోహిణీ అనేవాళ్ళుగా పుట్టి, వసు దేవుడికి భార్యలై ఉన్నారు. నీవు నీ అంశను రెండుగా విభజించి, వసుదేవుడి భార్య లిద్దరి యందూ ప్రవేశపెట్టు," అని విష్ణు మూర్తితో అన్నాడు.

విష్ణుమూర్తి తృప్తిపడి, సభ చాలించి, అందర్నీ పంపేసి, తాను తన స్వస్థానమైన పాలసముద్రానికి తిరిగివెళ్ళాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)