13. జరాసంధ పరాజయం | Jarasandha Defeat | Lord Krishna Avatar Story in Telugu

writer
0
వికద్రుడు చెప్పిన మాటలు కృష్ణుడు శ్రద్ధగా విని, " దీనికి ప్రస్తుతం ఒకటే ఉపాయం తోస్తున్నది. నేనూ, అన్నా కూడా వెంటనే బయలుదేరి, జరాసంధుడు మొద లైనవారు చూస్తూండగా దక్షిణ దిక్కుగా పోతాం. అప్పు డతనుమధురానగరాన్ని ముట్టడించే యత్నం మాని మా వెంట పడ తాడు. మేము వింధ్యాద్రి మొదలైన పర్వ తాలలో గల దుర్గాలను పట్టుకుని, జరా సంధుడితో యుద్ధం చేస్తాం. మే మిలా చెయ్యటం వల్ల మన కులం వారికి, రాష్ట్ర పౌరులకూ ఆపద తప్పుతుంది,” అన్నాడు.

దీనికి అందరూ సమ్మతించారు. బలరామకృష్ణులు నిరాయుధులై మధుర నుంచి బయలుదేరి, ధైర్యంగా జరాసంధుడి దగ్గిరికే వెళ్ళి, "మగధరాజా, నానా దేశాల సైన్యాలను వెంట బెట్టుకుని ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చావో చెప్పు. మేము కూడా సహాయం చేస్తాం,” అన్నారు.

జరాసంధుడు కృష్ణ బలరాముల రాక విని, కవచమూ, బాణమూ, రెండు అంబుల పొదులూ ధరించి వచ్చి, "మీరిద్దరూ మహా బలవంతులని విని, మిమ్మల్ని యుద్ధంలో గెలుద్దామనే ఉద్దేశంతోనే వచ్చాను. మీ ప్రాణాలు తీయకుండా తిరిగి వెళ్ళేది లేదు. కనక మీరు కూడా యుద్ధ సన్నద్ధులై రండి," అన్నాడు.

అతనా మాట అనగానే బలరామ కృష్ణులు కొంచెం కూడా తొణకకుండా, అక్కడి నుంచి బయలుదేరి దక్షిణ దిక్కుగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు అలా అనేక దేశాలూ, నగరాలూ దాటి, వింధ్యారణ్యాలను సమీపించి, సహ్యాద్రి మీది అరణ్యంలో ఒక మహా వటవృక్షం కింద పరశురాముణ్ణి చూశారు.

అక్కడ పరశురాముడు శివార్చన చేస్తు న్నాడు. ఒక పక్కగా హెూమధేనువు, దూడతో సహా కట్టి ఉన్నది. ఆయనకు ఒక పక్కన స్రుకువాలూ, అరణీ, కమం డలువూ, చక్కగా ప్రజ్వలిస్తున్న అగ్నీ ఉన్నాయి, మరొక పక్కన ఒక మహా ధనువూ, బాణాలూ, ఖడ్గము, గండ్రగొడ్డలి ఉన్నాయి. ఈ విధంగా బ్రాహ్మణ క్షాత్ర తేజాలతో వెలిగిపోతున్న పరశురాముణ్ణి సమీపించి, 'బలరామకృష్ణులు ఆయన కాళ్ళకు తలలు తాకేలాగా ప్రణామం చేసి, ఆయనను స్తోత్రం చేశారు.

కృష్ణుడు ఆయనకు తమ కథను సంగ్ర హంగా తెలుపుతూ, "మహాత్మా, మా నివాసం యమునా నదీ ప్రాంతాన గల మధుర. యాదవ శ్రేష్ఠుడైన వసుదేవుడు మా తండ్రి. నా పేరు కృష్ణుడు, మా అన్న పేరు బలరాముడు. కంసుడి భయం చేత మా తండ్రి మమ్మల్ని పుట్టినప్పుడే గోకులా నికి పంపెయ్యగా, అక్కడ పెరిగి పెద్ద వాళ్ళమయాము. తరవాత మధురా నగ రానికి తిరిగి వచ్చి, కంసుణ్ణి చంపి, అతని రాజ్యాన్ని అతని తండ్రికే ఇచ్చాం. కంనుణ్ణి చంపినందుకు మా మీద అలిగి జరా సంధుడు మా మీదికి పెద్ద సేనతో ఎత్తి వచ్చాడు. నిరాయుధులం కావటంచేత అతనితో యుద్ధం చేసే అవకాశం లేక, అతను చూస్తుండగానే కాలినడకన ఇటుగా వచ్చాం. మే మిప్పుడేం చెయ్యాలో సలహా ఇచ్చి మమ్మల్ని అనుగ్రహించండి,” అని కోరాడు.

పరశురాముడు అంతా విని, మీ రిటు దక్షిణాపథానికి రావటం చూశాడు కనక, జరాసంధుడు తన సైన్యంతో సహా మిమ్మల్ని వెంబడించి వస్తాడు. జరాసంధుణ్ణి జయించ టానికి అనుకూలంగా ఉండే దుర్గం ఒకటి ఉన్నది. నేను మీ వెంట వచ్చి అక్కడ దిగ విడుస్తాను," అన్నాడు.

ముగ్గురూ కలిసి బయలుదేరారు. వారు కొన్నిరోజులు నడిచి గోమంత మనే పర్వతాన్ని చేరారు.

గోమంతం ఒక మహా పర్వతం. దానికి ఒకే ఒక శిఖరం ఉన్నది. ఆ పర్వతం మీదికి వెళ్ళి ఆ శిఖరాన్ని చేరుకున్నట్టయితే, అక్కడి నుంచి సూర్యచంద్రులు ఉద యించే చోటూ, అస్తమించే చోటూ దగ్గిరలో ఉన్నట్టే కనిపిస్తాయనీ, అనేక లంకలతో సహా సముద్రం కనిపిస్తుందనీ పరశు రాముడు బలరామకృష్ణులకు చెప్పాడు.

"మీరీ కొండ మీద నుంచి యుద్ధం చేసినట్టయితే జరాసంధుడూ, అతని వెంట వచ్చిన రాజులూ, ఓడి వెళ్ళిపోతారు,” అన్నాడాయన.

ఆ తరువాత ముగ్గురూ అతి వేగంగా పర్వతం పైకి ఎక్కారు.

"మీ శత్రువులు చేరవస్తున్నట్టు ధ్వనులు వినిపిస్తాయి, మీరు మహా జాగ్రత్తగా ఉండండి. ఇక నేను వెళ్ళి వస్తాను," అని పరశురాముడు అనేసరికి, బలరామ కృష్ణు లాయనను గౌరవంగా సాగనంపారు.

ఆ తరవాత బలరామ కృష్ణులు ఆ పర్వతం మీది గుహలూ, దృశ్యాలూ చూస్తూ గడ్ పారు. అంతలో జరాసంధుడి సేన ఆర్భా టంగా వచ్చి, పర్వతం చుట్టూ విడిసింది. ఆ సేనలో జరాసంధుడి వెంట శిశుపాలుడూ, రుక్మీ, చేకితానుడూ, బాహ్లికుడూ, ద్రుప దుడూ, విరాటుడూ, ఉత్తమౌజుడూ, జయద్రధుడూ మొదలైన రాజులున్నారు. 

జరాసంధుడు వీరందరినీ పిలిపించి సభ చేసి, "యాదవ కుమారులు ఈ కొండ మీద ఉన్నట్లు తెలిసింది. పర్వతాన్ని ఎక్కటానికి వీలుగా రాళ్లూ, తిప్పలూ ధ్వంసం చేయింతాం. అక్కడక్కడా ఒడిసెల వాళ్ళను ఏర్పాటు చేతాం. పైనుంచి ఎవరు తొంగిచూసినా బాణాలూ, ఈ టెలూ విసురుదాం. అవసరమైతే ఈ పర్వతాన్ని పిండి కొట్టి అయినా మనం వచ్చిన పని పూర్తిచేసి మరీ తిరిగి పోదాం,” అన్నాడు.

దానికి శిశుపాలుడు, "ఈ పర్వతం దేవతలకే సాధ్యంకాదంటారు. రథాల మీద విశ్రాంతి తీసుకునే మన రాజులు నడిచి దీన్ని ఎక్కగలరా? చాలామందిమి ఉన్నాం గదా అని విరుచుకుపడటం నీతి కాదు, ఉపాయమూ కాదు. బలరామకృష్ణులను పిల్లల కింద జమకట్టపద్దు. దుర్గం వాళ్ళ అధీనంలో ఉన్నది కాబట్టి, యుద్ధం చేసే కన్న ముట్టడివేసి, వాళ్ళకు అన్నపానాలు లేకుండా చెయ్యటం తెలివైన పని. మరొక ఉపాయం కూడా ఉన్నది. కొండ చుట్టూ నిప్పు పెట్టామంటే వాళ్ళు దానికి ప్రతిక్రియ చెయ్యలేక చిక్కులోపడతారు,” అన్నాడు.

చేదిరాజైన శిశుపాలుడు చెప్పిన ఈ ఉపాయం జరాసంధుడికి నచ్చింది. 

సైనికులు పర్వతం చుట్టూ ఎండిన మానులూ, పొడలూ, కంపా పేర్చి, గాలి వాలున అవి మండేటట్టుగా నిప్పుపెట్టి,

ఆ మంటల మీదికి కట్టెలూ, గడ్డీ ఎగ దోశారు. వెంటనే పర్వతం చుట్టూ కార్చిచ్చు బయలుదేరింది. మంటలూ, నిప్పురవ్వలూ, పొగా ఆకాశంలోకి లేచాయి.

ఇదంతా చూస్తున్న బలరాముడు కృష్ణు డితో, " చూశావా, మన మూలాన ఈ పర్వ తాని కెంత దుర్దశ కలిగిందో! మనం చూస్తూ ఊరుకోవటం కన్న వేరే అపకీర్తి ఏముంటుంది? నే నిప్పుడే ఈ జరాసంధుణ్ణి నా భుజబలంతో చంపేస్తాను. అన్ని దేశాలు నుంచి, ఇంతమంది రాజులు ఇంత సైన్యాన్ని వెంట బెట్టుకుని యుద్ధానికి వస్తారా? భూమిమీద రాజనేవాడు లేకుండా చేస్తాను,” అని కొండ మీది నుంచి, కింద ఉన్న సేన మధ్యకు ఎగిరి దూకాడు, "ఆ క్షణమే కృష్ణుడు కూడా అలాగే దూకాడు. రెండు మందర పర్వతాలు ఒక్కసారిగా పడితే సముద్రం అల్లకల్లోలమైనట్టుగా, జరాసంధుడి సేన వాళ్ళపాటుకు చెల్లా చెదరయింది. వాళ్ళ పాదఘట్టనతో పర్వతం కొంచెం కుంగి, పాతాళ గంగ పైకి వచ్చి, మంటలు ఆరిపోయాయి.

ఆ అన్నదమ్ముల శౌర్య సాహసాలను మెచ్చి, దేవతలు ఆకాశం నుంచి వారిద్దరికీ 'రకరకాల ఆయుధాలు అందించారు. ఆ క్షణంలో కృష్ణుడు విష్ణుమూర్తిలాగానూ, బలరాముడు సహస్రఫణాలు గల ఆది శేషుడు లాగానూ కనిపించారు. వాళ్ళిద్దరూ విజృంభించి సైన్యాన్ని ఎడాపెడా వధ చేస్తూంటే రాజులు పారిపోసాగారు.

వాళ్ళను వెనక్కు పిలుస్తూ జరా సంధుడు, "యుద్ధంలో వెన్నిచ్చి పారి పోయే వారికి భ్రూణహత్యాపాతకం లాటిది చుట్టుకుంటుందని పెద్దలు చెప్పారు. మీరంతా మహామహా యోధులై ఉండి, ఇద్దరు గొల్లపిల్ల వాళ్ళకు దడిచి పారి పోతున్నారా? మీరు కాలు తొక్కుకు నిలబడి నన్ను చూడండి. నేనుండగా మీకే ఆపా యమూ రానివ్వను. ఈ యాదవులను నా బాణాలకు ఎరచేసేస్తాను,” అన్నాడు.

ఈ మాటలు విని పారిపోయే రాజులు వెనక్కు తిరిగి, తమ సేనలను వెనక్కు తిప్పి, బలరామకృష్ణులను చుట్టుముట్టారు. అంతమంది తమ పైన వివిధాస్త్రాలనూ, శస్త్రాలనూ ప్రయోగిస్తున్నా చలించక, బలరామకృష్ణులు తమ చుట్టూ ఉన్న సేనను ఊచకోత కోస్తూ, పీనుగు పెంట కుప్పలు వేశారు. రాజులు క్రమంగా వెనక్కు తగ్గసాగారు. అప్పుడు కృష్ణుడు వారితో, "అందరూ వాహనాలెక్కి ఉన్నారు; అందరూ అనేక యుద్ధాలలో ఆరితేరినవారే; నేల మీద నిలబడి యుద్ధంచేసే మమ్మల్ని ఎదుర్కోలేక వెనక్కు తగ్గటం ఏమీ బాగా లేదు. మిమ్మల్ని అడ్డంపెట్టుకుని ఆ జరా సంధుడు దూరదూరంగా ఉంటున్నాడు. అతని కోసం మీరెందుకు చావాలి? అతన్ని పట్టుకురండి, నా యుద్ధ పటిమ చూపి స్తాను,” అన్నాడు,

ఈ మాట విని జరాసంధుడు, పౌరుషం వచ్చి, ఒక రథం మీద ఒంటరిగా కృష్ణు డున్న చోటికి వచ్చాడు. అతను కృష్ణుణ్ణి చూసి, "నేనుండగా మధ్య ఈ రాజుల నెందు కవమానిస్తావు? యుద్ధ మంటే అడవిలో పశువులను కాయటం కాదు. నువేదో మహా బల పరాక్రమాలు కలవాడి విట. అదంతా నా మీద చూపించినప్పుడు గదా సార్థకమయేది? నువు నిలిచి పోట్లాడు. క్షణంలో నిన్ను యమధర్మరాజు దగ్గిరికి పంపేస్తాను,” అన్నాడు.

"నా ప్రతాపం తెలుసుకోగోరితే నేను ఎదటే ఉన్నాను గద. శూరుడు ప్రగల్భా లాడరాదు. నీ శస్త్రాస్త్రపటిమ చూపించు," అంటూ కృష్ణుడు జరాసంధుడి పైన ఎని మిది బాణాలూ, అతని సారధిపైన అయిదు బాణాలూ వేశాడు.. ఆ క్షణంలోనే బల రాముడు జరాసంధుడి చేతిలోని వింటిని తన బాణాలతో విరగగొట్టాడు. జరాసంధు డికి కాపుగా అతని సేనాపతులు, కౌశిక చిత్రసేను అనేవాళ్ళు, బలరామకృష్ణుల మీదికి వచ్చారు. యుద్ధం అతి దారుణంగా సాగింది. యుద్ధంలో దెబ్బతిని కృష్ణుడూ, బలరాముడూ, జరాసంధుడూ కూడా ఒకరి తరవాత ఒకరు మూర్ఛపోయారు. జరా సంధుడి పక్షాన కొందరు చచ్చారు. చివరకు జరాసంధుడు నిలవలేకపోయాడు. అతనూ, అతని సేనా ఓడి పారిపోయారు. కృష్ణుడు విజయగర్వంలో పాంచజన్యం ఊదాడు.

బలరామకృష్ణులు కొంత కాలంపాటు గోమంతగిరి మీదనే విశ్రాంతి తీసుకుందామని నిశ్చయించారు. అంతలో ఒక చిత్రమైన సంఘటన జరిగింది.

జరాసంధుడి వెంట రాజులందరూ వెళ్ళి పోయారు. అయితే చేదిదేశపు రాజైన దమ ఘోష డనేవాడు, శిశుపాలుడి తండ్రి, తన సేనలతోసహా గోమంతానికి తిరిగివచ్చి, కృష్ణుణ్ణి కలుసుకుని, "నాయనా, నేను మీ మేనత్త పెనిమిటిని. నా పేరు దమ ఘోషుడు. ఈ జరాసంధుడు మరీ ధూర్తుడు. కృష్ణుడితో వైరం వద్దని చాలా సార్లు చెప్పి చూశాను, కాని విన్నాడుకాడు. వాడంటే భయంగాని, లేకపోతే ఎన్నడో విడిచిపెట్టి ఉందును. ఇవాళ వాడి ఓటమి చూసి, నాకు అయిన వారందరితో సహా నీ పక్షం వచ్చేశాను. కాని వీడు బలవం తుడు. ఇంతటితో వీడి పీడ విరగడ అయిం దనుకోకు, మళ్ళీ ఏదో వంక వెతుకుతాడు. ఈ పీనుగు పెంటల మధ్య ఇంకా నువు దేనికి ఉన్నట్టు? పోదాంపద. ఇక్కడికి దగ్గిరలోనే కరవీరపురం అని ఉన్నది. దాన్ని పాలించే సృగాల వాసుదేవుడికి నీ పైన చాలా ఈర్ష్య. వాణ్ణి అణచటం అవసరం. ఇవిగో, రెండు ఉత్తమ రథాలు. వీటిని మీ అన్నదమ్ము లిద్దరూ తీసుకోండి," అన్నాడు.

కృష్ణుడు దమఘోషుణ్ణి అభిమానంతో చూసి, "బంధుత్వంతో గూడిన ప్రేమ అంటే ఇలాగే ఉండాలి. నీ మాటలు మాకు మహదానందం కలిగించాయి. నీవంటి వాడి ప్రాపు దొరకటంచేత మేము ధన్యులం. ఇప్పడు జరిగిన యుద్ధం చూశావుగద! ఇదే పద్ధతిలో మేము ఎన్ని యుద్ధాలైనా చెయ్య గలం,” అన్నాడు.

ఆ రోజే బలరామకృష్ణులు రథాలెక్కి దమఘోషుడి బలాల వెంట బయలుదేరి, దారిలో రెండు మజిలీలు వేసి, మూడో నాడు ఉదయం కరవీరపురం చేరి అక్కడ శిబిరం వేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)