19. నరకుడి విజృంభణ | Narakasura Power & Atrocities | Lord Krishna Avatar Story in Telugu

writer
0
తన దక్షిణాది మిత్రులు చెప్పిన సలహా తలకెక్కి రుక్మి, చక్కగా అలంకరించి ఉన్న సభాభవనంలో జూదం ఆడటానికి ఒక బంగారు వలకా, పావులూ, పాచికలూ ఏర్పాటు చేయించి, సరదాగా జూదం ఆడదాం రమ్మని బలరాముడికి కబురు పంపాడు. ద్యూత ప్రియుడైన బలరాముడు వెంటనే ఉత్సాహంతో వచ్చాడు.

బలరాముడితో రుక్మి ఆడితేనే బాగుంటుందని దాక్షిణాత్యులు అన్నారు. పందెం కాయటానికి ముత్యాలూ, మణులూ, బంగారమూ కుప్పలు పోశారు. జూదం ఆరంభమయింది. పదివేల బంగారు మాతలు పందెం కాచి బలరాముడు ఓడిపోయాడు. మళ్ళీ అంతే పందెం కాచి మళ్ళీ ఓడాడు". ఇదే విధంగా ప్రతిసారీ బలరాముడే ఓడుతూ వచ్చాడు.

చిట్టచివరకు బలరాముడు కోటి బంగారు మాడలు వందెంకాచి గెలిచాడు. కాని రుక్మి గెలుపు తనదేనని గట్టిగా కేకపెట్టాడు. "బలరాముడికి పందెం వెయ్యటమే చేత కాదు. నేను కోటి బంగారం గెలుచుకున్నాను, చూసుకోండి," అన్నాడతను

అతని మిత్రుడైన కళింగరాజు, ''నిజమే! అంతే!" అంటూ పళ్ళన్నీ బయట పెట్టి నవ్వాడు. బలరాముడికి కోపం వచ్చింది, కానీ అతను తనను తాను నిగ్రహించుకుని, అక్కడ చేరినవాళ్ళతో, " పందెం నేను గెలిస్తే, ఇతను తాను గెలిచానంటాడేమిటి? మీరు నిజం చెప్పండి." అన్నాడు.

అందరూ తలలు వంచుకున్నారు. ఒక్కడూ జవాబు చెప్పలేదు.

రుక్మి బలరాముడితో, " నేను గెలిచానన టానికి సందేహమేమీ లేదే! ఎందుకిలా కక్కుర్తిపడి అబద్ధాలాడుతున్నావు?” అన్నాడు. అంత పచ్చి అబద్ధానికి ఏమి సమాధానం చెప్పాలో బలరాముడికి అర్థం కాలేదు. ఇంతలో ఆకాశవాణి, "బల రాముడి మాట నిజం. మక్కి అబద్ద మారాడు. మీరంతా మొద్దులల్లే చూస్తూ ఊరుకుంటారేం ?" అని పలికింది.

అప్పటికీ ఎవరూ మాట్లాడలేదు. ఇల రాముడు ఇళ నిగ్రహించుకోలేక ఆవేశంతో రుక్మిని ఒక్క గుద్దుతో హతమార్చి, జూదపు పలక తీసుకుని కాళింగుడి తల పగిలేటట్టు కొట్టాడు. మిగిలిన రాజులు తన పైకి వస్తే, కత్తి దూసి ఊచకోత కోశారు. ఇలా కొందరు చావగా, మిగిలినవాళ్ళు బెదిరి పారిపోయారు.

బలరాము డిలా భీభత్సం చేసి, తన బనకు వెళ్ళి, కృష్ణుడితో జరిగిన సంగతి చెప్పాడు. కృష్ణుడు జరిగినదాన్ని గురించి ఆక్షేపించలేదు, హర్షించనూలేదు. కాని మిగిలిన యాదవులు బలరాముణ్ణి తెగ మెచ్చుకుని, "అతనికి చాలా తృప్తి కలిగించారు. 

ఆ తరవాత అందరూ వధూవరులను వెంటబెట్టుకుని ద్వారకకు తిరిగి వచ్చేశారు. 

బలరాముడు సాటిలేని బల పరాక్రమాలూ, శక్తి సామర్థ్యాలూ కలవాడు. వది వేల ఏనుగుల బలం కలవాడని ఖ్యాతి పొందిన భీముడు బలరాముడి వద్దనే శిక్షణ పొందాడు. ఇద్దరికి యుద్ధం జరిగే పక్షంలో భీముడు గెలుస్తాడన్న నమ్మకం కూడా ఉండేది కాదు.

ఒకసారి కృష్ణుడి కొడుకైన సాంబుడు, దుర్యోధనుడి కుమార్తె అయిన లక్షణను మోహించి, ఆమెను తీసుకుని పారిపోసాగాడు. అప్పుడు కౌరవులు సాంబుణ్ణి తరిమి పట్టుకుని, హస్తినాపురానికి తెచ్చి, చెరలో ఉంచారు. ఆది తెలిసి బలరాముడు ఉగ్రుడై | హస్తినాపురానికి వచ్చి సాంభుణ్ణి విడిచిపుచ్చమని మర్యాదగా అడిగాడు. అందుకు కౌరవులు ఒప్పుకోలేదు.

అప్పుడు బలరాముడు హస్తినాపురాన్ని జనంతోనూ, ఇళ్ళతోనూ సహా గంగలోకి తోస్తానని ప్రతిజ్ఞచేసి, ప్రాకారం కింద తన నాగలి వేసి ఎత్త నారంభించాడు.

దుర్యోధనుడు మొదలైన వాళ్ళంతా బెదిరిపోయి, సాంబుణ్ణి తెచ్చి బలరాముడికి అప్పగించి, కాంతింపజేశారు. అప్పుడే దుర్యోధనుడు బలరాముడికి తాను శిష్యు డుగా ఉంటానని చెప్పి, గురుపూజ చేశాడు. బలరాముడి మూలాన హస్తినాపురం శాశ్వ తంగా ఒక పక్క పైకి లేచి, రెండోవైపు ఏటవాలుగా ఉండిపోయింది. దుర్యోధనుడు బలరాముడి శిష్యుడుగా గదాయుద్ధంలో సాటిలేని కీర్తి సంపాదించాడు.

ఇది ఇలా ఉండగా రాక్షస ప్రపంచంలో నరకుడనేవాడు ప్రచండుడుగా పైకి వచ్చాడు. అతని రాజధాని ప్రాగ్జ్యోతిషపురం, అతను భూదేవి కొడుకు. బ్రహ్మచేత వరాలు పొందినవాడు. ఏ దేవతలకూ ఓడేవాడు కాడు. అన్ని లోకాలనూ తన బల పరాక్రమాలతో ఆడలగొట్టసాగాడు.

నరకుడు ముందుగానే ఇంద్రుడి నగరానికి తన రాక్షస సేనతో సహా వెళ్ళి, నగర ద్వారాలను తన పిడికిలి పోట్లతో పగలగొట్టి, సింహనాదం చేసి, యుద్ధానికి రమ్మని ఇంద్రుణ్ణి పిలిచాడు. ఇంద్రుడు వచ్చాడు. వజ్రాయుధం చేతబట్టి, ఐరావతాన్ని ఎక్క వచ్చిన ఇంద్రుణ్ణి ఏమాత్రమూ లక్ష్యపెట్టక, నరకుడు అతనితో యుద్ధానికి తలపడ్డాడు. ఇంద్రుడికి తోడుగా యమ, వరుణ, కుబేరులు తమ సైన్యాలను తెచ్చి, యుద్ధంలో పాల్గొన్నారు.

నరకుడికి కూడా ముగ్గురు రాక్షస నాయకులు, హయగ్రీపుడూ, నిశుంభుడూ, మురుడూ అనేవాళ్ళు, తోడుగా ఉన్నారు. వారిలో హయగ్రీవుడితో వరుణుడు యుద్ధం చేసి, తల పగలి, నెత్తురు కక్కుకూ, మూర్ఛపోయి, స్పృహ తెలియగానే పారి పోయాడు. వరుణడితోనే అతని సేన కూడా పోయింది. అలాగే నిశుంభుడి చేతిలో యముడూ, మురాసురుడి చేతిలో కుబేరుడూ చావు దెబ్బలు తిని, సైన్యాలతో సహా పారి పోయారు. చివరకు నరకుడి దెబ్బకు తట్టుకోలేక ఇంద్రుడు కూడా పారి పోయాడు. సరకుడు అమరావతీ నగరం ప్రవేశించి, తన విజయాన్ని దేవలోక మంతటా చాటింపు చేయించాడు.

తరవాత నరకుడు ఇంద్రుడి సింహాసనం అధిష్టించి, ఊర్వశిని పిలిపించి, "దిక్పాలకు లందరినీ ఓడించాను. సమస్త దేవతలకూ ఇక నేనే రాజును. అందుచేత ఇక నుంచీ నన్ను నువు సుఖపెట్టు," అన్నాడు.

దానికి ఊర్వశి, "అలాగా? అయితే మునులందరూ యజ్ఞాలలో నిన్నే పూజించి నట్టయితే నేను విధిగా నీకు ఉంపుడుగత్తెగా ఉంటాను," అన్నది, సరకుడు సరేనన్నాడు. అతను అమరావతిని కొల్లగొట్టి, సుమేరు పర్వతంలోని రత్నరాసులన్నీ తవ్వించి, ఎనిమిదివేల దేవకన్యలను చెరపట్టి, విశ్వ కర్మ కూతురిని కూడా తీసుకుని, రత్నాలు పొదిగిన ఆదితి కుండలాలు సంగ్రహించి, తన నగరానికి తిరిగి వచ్చాడు.

నరకుడి ఆజ్ఞపొంది అతని అనుచరులైన రాక్షసులు పధ్నాలుగు లోకాలలోనూ, ఎక్కడ ఏ విలువగల వస్తువున్నా దాన్ని తెచ్చి అతనికి ఇస్తూ వచ్చారు. వాళ్ళు పోయిన చోటనల్లా పీడన కలిగిస్తూ, అప్సర స్త్రీల నందరినీ తెచ్చారు, పదహారువేల ఒక పంద గంధర్వ కన్యకలనూ, అనేక లక్షల యక్ష స్త్రీలనూ, అసంఖ్యాకులైన కిన్నర, సిద్ధ, సాధ్య, విద్యాధర స్త్రీలనూ చెర పట్టి తెచ్చారు.

ప్రాగ్జ్యోతిషనగరాన్ని నాలుగు పక్కలా నలుగురు మహాయోధులు మురుడూ, హయగ్రీవుడూ, నిశుంభుడూ, పంచ జనుడూ రక్షించేవారు. మురాసురుడికి వేల సంఖ్యలో కొడుకులుండేవారు. వాళ్ళ మూలాన నరకుడి నగరం ఎలాటి వారికి చౌరరానిదిగా ఉండేది.

నరకుడికి భూలోకమంతా వశపరచు కోవాలనిపించింది. అతను అంతటా తిరుగుతూ యజ్ఞాలు ధ్వంసం చేశాడు, బ్రాహ్మణులను చంపాడు, మునులను హింసించాడు, రాజు లందరినీ రకరకాలుగా పీడించాడు, ధర్మ నాశనాన్నే తన ఆశయంగా పెట్టుకున్నాడు.

ఒకసారి సరకుడు బదరీవనానికి వెళ్ళే సరికి అక్కడ అనేకమంది ఋషులు యజ్ఞ కార్యంలో ముణిగి ఉన్నారు. అప్పుడు నరకుడికి ఊర్వశి అన్న మాట జ్ఞాపకం వచ్చింది. అతను వాళ్ళను, "ఎవరిని తల పెట్టి ఈ యజ్ఞం చేస్తున్నారు?" అని అడిగారు.

"వేదాలు చెప్పిన విధంగా ఇంద్రుణ్ణి గురించి యజ్ఞం చేస్తున్నాం," అని వాళ్ళు జవాబు చెప్పారు.

ఆ మాటకు నరకుడు అలిగి, ఇంద్రుణ్ణి వరుణ యమ కుబేర సహితంగా నేను యుద్ధంలో ఓడించాను. అతని రాజ్యమంతా గెలుచుకున్నాను. విశ్వాని కంతకూ నేనే ఏలికను. అందుచేత నన్నే కొలపండి, నాకే మొక్కండి, నన్ను సంతృప్తిపరచి నట్టయితే నేను మీ కోరికలు తీర్చుతాను," అన్నాడు.

దానికా ఋషులు, "ఈ మాట ఎంత మాత్రమూ సబబుగా లేదు. లోకాలను పాలించవలసినవాడు ఇంద్రుడు. నువు దుష్ట రాక్షసుడివి. నిన్ను మే మెలా కొలుస్తాం?” అన్నారు.

నరకు డి మాటకు మండిపడి తన బంట్లతో, "ఈ బ్రాహ్మణులు మదమెక్కి కారుకూతలు కూస్తున్నారు. వీళ్ళ యజ్ఞం ధ్వంసం చెయ్యండి," అన్నాడు. వెంటనే రాక్షసులు అగ్నికుండాలు పూడ్చి, పశువు లను నాశనం చేసి, హెతలనూ, ఉద్గాత లనూ, సదస్సులనూ చావగొట్టి, న్రుకువా లను ఆవతల పారేసి, అరణులు కాల్చి, హవిస్సులు తినేసి, అన్న పురాసులు చిమ్మేసి, సోమరసాన్ని బూడిదపాలు చేసి, ఋషిపత్నులను చెరిచి, వాళ్ళ కన్యలను చెరపట్టి, నానా భీభత్సము చేశారు. తరవాత నరకుడు తిరిగి వెళ్ళిపోయాడు.

- ఆ తరవాత వసిష్ఠుడూ, వాసుదేవుడూ, కపిలుడూ, కశ్యపుడూ, కణ్వుడూ, జావాలీ, ధూమ్యుడూ, భరద్వాజుడూ, మంకణుడూ మొదలైన మహాఋమలందరూ కూర్చుని, తమ యజ్ఞం ఇలా ఎందుకు విఘ్నమయిందో, పతివ్రతలయిన తమ స్త్రీలు ఇలా ఎందుకు దోషానికి గురి ఆయారో అని విచారించారు. అటువంటి దుర్మార్గుడి నుంచి తమను కాపాడేవాడు ఎవడో ఒకడు లేకపోతే ఇక బ్రతుకే ఉండదు. అవతారపురుషుడైన కృష్ణుడి వల్లనే తమకు గతి ఏర్పడాలని వారు నిశ్చయించుకుని, అందరూ కలిసి ద్వారకకు బయలుదేరారు.

వారు దక్షిణాభిముఖులై ప్రయాణంచేసి, దారిలో తగిలిన తీర్థాలలో స్నానాలు చేస్తూ, భాగీరధిని చేరి, అందులో కూడా స్నానం చేసి, ప్రాయశ్చిత్తాలు చేసుకుని, నిత్య ప్రయాణాలు చేస్తూ. స్వర్గాన్ని మించిన వైభవంతో తులతూగే ద్వారకానగరాన్ని చేరుకున్నారు.

ఆ నగరం యొక్క ఐశ్వర్యానికి ఆశ్చర్య పడుతూ వాళ్ళు రాజమార్గం వెంట రాచనగరు చేరుకుని, బదరీవనం నుంచి మహర్షులు వచ్చారని కృష్ణుడికి కబురు పంపారు.

కృష్ణుడు వారి రాక గురించి వినగానే ప్రద్యుమ్నుణ్ణి పిలిచి, ఋషులకు స్వాగతం చెప్పి తీసుకురమ్మని పంపాడు. ప్రద్యుమ్నుడు బయటికి వచ్చి, ఆదరంతో ఋషులకు స్వాగతం చెప్పి. వారిని కృష్ణుడు కొలువుదీరి ఉన్న చోటికి, తీసుకు వెళ్ళాడు.

సభాభవనంలో యాదవులందరూ తనను కొలిచి ఉండగా, కృష్ణుడు ఉన్నతాసనం మీద కూర్చున్నాడు. మునులు అతన్ని చూసి, "మన కోరికలన్నీ తీర్చి రక్షించటానికి అతను ఉండగా, మనం ఇన్నాళ్ళూ ఆ రాక్షసుడి చేత ఎందుకని అంతగా అవమానాలు పొందినట్టు? ప్రారబ్ధ మంటే ఇలాగే ఉంటుందిగదా! పోనీ ఇప్పటికైనా ఈ మహాత్ముడి దర్శనం చేసుకున్నాం. తపస్సు, తపస్సు అంటూ అడవుల్లో ఆలమ టించే మనకు ఆ రాక్షనుడి మూలంగా ఈ లాభం ఒకటి కలిగింది," అని తమలో అనుకుంటూ కృష్ణుణ్ణి సమీపించారు.

కృష్ణుడు గబగబా తన ఆననం నుంచి దిగి వచ్చి, మునులకు నమస్కారం చేసి, వారికి ఆసనాలూ, అర్ఘ్యపాద్యాలు, మదు పర్కాలూ ఇచ్చి సత్కరించి, వారి అను మతి పొంది, తిరిగి తన ఆసనం మీద కూర్చున్నాడు. అతని తరువాత మిగిలిన యాదవ ప్రముఖులంతా మునులకు నమస్కారాలు చేసి తమతమ ఆసనాలలో తిరిగి కూర్చున్నారు.

అప్పుడు కృష్ణుడు చేతులు జోడించుకుని మునులతో, "మీ క్రతువులు నిర్వఘ్నంగా సాగుతున్నాయా? మీ ప్రతాలూ, తపస్సులూ యథావిధిగా జరుగుతున్నాయి. గదా? మీరంతా ఇలా దయచేయటానికి కారణమేమిటి ? నా మీదగల అనుగ్రహం కొద్ది, నన్ను కృతార్ధుణ్ణి చేయటానికే మీరిలా వచ్చి ఉంటారు. నాకు మీ రందరూ ఏదైనా పని చెప్పినట్టయితే, ఆ పని చెయ్యటానికి మేమంతా సంసిద్ధంగా ఉన్నాం," అన్నాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)