కృష్ణుడు ప్రారంభించిన యజ్ఞం పూర్తి అయింది. అనేక వేలమంది బ్రాహ్మణు లకు సంతర్పణ జరిగింది. అర్జునుడూ, సాత్యకి మొదలైన వాళ్ళను యాభైమందిని తన పంక్తిన పెట్టుకుని కృష్ణుడు విందు ఆరగించాడు. తరువాత అందరూ సభా భవనంలో చేరి కులాసాగా కబుర్లు చెప్పు కునేటప్పుడు అర్జునుడు కృష్ణుణ్ణి, "ఇంతకూ ఆ బ్రాహ్మణుడి కొడుకులు ఎలా పోయారు? వాళ్ళను ఎవరు ఎత్తుకుపోయారు? ఎక్కడ దాచారు?” అని అడిగాడు.
సమస్త సృష్టికీ మూలకారణమైన పరమేశ్వరుడు నన్ను చూడగోరి, బ్రాహ్మణ కార్యాన్ని నేను అలక్ష్యం చెయ్యను గనక, బ్రాహ్మణ బాలకులను మాయం చేస్తూ వచ్చాడు. ఆయన కోరిక తీర్చటానికి నేను సముద్రాన్ని పాయలుగా చీల్చి, కొండలను తోసి దారిచేసుకుని వెళ్ళవలసి వచ్చింది,” అన్నాడు కృష్ణుడు.
తరవాత అర్జునుడు తిరిగిపోయి ధర్మ రాజుకు తాను చూసిన వింతలన్నీ చెప్పి, ఆయనకు అంతులేని సంతోషం కలి గించాడు.
ఒకనాడు రుక్మిణి కృష్ణుడితో, "నేను ప్రద్యుమ్నుడు మొదలైన పిల్లలను కన్నాను గాని, నా కింకా సంతాన కాంక్ష తీరలేదు. నీ వంటి కొడుకును ఇంకొక్కణ్ణి కనాలని ఉన్నది," అన్నది.
"శంకరుణ్ణి ఆరాధించి నీకు మరొక కొడుకును కంటాను. తపస్సు ద్వారా లభించని దంటూ లేదు. హిమాలయానికి వెళ్ళి శంకరుడికి నమస్కారం చెయ్యటంతో బాటు, దారిలో బదరీవనంలో ఉండే మహా తపస్సంపన్నులను కూడా చూడాలని ఉన్నది. ఇందువల్ల అనేక శుభాలు కలుగు తాయి. కనక నేను కైలాశయాత్ర చేసి వస్తాను,” అన్నాడు కృష్ణుడు.
మర్నాడు ఉదయం కృష్ణుడు కాల కృత్యాలు తీర్చుకుని, సభా భవనానికి రావలసిందని బలరాముడికి, సాత్యకికీ, ఉగ్రసేనుడికి, కృతవర్మకు, ఉద్దవుడికి, మిగిలిన ప్రముఖులకూ కబురు చేశాడు. కొద్దిసేపట్లో అందరూ సభాభవనంలో సమావేశమయారు. అప్పుడు కృష్ణుడు వారితో ఇలా అన్నాడు:
"నేను నా విరోధులందరినీ చంపేశాను గాని ఇంకా ఒకడు మిగిలి ఉన్నాడు. వాడు సామాన్యుడు కాడు, చాలా ధైర్య పరాక్రమాలు గలవాడు. వాడి పేరు పౌండ్రుడు. వాడికి నేనంటే పగ. నాకు వాడంటే భయం ఉన్నది. వాణ్ణి చంపితేనే గాని నేను నిజంగా విజయం సాధించాననుకోను. నా కిప్పుడు కైలాసయాత్ర చేయవలసిన పని పడింది. నేను వెళ్ళగానే పౌండ్రుడు వచ్చి మన నగరం మీద దాడి చేస్తాడు. వాడు ప్రపంచంలో యాదవు డన్నవాడు లేకుండా చేయగలిగినవాడు. అందుచేత నేను తిరిగి వచ్చేదాకా మీరు వెయ్యి కళ్ళతో అహర్నిశలు నగరాన్ని కాపాడాలి. నగరద్వారా అన్నిటినీ గట్టిగా రక్షించండి. అనుమతి లేకుండా ఎవరినీ లోపలికి రానివ్వవద్దు, బయటికి పోనివ్వవద్దు. చతు రంగ బలాలనూ ఆయత్తం చేసి ఉంచండి. ఆయుధాలన్నిటినీ సిద్ధపరచండి. అన్ని దిక్కులూ చక్కగా రక్షించుకోండి.”
తరువాత అతను సాత్యకితో, "ఈ నగరాన్ని రక్షించే భారం ప్రధానంగా నీ పైన ఉంచుతున్నాను. యాదవ సంపద కంతకూ నిన్నే రక్షకుడుగా ఏర్పాటు చేస్తున్నాను.” అని చెప్పాడు.
"నీ ఆజ్ఞా, బలరాముడి అండా ఉంటే నేను చెయ్యలేని దేమి ఉంటుంది? పౌండ్రు డేమిటి, ఇంద్రుడే దిక్పాలకు లందరినీ, దేవతలనూ వెంటబెట్టుకుని ఎత్తివచ్చినా సరే నేను లక్ష్యపెట్టను," అన్నాడు సాత్యకి.
కృష్ణుడు ఉద్దవుడితో, "గురువర్యా, నువు బుద్ధికి బృహస్పతివి. నీకు నేను చెప్పట మేమిటి? పరాక్రమవంతులైన మన యాదవవీరులను నీ బుద్ధిబలంతో నడిపించు,” అన్నాడు. అతను ఇదే విధంగా బలరాముణ్ణు, ఉగ్రసేనుణ్ణి, ఇతర యాదవ ముఖ్యులనూ హెచ్చరించి, గరుత్మంతుణ్ణి స్మరించాడు. వెంటనే గరుత్మంతుడు వచ్చి వాలాడు. తాను కైలాసానికి వెళ్ళాలని చెప్పి కృష్ణుడు గరుత్మంతుడి వీపు మీద ఎక్కి కూర్చున్నాడు. కృష్ణుడితో సహా గరుత్మం తుడు ఆకాశంలోకి లేచి, ఈశాన్య దిక్కుగా ప్రయాణమయాడు.
అలా బయలుదేరిన కృష్ణుడు దారిలో బదరీవనంలో దిగాడు. అక్కడ ఉండే మునులు అతనికి గొప్ప స్వాగతం ఇచ్చారు. వారి ఆతిథ్యం స్వీకరించి కృష్ణుడు ఆ రాత్రికి అక్కడే ఉండిపోయాడు. అర్ధరాత్రి వేళ అతనికి ఆ ప్రాంతమంతా సంచరించాలని బుద్ధి పుట్టింది. అతను చాలాసేపు బదరి వనమంతా సంచరించి, ఒక మనోహర ప్రదేశానికి వచ్చి, అక్కడ స్వస్తికాసనం వేసుకుని, సమాధియోగం అవలంబించాడు.
ఆ సమయంలో అటుగా అనేక వేల సంఖ్యలో పిశాచులు మృగాలను తరుము కుంటూ వచ్చారు. వాళ్ళకు నాయకులుగా ఘంటాకర్లు డనే పిశాచీ, అతని తమ్ముడూ ఉన్నారు. వాళ్ళు కృష్ణు డున్న చోటికి వచ్చి, "ఎవరవు, బాబూ? చూడటానికి నాజూకుగా ఉన్నావు, ఈ వనంలో ఎందుకున్నావు? నువు రాక్షసుడివా, దేవతవా ? అని అడిగారు.
"నేను యదువంశ క్షత్రియుణ్ణి. దుష్టు లను సంహరించటమూ, సజ్జనులకు సంతోషం కలిగించటమూ నా పని. శంకరుణ్ణి చూడటానికి కైలాసానికి వెళుతు న్నాను. మీరెవరు? ఇది సాధుజను లుండే చోటు. ఇక్కడ మృగాలను కూడా హింసించరాదు. మీరు మృగాలను వేటా డుతూ ఇక్కడికి వస్తే నేను సహించను,” అన్నాడు కృష్ణుడు.
ఆ మాటకు ఘంటాకర్ణుడు, "నా పేరు ఘంటాకర్ణుడు. వీడు నా తమ్ముడు. నేను విష్ణుభక్తుణ్ణి. ఇదంతా నా సేన. నేను కుబేరుడి కింకరుణ్ణి. విష్ణు పూజ కోసమే మృగాలను వేటాడుతున్నాం గనక దీన్ని హింస అనకూడదు. మరొకటి చెబుతాను విను. నా ఇష్ట దైవం వసుదేవుడి కొడుకుగా జన్మించి ద్వారకలో నివశిస్తున్నాడు. నేను ఇప్పుడాయనను దర్శించటానికే సేనా సమేతంగా బయలు దేరి పోతున్నాను,” అని చెప్పాడు.
తరవాత అతను కృష్ణుడి దగ్గరలోనే. పేగులు పరిచి కూర్చుని, చేతులు మోడ్చి, తన యిష్టదైవాన్ని ధ్యానించుకో సాగాడు. వాణ్ణి చూస్తుంటే కృష్ణుడికి ముచ్చట వేసింది. వాడు తన భక్తుడు, కాని చేసేవన్నీ పిశాచపు పనులు. కళ్ళు మూసుకుని ధ్యానించే ఘంటాకర్ణుడి మనో నేత్రంలో తన స్వరూపం కనబడేటట్టు కృష్ణుడు చేశాడు. వాడు కళ్ళు తెరిచి చూసేటప్పటికి అదే రూపం కళ్ళ ఎదట కనబడింది. వాడు లేచి ఆనంద పారవశ్యంతో నృత్యం చేస్తూ, "కృష్ణుణ్ణి చూశాను! విష్ణువును చూశాను!" అని కేకలు పెట్టాడు, కృష్ణుణ్ణి రకరకాల స్తోత్రం చేశాడు. తరవాత వాడు తన శూలానికి గుచ్చి ఉన్న శవాన్ని తీసి, కత్తితో రెండుగా నరికి, " ఇది పవిత్రమైన బ్రాహ్మణుడి శవం. భక్తితో నీకు అర్పిస్తున్నాను. తీసుకో,” అన్నాడు.
కృష్ణుడికి వాణ్ణి చూస్తే జాలి వేసింది. అతను ఘంటాకర్ణుడితో, "చూడు నాయనా! నాబోటివాళ్ళు పీనుగను తాకరు. ఇటువంటి పూజలు నాకు చాలా అసహ్యం కూడానూ. మామూలు పిశాచాలు చేసే ఇటువంటి పనులు నీ వంటి గొప్పవాడు చేయరాదు. ఎప్పుడూ నన్నే ధ్యానిస్తూ ఉంటావు గనక నేను నీకు ఉత్తమ లోకం ఇస్తాను," అంటూ, ఘంటాకర్ణుడి శరీరం తాకాడు. పరుసవేది తగలగానే ఇనుము బంగారు మైనట్టుగా, కృష్ణుడి చెయ్యి తగలగానే ఆ భయంకర పిశాచి కాస్తా దేవతగా మారిపోయాడు.
త్వరలోనే రాత్రి గడిచిపోయింది. సూర్యోదయమయింది. కృష్ణుడు గంగా స్నానం చేసి, బదరీవనంలోని మునులకు వీడ్కోలు చెప్పి, గరుత్మండుడిపై ఎక్కి కైలాసానికి బయలుదేరాడు. కైలాసం చేర వస్తూ అతను ఆ కొండ మీది వివరాలన్నీ చూసి, శివుడు చేసిన పనులను స్మరించు కుంటూ చాలా ఆనందం పొందాడు.
అతను మానసరోవరం ఉత్తర తీరాన దిగి, అక్కడి మునులందరి పరిచయమూ చేసుకుని, పన్నెండేళ్ళు తపస్సు చెయ్య టానికి పూనుకున్నాడు. అతను ఫాల్గుణ మాసారంభంలో దీక్ష పుచ్చుకుని, కంద మూలాలు తింటూ పన్నెండేళ్ళపాటు తపస్సు కొనసాగించాడు. పన్నెండేళ్ళు పూర్తి అయాయి. ఆఖరు రోజున ఇంద్రుడూ, ఇతర దేవతలూ కృష్ణుణ్ణి చూడవచ్చారు. అతను ఏ ఉదేశంతో ఇంత దీర్ఘ తపస్సు చేశాడో వారికి అంతుబట్టలేదు.
ఆ మర్నాడు వృషభవాహనం మీద పార్వతితో సహా శివుడే బయలుదేరి వచ్చాడు. ఆయన వెంట పుష్పకం మీద కుబేరుడూ, తమ తమ వాహనాల మీద విఘ్నేశ్వరుడూ, కుమారస్వామి, వాళ్ళకు ముందుగా ఆయుధాలు ధరించి నందీ, మహాకాళుడూ, వెనకగా భూతగణాలూ వచ్చారు. వారంతా పాడుతూ, నృత్యాలు చేస్తున్నారు.
కృష్ణుణ్ణి అంతదూరాన చూడగానే శివుడు పార్వతితో సహా వృషభవాహనం దిగాడు. కృష్ణుడు కూడా శివుణ్ణి దూరాన చూస్తూనే, తన ఆసనం మీది నుంచి లేచి ఎదురు వచ్చి, ఎంతో భక్తితో తలవంచి, నమస్కరించుతూ శివుడి కెదురుగా నిలబడ్డాడు. ఆ సమయంలో అక్కడ చేరిన దేవతలందరూ శివకేశవులను ఒకేసారి చూసి తమ జన్మలు తరించాయని ఆనందపడ్డారు.
కృష్ణుడు శివుడికి సాష్టాంగ ప్రణామం చేసి ఆయనను కీర్తించాడు. శివుడు చాలా సంతోషించి, కృష్ణుడి చేతిని తన చేత్తో పట్టుకుని ఇలా అన్నాడు.
"కృష్ణా, ఇదివరకే నువు తపస్సిద్ధి చేత నా నుంచి వరంగా ఒక కొడుకును పొంది ఉన్నావు. నేను పూర్వం కృత యుగంలో అనేక వందల ఏళ్ళపాటు ఒకానొక సంకల్పంతో అతనిష్ఠగా తపస్సు చేశాను. అప్పుడు నాకు పరిచర్య చెయ్య టానికని హిమవంతుడు ఈడు వచ్చిన తన కుమార్తెను, ఆమె సఖీ జనాన్నీ సమర్పించాడు. నేను కూడా అందుకు అంగీకరించాను. ఆ సందర్భంలో మా ఇద్ద రినీ కలపాలని నిశ్చయించి ఇంద్రుడు మన్మధుణ్ణి ప్రేరేపించాడు. ఆ మన్మధుడు నా మీదికి ఎత్తి వచ్చి, నేను సమాధిలో నుంచి బయటికి వచ్చే సమయం కోసం వేచి వుండి, నా గుండె మీద మోహనాస్త్రం ప్రయోగించాడు. వెంటనే నాలో మన్మధ వికారం కలిగి నేను పార్వతి కేసి చూశాను. ఆమె పులకించిన శరీరంతో చాలా అందంగా కనిపించింది. ఎందు కిలా అయిందా అని ఆశ్చర్యపడుతూ నేను చుట్టూ కలయ జూశాను, తన దగ్గర ఉన్న ఆయుధాలన్నీ నా పైన ప్రయోగించటానికి సిద్ధపడిన మన్మ ధుడు కనిపించాడు. ఆటువంటి దుర్మార్గుణ్ణి చంపితే మాత్రమేమిటని నేను అనుకుం టూండగానే నా ఫాలనేత్రం నుంచి అగ్ని పుట్టు కొచ్చింది. మన్మధుణ్ణి శిక్షించ వద్దనీ, ఆగ్రహించ వద్దనీ ఆకాశాన దేవతలు కేకలు పెడుతూండగానే, అగ్నిజ్వాలలు మన్మధుణ్ణి ఆవరించి, బూడిద చేసేశాయి. ఆ తరవాత బ్రహ్మ మొదలు గాగల దేవతలు వచ్చి, మన్మధుడు ముల్లోకాలకూ మేలు చేకూర్చే వాడని చెప్పగా, బ్రహ్మ ఉద్దేశానుసారం అతన్ని నీకు కొడుకుగా నిర్ణయించాను. అతనే ప్రద్యుమ్నుడు, నీకూ, రుక్మిణికీ కలిగిన తొలి సంతానం. నువ్విప్పుడు చేసిన తపస్సుకు ఫలితం ముందుగానే పొందావు. "
తరవాత శివుడు అక్కడ చేరిన మునులు మొదలైన వారిని పలకరించి, కృష్ణుణ్ణి శ్రీమన్నారాయణుడుగా భావించి పూజించ మని చెప్పి, అంతర్థానమైనాడు. అతనితో బాటే పార్వతీ, విఘ్నేశ్వరుడూ, కుమార స్వామీ, నంది, ప్రమధ గణాలవారూ అంతర్ధానమయారు. కృష్ణుడు కూడా బదరీ వనానికి తిరిగి వచ్చాడు.