ద్వారక పైకి దండెత్తి వెళ్ళే సన్నాహంలో ఉండగా పౌండ్రవాసుదేవుడి ఇంటికి నార దుడు వచ్చాడు. పౌండ్రుడు నారదుడికి ఎదురు వెళ్ళి, అర్ఘ్యపాద్యాలిచ్చి, బంగారు ఆసనం మీద కూర్చోబెట్టి, "మహానుభావా, 'నువు తిరగని లోకం లేదు. ఎక్కడికి ఎక్కడికి పోయినా నిన్నెవరూ అడ్డగించరు. అందు చేత నా కొక సహాయం చెయ్యి. నేను కృష్ణుణ్ణి, అతని బలగాన్నీ సర్వనాశనం చెయ్యబోతున్నానని అన్ని లోకాలలోనూ చెప్పు. ఆ గొల్లవాడు నా పేరు పెట్టుకుని తిరుగుతున్నాడు," అన్నాడు.
ఈ మాటకు నారదుడు చిరునవ్వు నవ్వి, "నేను సమస్త లోకాలూ తిరిగే మాటా నిజమే, నా మాట అందరూ నమ్మేది నిజమే. కాని నువు చెప్పేమాటే అను మానాస్పదంగా ఉన్నది. కృష్ణుడికి, నీకూ పోలికేమిటి? కొండ ముందు నలుసులాటి వాడివి, నువు కృష్ణుడికి ప్రతి యోధుడి వెలా అవుతావు? నిన్ను కృష్ణుడు తప్పక శిక్షిస్తాడు. శిక్షిస్తాడు. అందుచేత ఈ ప్రయత్నం మానుకో. నీ పేరూ వాసుదేవుడే గదా అనీ, నీకు కూడా శంఖ చక్ర గదా శార్ఙ్గలున్నా యనీ కృష్ణుడితో సమానుడివి కాబోవు. నవ్వుల పాలైపోగలవు. నీ మదం అణచ టానికి అతను కూడా ఎదురు చూస్తూనే ఉంటాడు," అన్నాడు.
పౌండ్రుడు బిగ్గిరిగా నవ్వి, "నువ్వన్నది కాదంటే కోప్పడతావు, శపిస్తావు. అందు చేత ఏమన్నా అనాలంటే మా బోటి వాళ్లం భయపడతాం. ఈ మాటలే మరొకడంటే బతకనిచ్చేవాణ్ణా? నీతో వాగ్వాదానికి నాకు తీరిక లేదు. నీ నోటితోనే నన్ను మెచ్చు కునే రోజు వస్తుందిలే. ఇంక దయచెయ్యి," అని చెప్పాడు.
నారదుడు పౌండ్రుడితో ఏమీ అనక తిన్నగా బదరికాశ్రమానికి వెళ్ళి, అక్కడ ఉన్న కృష్ణుడితో పౌండ్రుడి యుద్ధ సన్నాహం గురించి చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు.
ఆ రాత్రే పౌండ్రుడు ప్రచండమైన సేనతో బయలుదేరి ద్వారకను ముట్టడించ బోయాడు. కొన్నివేల దివిటీలతో అతని సేన ద్వారక యొక్క తూర్పు ద్వారం వద్ద 'చేరింది. వాళ్ళు ఆ అపరాత్రివేళ దిక్కులు బద్దలయేలాగా భేరీలూ, కాహళులూ మోగించారు.
యాదవులు తగు జాగ్రత్తలోనే ఉన్నారు. రాత్రివేళల కూడా ద్వారకానగరం దివిటీ లతో పగటి వేళ ఉన్నంత ప్రకాశవంతం గానూ ఉంటున్నది. పౌండ్రుడి రాకకు ఏ మాత్రమూ కంగారు పడక యాదవులు అతి శీఘ్రంగా తమ సేనలను యుద్ధానికి ఆయత్తపరిచారు. తరువాత ఉగ్రసేనుడూ, బలరాముడూ, సాత్యకి, కృతవర్మా ముందుండి, సైన్యాల్ని వెంట బెట్టుకుని వచ్చి పౌండ్రుడి సేనలతో మహాదారుణ మైన యుద్ధం ప్రారంభించారు. ఉభయ పక్షాలా ఏనుగులు, గుర్రాలూ, రథాలూ నాశనం కాసాగాయి.
ఒక వంక సంకుల సమరం సాగు తూంటే, పౌండ్రుడి పక్షానికి చెందిన ఏక లవ్యు డనే వాడు తన పేరు చెప్పుకుని సాత్యకినీ, కృతవర్మనూ, బలరాముణ్ణి, కృష్ణుణ్ణి పేర్లు పెట్టి పిలిచి యుద్ధానికి సవాలు చేశాడు. యాదవవీరులు అతనికి ఎదురు రాగా అందరినీ బాణాలతో కొట్టాడు. దివిటీలవాళ్ళు దివిటీలు పారేసి పారిపోయారు. యుద్ధరంగం అంతా చీకటి అయింది. పౌండ్రుడు తాను గెలిచానే అను కున్నాడు. "కోట గోడలు ఎక్కండి, ధ్వజాలు విరగ గొట్టండి, నగరం ఆక్రమిం చండి!" అని పౌండ్రుడు కేకలు పెడు తూంటే అతని సేనలో ఉత్సాహమూ, కోలాహలము జాస్తి అయాయి.
ఈ పరిస్థితి చూసి సాత్యకికి మండి పోయింది. కృష్ణుడు నగర రక్షణ భారం తన మీద పెట్టి వెళ్ళాడు. కృష్ణుడు లేని కారణం చేతనే శత్రువు లింతగా విజృంభించారనే మాట వస్తుంది. అందుచేత అతను తన పక్షానికి చెందిన యోధులను ఉత్తేజపరుస్తూ, "నేనీ శత్రువులను ఎలా నిర్మూలించ బోతున్నానో చూడండి. నగరం రక్షించే భారం మన అందరి పైనా ఉన్న దన్న సంగతి మరిచారా?" అన్నాడు.
ఇలా అంటూనే సాత్యకి ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. దానితో కోట నాలుగు పక్కలా మంటలు పుట్టుకొచ్చాయి. కోట గోడలు ఎగబాకే ప్రయత్నంలో ఉన్న "సైని కులు పారిపోయారు. సాత్యకి వారిని తరుము కుంటూ వెళ్ళి, "రాజైపుట్టి, రాచమర్యాద కూడా తెలియకుండా, అర్ధరాత్రివేళ అందరూ నిద్రపోయే సమయంలో దొంగ లాగా యుద్ధానికి వచ్చిన ఆ నీచు డెక్కడ?. నేను అతనితో యుద్ధానికి వచ్చాను,” అని కేక పెట్టాడు.
ఈ కేక విని యుద్ధసన్నద్ధుడై ఉన్న పౌండ్రుడు ముందరికి వచ్చి, "ఓయీ, సాత్యకీ, నువు యుద్ధానికి వచ్చావు, బాగానే ఉన్నది. కాని ఆ కృష్ణుడెక్కడ? అతగాడు ఆవులను తోలుకోక పెద్ద యోధుడనని తిరుగుతున్నా డేమిటి? నా సంగతి ఎరగడా? స్త్రీలనూ, గొడ్లనూ సంహరించే వాడు నా పేరు తగిలించుకుంటే ఏమైనా నప్పుతుందా? ఆ కృష్ణుడు నా మిత్రుణ్ణి నరకుణ్ణి చంపాడు. అందుచేత అతన్ని యుద్ధంలో కడతేర్చ వచ్చాను. నీతో యుద్ధం చెయ్యటం నాకు పరువు చేటు. అందుచేత నువు తప్పుకో. కాదంటావా ? ఒక్క క్షణంలో నా బాణాలతో నిన్ను పర లోకానికి పంపగలను, చూసుకో! దాంతో మీ గోపాలుడి మదం అణిగి పోతుంది. అతను ఈ గొల్లపల్లె భారమంతా నీ నెత్తిన పెట్టి కైలాస యాత్ర వెళ్ళాడని తెలుస్తు న్నది. వచ్చాక అతని సంగతి చూస్తాం. ప్రస్తుతానికి అతనికి సంతోషం కలిగేటట్టుగా చావటమే నీ ధర్మం,” అన్నాడు.
ఇద్దరూ ఇదే ధోరణిలో బీరాలు పలికి యుద్ధానికి దిగారు. ఇద్దరూ బాణాలతో పర స్పరం క్రూరంగా హింసించుకున్నారు, ఒకరినొకరు మూర్ఛ పోగొట్టారు; ఒకరి రధా లొకరు ధ్వంసం చేశారు; ఒకరి బాణా లొకరు విరగగొట్టారు. ఇద్దరూ గదాయుద్ధం చేశారు; చివరకు ముష్టియుద్ధం కూడా చేశారు. ఇద్దరూ సమ బలులుగా కనిపిం చారు. చస్తే ఇద్దరూ చస్తారు గాని, ఒకరిని మరొకరు చంపి, గెలవటం సాధ్యం కాదని చూసే వారికి అనిపించింది. చివరకు ఉభయపక్షాల యోధులూ వారి యుద్ధానికి అడ్డం తగిలి, వారిని విడదీశారు.
తరవాత ఏకలవ్యుడూ, బలరాముడూ ద్వంద్వ యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో బలరాముడు ఏకలవ్యుణ్ణి మూర్ఛపోగొట్టి, తన హలాయుధంతో శత్రుసైన్యాన్ని చించి చెండాడాడు.
ఇంతలో స్పృహ తెలిసి ఏకలవ్యుడు తిరిగి బలరాముడి పైన కలియ బడ్డాడు. వారు భయంకరంగా యుద్ధం చేస్తూండ గానే తూర్పు తెల్లవారింది.
అప్పుడు పౌండ్రుడు తన సేనలను యుద్ధం నిలపమని హెచ్చరిస్తూ, "మనం" ఎంత మందిని చంపి ఏమి లాభం? అసలు శత్రువు లేడు. అందుచేత ఈ యుద్ధం నిరర్ధకం. కృష్ణుడు వచ్చాక మన పరాక్రమం చూపుదాం. ఈ క్షుద్రుల మీద మన ప్రతాపం చూపే దేమిటి?” అన్నాడు.
వెంటనే పౌండ్రుడి సేనలు యుద్ధం మాని వెనక్కు తగ్గాయి. పౌండ్రుడు తన సేనలను వెంటబెట్టుకుని, తన మిత్రుడైన కాశీరాజు వద్దకు వెళ్ళిపోయాడు. కృష్ణుడి రాకకు ఎదురుచూస్తూ అతను అక్కడే ఉండిపోయాడు.
ద్వారకలో యాదవులు తమకు విజయం లభించిందన్నట్టు తూర్యనాదాలు చేసి, నగరం లోపలికి వెళ్ళిపోయారు. కృష్ణుడి మాట నిలబెట్ట గలిగినందుకు వారు చాలా సంతోషించారు.
ఇంతలో కృష్ణుడు ఆకాశమార్గాన వారికి కనిపించాడు. అతను' నగరం బయట గరుడవాహనం దిగి, దారుకుడు తెచ్చిన రథ మెక్కి, ద్వారకలోకి వచ్చాడు. పన్నెం డేళ్ళ అనంతరం కనిపించిన కృష్ణుణ్ణి చూసి యాదవు లెంతో సంతోషించారు. కృష్ణుడు తన కైలాసయాత్ర వివరాలన్నీ చెప్పి, పౌండ్రుడు చేసి వెళ్ళిన యుద్ధం గురించి విన్నాడు.
కృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చాడని తెలిసి, కాశీలో ఉన్న పౌండ్రుడు ఒక దూత ద్వారా ద్వారకలో ఉన్న కృష్ణుడికి ఇలా సందేశం పంపాడు:
"గోవుల మధ్య పుట్టి పెరిగిన నీకు ధర్మం తెలీదు. స్త్రీలనూ, మృగాలనూ, బంధువులనూ వధించటంతో ఊరుకోక, నా పేరూ, నా చిహ్నలూ కూడా ధరించావు. ఏ విధంగానూ నువు నన్ను పోలవు. నీకు బతికి ఉండాలన్న కోరిక ఉంటే, నా ఆజ్ఞ ప్రకారం చక్రం మొదలైన ఆయుధాలు విసర్జించు; నా పేరు పెట్టుకోవటం మాని, వచ్చి నన్ను శరణువేడు.”
పౌండ్రుడి మాటలుగా దూత ఇలా చెప్పగా కృష్ణుడు నవ్వి, "మీ రాజు చెప్పి నట్టే చేస్తాను. నన్ను రమ్మన్నాడు గనక వస్తాను; చక్రం మొదలైనవి విడవమన్నాడు గనక అతని మీదనే విడుస్తాను. తన శరణం వేడమన్నాడు గనక, అతని శరణం (వధ) చూస్తాను. గొప్పవాడి మాట తీసి వెయ్యటం బాగుండదు,” అని దూతను గొప్పగా సత్కరించి పంపేశాడు.
తన దూత తెచ్చిన సందేశం వినగానే పౌండ్రుడు కాశీనగరం వెలపల తన తోటి రాజులతోనూ, సైన్యాలతోనూ సన్నద్ధుడై కృష్ణుడి రాక కోసం ఎదురు చూడసాగాడు.
కృష్ణుడు బయలుదేరుతూంటే సాత్యకి మొదలైన వాళ్ళు కూడా సైన్యాలతో బయలుదేరబోయారు. కాని కృష్ణుడు వారిని వారించి, " యుద్ధంలో మీ వంతు గెలుపు మీరు పొందారు. ఈ సారి నా వంతు,” అని చెప్పాడు.
అతను గరుడవాహనం మీద బయలు దేరి పొండ్రుడున్న చోటికి చేరాడు. ఇద్దరు వాసుదేవులూ ఒకరి కొకరు ఎదురు నిల్చారు. కృష్ణుడు పౌండ్రుడితో, "పౌండ్రరాజా, నీకు నా లాంఛనాలన్నిటినీ ధరించాలని కోరిక ఉన్నట్టయితే నన్ను వేడుకుంటే నేను సమ్మతించక పోయానా? ఎందు కొంత మతిమాలిన పని చేశావు? ఇప్పుడైనా మించి పోలేదు, నన్ను వేడుకుంటే నేను నిన్ను కాస్తాను. నేను శరణాగత త్రాణపరాయణుణ్ణి. నా చక్రంతో నరకుడి లాగా ఎందరో చచ్చారు. ఇక్కడ ఉన్న వారిలో ఒక్కడూ నిన్ను రక్షించ లేడు. నీ మేలు కోరి హితం చెప్పాను,” అన్నాడు.
"నా లాంఛనాలనే నువు పెట్టుకున్నావు.. అందుకు నిన్ను శిక్షించటానికే నేను వచ్చాను. నా రాక తెలిసి కొంతకాలం కైలాసంలో దాక్కున్నావు. నువు లేవని తెలిసి నీ నగరాన్ని నేల మట్టం చెయ్యక వదిలాను. సుపు రావటం మంచిదయింది. నీ కోసం యముడు కాచుకుని ఉన్నాడు," అన్నాడు పౌండ్రుడు.
ఇద్దరూ యుద్ధానికి ఉపక్రమించారు. కృష్ణుడు వరసగా పౌండ్రుడి ఆయుధాలన్నీ నిర్మూలించి, తన చక్రాయుధంతో పౌండ్రుణ్ణి కడతేర్చాడు.
తన ఆప్తమిత్రుడైన పౌండ్రుడు చచ్చా డన్న రోషంతో కాశీరాజు కృష్ణుడితో యుద్ధా నికి తలపడ్డాడు. కృష్ణుడు ఒక అస్త్రంతో కాశీరాజు తల తెగసరికాడు. ఆ తల వెళ్ళి కాశీనగరం మధ్యన పడింది.
ఈ విధంగా కృష్ణుడు. తాను వచ్చిన పని ముగించి ద్వారకకు తిరిగి వెళ్ళాడు.
కాశీరాజు కొడుకు తన తండ్రి చావుకు దుఃఖించి, తమ పురోహితుడి చేత అగ్ని హెూత్రం చేయించగా దక్షిణాగ్నియందు కృత్య అనే భయంకర పిశాచి ఆవిర్భ వించి, "ఏమి ఆజ్ఞ?" అని అడిగింది. కృష్ణుణ్ణి, అతని వాళ్ళనూ చంపి రమ్మని కాశీరాజు కొడుకు దాన్ని కోరాడు. కృత్య ద్వారకకు వచ్చింది. ద్వారకావాసులు దాన్ని చూసి భయపడి కృష్ణుడితో చెప్పారు. కృష్ణుడు తన సుదర్శనచక్రాన్ని దాని మీదికి వదిలాడు. కృత్య తిరిగి కాశీకి పారి పోతుంటే చక్రం దాన్ని వెన్నంటి వెళ్ళింది. కృత్య కాశీనగరంలో ప్రవేశించగానే సుద ర్శనచక్రం కృత్యతోబాటు కాశీనగరాన్ని కూడా పూర్తిగా నిర్మూలించేసింది.