24. బాణాసురుడి కథ | Lord Shiva Devotee - Banasura Story | Lord Krishna Avatar Story in Telugu

writer
0
బలి కుమారుడు బాణాసురుడు. అతని రాజధాని శోణపురం. వెయ్యిచేతులు గల బాణుడు చిన్నతనంలో తెగ తిరిగాడు. ఒకనాడు అతను, మణులతోనూ, బంగారం తోనూ ప్రకాశించే కుబేర పర్వతపు గుహలో కుమారస్వామి ఆటలలో ముణిగి ఉండ టమూ, శివపార్వతులు వినోదించుతూ ఉండటమూ చూశాడు.

కుమారస్వామి ఆరు ఆరు ముఖాలూ, చేతులూ, శరీరచ్ఛాయా, తేజస్సు చూసి బాణుడు, " ఈ కుర్రవాడు ఏ తపస్సు చేసి శివుడికి కొడుకై జన్మించాడో గదా! నేను కూడా అలాగే తపస్సు చేసి ఈ మహా దృష్టాన్ని సాధించాలి," అనుకున్నాడు. అలా అనుకున్న బాణుడు ఏకాగ్రభక్తితో అనేక సంవత్సరాల పాటు నిష్ఠగా శివుణ్ణి ఆరాధించాడు. శివుడు అతని ఆరాధనకు సంతోషించి, పార్వతీసమేతుడై బాణుడి ఎదట ప్రత్యక్షమై, చిరునవ్వు నవ్వుతూ, "నాయనా, నీ ఇష్టంవచ్చిన వరం కోరుకో, ఇస్తాను,” అన్నాడు.

బాణుడు చేతులు మోడ్చి, " దేవా, నే నీ దేవికి కొడుకునై, నీ అనుగ్రహానికి పాత్రుణ్ణి ఆయేటట్టు వరం ఇయ్యి,” అని అడిగాడు.

శివుడు సరేనని, పార్వతిని చూసి, "దేవీ, వీడు బాణుడు. నీ చిన్నకొడుకు. కుమార స్వామికి రెండేవాడు. వీణ్ణి గ్రహించు," అన్నాడు. తరువాత శివుడు బాణుడికి, సమస్త సంపదలతోనూ తులతూగే శోబపురాన్ని రాజధానిగా ఇచ్చి, "నీ నగరాన్ని నేను స్వయంగా కాపాడుతూ ఉంటాను. నిన్ను ఎంతటివాడూ జయించలేడు. అందు చేత నువు నిశ్చింతగా ఉండు,” అన్నాడు.

కుమారస్వామి బాణుడిక ఒక దివ్యమైన నెమలిని ఇచ్చి, "ఈ నెమలే నీకు వాహ నము, పతాక కూడా అయి ఉంటుంది," అని చెప్పాడు.

ఇక బాణుడికి ఎవరి భయమూ లేదు. ఎందుకంటే, శివుడే తనకు రక్ష. అతను విజృంభించి దేవతలనూ, గంధర్వులనూ, నాగులనూ, ఖేచరులనూ, రాక్షసులనూ, సమస్తమైన వారినీ ఒకరి తరువాత ఒకరినిగా జయించి, యుద్ధం చెయ్యాలనే ఆసత్తి తీగ, తనతో యుద్ధం చెయ్యగల వాణ్ణి కానక తపించిపోయాడు.

అనేక సంవత్సరాలు అలా గడిచిన మీదట అతని చేతుల తీట దుర్భర మయింది. అతను శివుడి వద్దకు వెళ్ళి, సాష్టాంగపడి, భక్తిగా పూజ చేసి, "దేవా, నాకు యుద్ధం కరువైపోయింది. నా చేత అనేకసార్లు ఓడిపోయిన దేవతలు నా ఎదట పడకుండా ఉన్నారు. నాతో యుద్ధం చెయ్య టానికి సిద్ధంగా ఉన్న శూరుడు మూడు లోకాలలోనూ ఒక్కడైనా కానరాడు. నా చేతులన్నీ వ్యర్ధంగా ఉండిపోయాయి. ప్రదర్శించటానికి లేని పరాక్రమం వృధా కదా! నాకు యుద్ధం చేసే అవకాశం ఎలా కలిగేదీ తెలిపి అనుగ్రహించు," అని వేడుకున్నాడు.

శివుడు బాణుణ్ణి చూసి నవ్వి, "నువ్వడిగి నది నేను కాదనటం భావ్యంకాదు గద. విను. నీ మయూరధ్వజం ఏ కారణమూ లేకుండా ఒరిగి, పడిపోయినప్పుడు నువు కోరుకుంటున్న యుద్ధం నీకు సన్నిహిత మవుతుందనుకో. అప్పుడు నీ బాహుబలా నికి తగినటువంటి యుద్ధం సంభవిస్తుంది. విచారించకు," అన్నాడు.

"అమ్మయ్య, బతికిపోయాను,” అని బాణుడు శివుడికి మొక్కి, సెలవు తీసు కుని, తన యింట నెమలిధ్వజం ఉన్న చోటికి వెళ్ళి కూర్చుని, సభ జేసి, తన మంత్రి అయిన కుంభాండుడితో, "ఒక మంచి వార్త తెచ్చాను,” అన్నాడు.

దానికి కుంభాండుడు, " మంచి వార్తలు " చాలా ఉంటాయి. అందులో ఇది ఏది? నీకు శిపుడు కొత్తవరం ఏదన్నా ఇచ్చాడా? లేకపోతే, ఇంద్రుణ్ణి పాతాళానికి పంపేసి, దేవలోకాన్ని నిన్నే ఏలుకోమన్నాడా ? అదీ కాకపోతే, కృష్ణుణ్ణి గెలిచే ఉపాయం గాని చెప్పలేదు గద ? అదే జరిగితే ఇంక లేని దేమిటి? విష్ణుడి చేత మోసపోయి పాతాళం చేరిన పరమ ధర్మాత్ముడు నీ తండ్రికి విముక్తి కలుగుతుంది. ఆయనను మళ్ళీ చూచి ధన్యులమవుతాం,” అన్నాడు. 

బాణుడు చిన్నగా నవ్వుతూ, " కాదు, కుంభాండా ! యుద్ధాలు లేని కారణం చేత నా చేతులు దురదగా ఉండి, నాకు యుద్ధం చేసే అవకాశం ఎలా కలుగుతుం దని శివుణ్ణి వేడుకున్నాను. నా యీ మయూరధ్వజం అకారణంగా ఎప్పుడు పడిపోతే అప్పుడు నాకు తగిన యుద్ధం రాబోతుం దగ్గరోమని ఆ మహాదేవుడు చెప్పాడు. అదే నీకు నేను చెబుదామనుకున్నాను ,” అన్నాడు.

కుంభాండుడు చిన్నబోయి, "అయ్యో, ఇదేం ప్రారబ్ధం ! ఇదా నువు మహాశివుణ్ణి అడిగిన వరం? ప్రహ్లాదుడి కులాని కెంత దుస్థితి వచ్చింది!” అన్నాడు.

అతనా మాట అంటూండగానే పెళపెళా రావాలతో మయూరధ్వజం, వజ్రాయుధం దెబ్బతిన్న కొండ లాగా, ఒరిగి పడిపోయి, బాణుడూ, కుంభాండుడూ చూస్తుండగా విరిగిపోయింది. 'తన కోరిక ఈడేరుతున్న దని బాణుడు పరమానందభరితుడయాడు. అదే క్షణంలో భూమి కంపించటమూ, ఆకాశాన తోకచుక్క కనబడటమూ, ప్రచం డంగా గాలి వీచటము, శోణపురం మీద రక్తవర్షం కురవటమూ, మొదలైన ఉత్పా తాలు కలిగాయి.

వాటిని చూసి కుంభాండుడు బెదిరిపోయి, తనలో, "మూడులోకాలనూ గెలిచి, తన ఎదట నిలిచేవాడు లేకుండా చేసుకున్న బాణుడు, గర్వాతిశయం కొద్దీ యుద్ధం వరంగా తెచ్చుకున్నాడు. ఎంత పొరపాటు! ఇది ఇతని నాశనానికే వచ్చింది. ఎంత మంచివాడిలో నైనా రాక్షసబుద్ధి రాక్షసబుద్ధ! ఈ ఉత్పాతాలన్నీ ఊరికే పోతాయా? శివుడూ, కుమారస్వామి నగరాన్ని రక్షిస్తున్నప్పటికీ వరం మూలాన లభించిన యుద్ధం తప్పదు. అయితే బాబుణ్ణి ఎది రించి నిలబడగల వాళ్ళు లేరు దేవతల పరాజయం సహించలేని విష్ణువు తప్ప," అనుకున్నాడు.

బాణుడు మాత్రం నిశ్చింతగానూ, ఉత్సాహంగానూ, సమస్త భోగాలలోనూ ముణిగితేలుతూ, విష్ణువుతోనైనా సరే యుద్ధం చెయ్యటానికి సంసిద్ధుడై ఉన్నాడు. 

బాణుడికి ఉష అనే కుమార్తె ఉన్నది. చంద్రుడి కళలే స్త్రీ రూపం ధరించాయా అనిపించేటంతటి సౌందర్యవతి. ఆమెకు చెలికత్తె అయిన చిత్రరేఖ కుంభాండుడి కూతురు. తండ్రి ఆదేశించిన మీదట ఉష తనకు తగిన భర్త లభించాలని పార్వతీ దేవిని ప్రార్ధిస్తూ ఉండేది.

ఇంతలో చైత్రమాసం వచ్చింది. గోణ నగరంలోనే ఉంటున్న శివుడు పార్వతితో కూడా వసంతవిహారాలు చేయ నిశ్చయించి, అనేకమంది అప్సరసలనూ, గంధర్వ స్త్రీలనూ రప్పించాడు. స్త్రీలను పార్వతి రూపాలు ధరించమన్నాడు. ప్రమధగణా లను శివశక్తి రూపాలు ధరించమన్నాడు. అందరూ కలిసి శోణపురం వెలపల, మందా కినీ నది ఒడ్డున గల తోటలలో ఆటలూ, వినోదాలూ, వేడుకలూ సాగించారు. సృత్య గానాలు సాగాయి.

మహా ఉల్లాసంగా సాగే ఈ వినోదాల మధ్య శివపార్వతులు ఆలింగనం చేసుకో వటం ఉష చూసింది. వెంటనే ఆమెకు తన భర్తను తాను కౌగలించుకునే అదృష్టం ఎప్పుడు కలుగుతుందా అనిపిం చింది. తన కేమి లోటు? తన తండ్రి మూడు లోకాలూ ఏలేవాడు. సాక్షాత్తూ పార్వతీదేవే తన ఇలవేల్పు. తనకు తగిన భర్తను ప్రసాదించమని తాను పార్వతిని నిత్యమూ ప్రార్థిస్తున్నది. అయినా తన కోరిక ఎందుకు తీరటం లేదు ?

ఈ విధంగా ఉష తన మనస్సులో అనుకోవటం పార్వతి గ్రహించి, చెయ్యి ఊపి ఆమెను తన దగ్గరికి పిలిచి, "బాలా, నీ మనసులో ఉన్న ఆలోచన సరిఅయినదే. కన్యలు భర్తల కోసం తపించటం తప్పు కాదు. త్వరలోనే నీకు భర్త దొరుకుతాడు. శివుడితో నేను పొందే సౌఖ్యాన్ని నువు కూడా పొందుతావు. అది ఎలా జరిగేది చెబుతాను, విను. వచ్చే వైశాఖ శుద్ధద్వాదశి రాత్రి నువు నిద్రపోతూండగా ఒక పురుషుడు కలలో వచ్చి నిన్ను కలుస్తాడు. అతనే నీకు కాబోయే భర్త," అన్నది.

ఉష సంతోషంతోబాటు సిగ్గుపడుతూ, పార్వతికి మొక్కి వెళ్ళిపోయింది.

పార్వతి చెప్పినట్లే జరిగింది. ఒకనాటి రాత్రి ఉష తన చెలికత్తెలతో సహా మేడ మీద సుఖనిద్రలో ఉండగా ఆమెకు కల వచ్చింది. అందులో ఒక మన్మధాకారుడు ఆమెను సమీపించి, నవ్వుతూ ఆమెను పలకరించి, ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, ఆమెను కౌగలించుకుని, సుఖా లలో ముంచి ఎత్తాడు.

ఉష అదిరిపాటుతో నిద్ర లేచింది. కళ్లు తెరిచి చూస్తే ఎవరూ లేరు. కాని జరిగినది కలలాగా లేదు, చాలా వాస్తవంగా ఉన్నది. ఆమెకు భయమూ, సిగ్గూ కలిగాయి. ఆమె పార్వతీదేవి చెప్పిన మాట పూర్తిగా మరిచి పోయి, ఎవరో తన కన్యాత్వం భంగం చేశారనీ, తనకూ, తన తండ్రి వంశానికి అపకీర్తి వచ్చిందనీ దిగులుపడి, పెద్దగా ఏడవసాగింది.

చెలికత్తెలందరూ నిద్రలేచి ఆమె చుట్టూ మూగారు. చిత్ర రేఖ ఆమె పక్కనే కూర్చుని, ఆమె తలను తన రొమ్ముకు అదుముకుని, " చెలీ, భయపడకు. ఎందు కేడుస్తున్నావు? నీ మనసును కష్టపెట్ట నీ సాహసించే వాళ్ళెవరు? నీ తండ్రి బాణుడు కాడా!" అంటూ కన్నీరు తుడిచి ఓదార్చింది.

ఉష తనకు వచ్చిన కల చెప్పి, అది కల అనటానికి వీల్లేదనీ, తనకు తీరని కళంకం చుట్టుకున్నదనీ, తాను కులటనై పోయాననీ అన్నది. అప్పుడు చిత్రరేఖ ఉషకు పార్వతి చెప్పిన మాటలు జ్ఞాపకం చేసి, "అవాళ వైశాఖ శుద్ధ ద్వాదశి. ఈ రాత్రి నీకు కలలో కనిపించినవాడే నీకు భర్త అవుతాడని దేవి చెప్పలేదా? సంతోషించక దిగులు పడతావేమిటి?" అన్నది.

వెంటనే ఉష ముఖం మబ్బు తొలగిన చంద్రుడిలాగయింది. "చిత్రరేఖా, నా దిగు లంతా ఒక్క క్షణంలో పోగొట్టేశావు. నా అదృష్టం పండే ఉపాయంకూడా నువే చెయ్యి. వర్ణించలేను గాని, అతని ఆకారం కళ్ళకు కట్టినట్టే ఉంది. అతన్ని నువే వెతకాలి. నా భాగ్యమంతా నీ చేతిలోనే ఉన్నది," అన్నది.

"దానికేం? నే నున్నదే నిన్ను సుఖ పెట్టటానికి కద. అతన్ని తీసుకు రావటం ఒక సమస్య కాదు. ముందు అత నెవరై నదీ తెలియాలి. అది తెలుసుకోవటానికి సాధన మేమిటా అని ఆలోచిస్తున్నాను. నువేమో అతన్ని వర్ణించలేనంటున్నావు. నేనేమో అతన్ని చూడకపోతిని, " అన్నది చిత్రరేఖ.

ఉష కళ్ళ నీళ్ళు నింపుకుంటూ, "ఎవరి పనులు వారు చేసుకోవటం సరిఅయినది. ఇంకొకరి పని చెయ్యటం కష్టం. నువు నా ప్రాణంలాంటి దానివి. నిజం చెబు తున్నాను, నువు దయదలచని పక్షంలో నిశ్చయంగా నేను చచ్చిపోతాను,” అన్నది.

చిత్రరేఖ ఆమెతో, "ఎందుకు నీకు విచారం? నాకు కాస్త వ్యవధి అయ్యి. నీ ప్రియుణ్ణి ఏదో విధంగా తెస్తాను. లోకేశ్వరి అయిన పార్వతీదేవే నిన్ను కటా క్షించి ఉండగా నీ కోరికలు తీరటానికి సందేహమేమిటి?” అన్నది.

చిత్రరేఖ మిగిలిన చెలికత్తెలతో, "మీరు ఉషను కనిపెట్టి ఉండండి," అని చెప్పి, ఏకాంతంగా కూర్చుని, రంగులూ, కుంచెలూ తీసుకుని, ఒక వారంరోజుల లోపల ప్రపం చంలోగల ప్రముఖ పురుషులందరి చిత్ర పటాలూ గీసింది. ఎవరెవరు ఎలాటి దుస్తులు ధరించేది, ఎలాటి ఆభరణాలు పెట్టుకునేదీ ఆ చిత్తరువులలో సరిగా చిత్రించింది. తరవాత ఆమె ఆ చిత్రపటాలన్నిటినీ ఉష వద్దకు తీసుకుపోయి, "చెలీ, సృష్టిలో ఉండే ప్రముఖుల నందరినీ కష్టపడి చిత్రించి తీసుకువచ్చాను. వీరిలో నీకు కలలో కనిపించిన వాడెవడో చూసి చెప్పు.. ఈ పటాలలో దేవదానవమానవ ముఖ్యు లందరూ ఉన్నారు,” అన్నది.

ఉష ఒక్కొక్క చిత్తరువే చూసి పక్కన పెడుతూ యాదవ ప్రముఖుల దగ్గిరికి వచ్చేసరికి కృష్ణుడి పటం చూసి ఆశ్చర్యపడింది. తరవాత ప్రద్యుమ్నుడి పటం చూసి మరింత ఆశ్చర్యపడింది. ఎందుకంటే ఇద్దరిలోనూ అనిరుద్ధుడి పోలిక లున్నాయి. అటుతరువాత ఆమె అనిరుద్ధుడి పటం తీసుకుని తనను తానే మరచి పోయింది. ఆమె దానిని పక్కన పెట్టలేదు. ఉష కలలో కనిపించిన వాడు అతనేనని చిత్రరేఖ గ్రహించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)