25. ఉషా అనిరుద్ధుల వివాహం | Krishna’s Grandson Wedding - Usha Aniruddha Marriage | Lord Krishna Avatar Story in Telugu

writer
0

ఉష చూపులు అనిరుద్ధుడి పటం మీద లగ్నమైపోవటమూ, ఆమెకు కలిగిన గగుర్పాటూ గమనించి చిత్రరేఖ చిరునవ్వు నవ్వుతూ, "నీకు కలలో కనిపించినవా డెవడో తెలిసిపోయిందిలే. అతను ఎక్కడ, వీస్థితిలో ఉన్నాసరే, నేను వెళ్ళి అతన్ని తీసుకువచ్చి నీకు అప్పగిస్తాను. ఆ తరవాత నీయిష్టం,” అన్నది.


ఉష చిత్రరేఖను చూసి, "నీ నేర్పు ఎలాటిదోగాని, నువు రచించిన ఈ చిత్తరువు చూస్తూంటే, కలలో అతన్ని చూసినప్పుడు కలిగిన భావాలన్నీ మళ్ళీ కలిగాయి. ఇతనిది ఏ వంశం పేరేమిటి? ఎలాటివాడు? ఏం చేస్తూఉంటాడు? దయవుంచి కాస్త చెబుదూ!" అన్నది.


దానికి చిత్రరేఖ, "ద్వారకా నగరాన్ని ఏలే కృష్ణుణ్ణి గురించి నువు వినే ఉంటావు. శివుడి కంటిమంటకు ఆహుతి అయిన మన్మధుడే కృష్ణుడికి ప్రద్యుమ్ను డనే కొడుకుగా పుట్టాడని చెబుతారు. ఇతను ఆ ప్రద్యుమ్నుడి కొడుకు. పేరు అని రుద్దుడు. అతని శౌర్యం జగత్ప్రసిద్ధమయి నది. అటువంటి వాణ్ణి భర్తగా పొందగలిగితే నీ అదృష్టాన్ని పొగడటం ఆదిశేషుడికి కూడా సాధ్యంకాదు. మన ఈ శోణపురం లాగే ద్వారకానగరం కూడా పరులకు చొరరానిది. అయినప్పటికీ, నీకు సంతోషం కలగగలం దులకు, నేను ఏదో ఒక ఉపాయం చేసి అక్కడికి పోతాను. నీ ప్రియుణ్ణి తప్పక తీసుకువస్తాను,” అన్నది.


"నీకు ఉపాయాలకు లోటా? యోగ విద్య ఎరిగినదానివి, కామరూపమూ, కామ గమనమూ కలదానివి, ఎలాటి పని అయినా సాధించగలవు. ఈ అనిరుద్ధుడి ముఖం నా కళ్ళపడితేనే గాని బతకను. నా ప్రాణాలు కాపాడు. ఇప్పటికే ఏడు రోజులు ఓర్చు కున్నాను. ఇక ఒక్క ఘడియకూడా ప్రాణాలు నిలపలేను,” అని ఉష అన్నది.

చిత్రరేఖ ఉషను కౌగలించుకుని, " నువు వెళ్ళి మిగిలిన చెలికత్తెలతో కాల క్షేపం చేస్తూ ఉండు," అని ఆమెను పంపేసి, తాను ఆకాశంలోకి ఎగిరి అంత ర్ధానమయింది. అలా అంతర్ధానమైన చిత్రరేఖ మనోవేగంతో ఒక్క క్షణంలో ద్వారక చేరి, తరువాత ఏం చెయ్యాలా అని చూస్తూండగా, ఒక కొలను దగ్గిర నారదుడు కనిపించాడు. చిత్రరేఖ ఆయనను సమీ పించి, నమస్కరించింది.


నారదుడు చిత్రరేఖను దీవించి నవ్వుతూ, "ఏమిటి ఇలా వచ్చావు?” అని అడిగాడు.


చిత్రరేఖ ఆయనకు, పార్వతీదేవి ఉషకు చెప్పిన మాటలూ, ఆ ప్రకారమే ఉషకు కలలో అనిరుద్ధుడు కనిపించ టమూ, తాను అనిరుద్ధుణ్ణి తీసుకుపోయి ఉష వద్ద చేర్చటానికి రావటమూ చెప్పి, "అనిరుద్ధుణ్ణి నేను తీసుకుపోతే బాణుడు ఎలాగూ ఆగ్రహించి, అతనిపై తన ప్రతాప మంతా చూపుతాడు. అందుచేత మీరు కృష్ణుడికి ఈ విషయం కాస్త చెప్పటం అవసరం. బాణుడికి, కృష్ణుడికి యుద్ధం జరిగితే ఎలాగూ కృష్ణుడు గెలుస్తాడు. విషయం నాకు భయంలేదు. నాకు ప్రస్తుతం భయమల్లా, నేను తన మనమణ్ణి తీసుకు పోయానని తెలిసి, కృష్ణుడు నన్ను శపిస్తా డేమో నని. మీరు దయచేసి నాకు కృష్ణుడి భయం లేకుండా చేస్తే మా ఉషాకన్య కోరిక ఈడేరుతుంది," అన్నది.


" నారదుడు చిత్రరేఖకు తామని అనే విద్య ఉపదేశించి, " ఈ విద్యద్వారా నీపని సానుకూలం అవుతుంది. నువు అనిరుద్ధుణ్ణి తీసుకుపోయిన కారణంగా బాణుడితో యుద్ధం జరిగినప్పుడు నే నక్కడికి వచ్చి యుద్ధం నిలుపుచేస్తాను,” అని తనదారిన తాను వెళ్ళిపోయాడు.


చిత్రరేఖ అదృశ్యరూపంలో కృష్ణుడి భవనాన్నీ, ప్రద్యుమ్నుడి భవనాన్నీ దాటి, అనిరుద్ధుడి మందిరం చేరి, బంగారు లోటా లతో మధువు తాగుతూ అనేకమంది స్త్రీల మధ్య కూర్చుని ఉన్న అనిరుద్ధుణ్ణి చూసింది. అతన్ని రంజింపజెయ్యటానికి సౌందర్యవతులైన స్త్రీలు ఆడుతున్నారు, పాడుతున్నారు. కాని చిత్రరేఖ అతని కేసి పరీక్షగా చూసి, అతని మనసు అన్యా యత్తంగా ఉండటం గమనించింది. అతను నవ్వితే అది తెచ్చిపెట్టుకున్న నవ్వులా గున్నది, మాట్లాడితే గొంతు గద్గదంగా విని పిస్తున్నది. అతని ఏ చేష్టలోనూ పూనిక అన్నది లేదు.


"కొంపతీసి ఇతను కూడా ఉష లాగే  కలగనలేదు కద! ఇతని మనసును చెదర గొట్టగల అందం ఉషకు కాక మరెవ్తెలో ఉంటుంది? పార్వతీదేవి అనుగ్రహం వల్ల ఏదైనా సాధ్యమే,” అనుకున్నది చిత్రరేఖ.


ఆమెకు అతనితో మాట్లాడాలనిపించింది. నారదుడు తనకు ప్రసాదించిన విద్యద్వారా ఆమె అక్కడ ఉన్న మిగతావాళ్ళందరినీ మూర్ఛపుచ్చి, అనిరుద్ధుణ్ణి సమీపించి, అతని ఎదట ప్రత్యక్షమై, చేతులు జోడించి, ఇలా అన్నది.


"బలిమహారాజు కొడుకు బాణుడు. ఆయనకు పార్వతీదేవి అనుగ్రహంవల్ల ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు ఉష. ఆమె త్రిలోకైక సుందరి. ఆమె చక్కదనాన్ని బ్రహ్మ కూడా వర్ణించలేడు, నావల్ల ఏమవు తుంది? ఉషాకన్య ఒక రాత్రి నిద్రలో నిన్ను చూసి, అప్పటినుంచి విరహబాధతో సతమతమవుతున్నది. నే నామె చెలి కత్తెను, చిత్రరేఖ అనేదాన్ని. నీకు సమ్మత మయిన పక్షంలో నా వెంట నిన్ను తీసుకు పోవచ్చాను. మీ రిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు, సందేహంలేదు. ఇదంతా దైవ ఘటన. అలా జరుగుతుందని పార్వతీదేవి ముందే చెప్పింది. నేను నీ పటం తయారు చేసి చూపి, ఆశరేకెత్తించకపోతే మా ఉష ఏమైఉండేదో! అనేక మంది భార్యలు గల నీ దారి వేరు. నీ కోసమే అలమటిస్తున్న మా ఉషను కాపాడు. నేను నీకు నమస్కారం చేసి వేడుకుంటున్నాను.”


ఈ మాటలు విని అనిరుద్ధుడు, "ఏం చెప్పేది? మీ చెలి కన్న కులే నాకూ వచ్చింది. అది మొదలు నాకు ఏది రాత్రో, ఏది పగలో తెలియటంలేదు. నిద్ర అనేది ఎరగను. నాపాలిటి దేవతలాగా నువు రాక పోతే నాకు ఏం చెయ్యాలో కూడా తెలి యదు. నన్ను నువు వేడుకోనవసరంలేదు. ఉష దగ్గిరికి నన్ను నువు తీసుకుపో, నేను వస్తాను,” అన్నాడు.


ఈ మాటకు చిత్రరేఖ చాలా సంతోషిం చింది. ఆమె అతని చెయ్యి పట్టుకుని ఆకాశంలోకి లేచి, తనతోపాటు అనిరుద్ధుణ్ణి కూడా అదృశ్యమయ్యేట్టుగా చేసింది, మరు క్షణంలో వాళ్ళిద్దరూ శోణపురంలోని ఉష మందిరంలో ఉన్నారు.


ఉషా అనిరుద్ధులు ఒకరి నొకరు ప్రత్యక్షంగా చూసుకున్నారు. ఇద్దరూ ఆనంద పారవశ్యం చెందారు.


"ఇదుగోనమ్మా, నీ ప్రియుడు. నామాట చెల్లించుకున్నాను. అతనికి నీ చెయ్యి ఇచ్చి పాణిగ్రహణం చెయ్యి. గాంధర్వ వివాహం రాజులకు తగినది. దీనికి పార్వతీదేవి కటాక్షం కూడా తోడయింది. ఇక మీరు భార్యాభర్తలు,” అంటూ చిత్రరేఖ ఉషను కౌగలించుకుని, ఇద్దరికీ కొత్తబట్టలూ, పూల దండలూ, ఆభరణాలూ ఇచ్చింది. అనిరుద్దుడు ఉష చేతిని తన చేతిలోకి తీసుకుని పాణిగ్రహణం చేశాడు.


కొన్నాళ్ళు ఉషా అనిరుద్ధులు దాంపత్య సుఖం అనుభవిస్తూ గడిపిన మీదట, వారి రహస్యం అంతఃపురపు కావలివారికి తెలిసింది. వాళ్ళు వెళ్ళి బాణుడితో చెప్పారు. ఎవరో ఒక మానవమాత్రుడు, తన ఖ్యాతినీ, పరాక్రమాన్నీ లక్ష్యపెట్ట కుండా, తన యింట ప్రవేశించి, తన వంశా నికి మణిపూసలాటి తన కుమార్తెను కళంక పరిచాడనే సరికి బాణుడికి అగ్రహం వచ్చింది.


"మీరు వెంటనే వెళ్ళి ఆ దుర్మార్గుణ్ణి పోనీక, చుట్టుముట్టి పట్టుకోండి. నాకు పరాభవంచేసి దేవతలు కూడా ప్రాణాలతో తప్పించుకోలేరు,” అని బాణుడు తన భటులను హెచ్చరించాడు. వెంటనే కొన్ని వేలమంది రాక్షస కింకరులు కత్తులూ, బాణాలూ పట్టుకుని ఉష అంతఃపురం మీద పడ్డారు.


ఆ కలకలం విని అనిరుద్ధుడు మేడ పైభాగం నుంచి, భవనాన్ని చుట్టుముట్టి కేకలు పెట్టుతున్న రాక్షసభటులను చూసి, ఒక్క క్షణంలో పోరాటానికి సిద్ధమయే సింహంలాగా అయిపోయాడు.


ఈ లోపల ఉష కన్నీరు కార్చుతూ, చేతులు నలుపుకుంటూ, "కన్యలు చేయ కూడని పని చేశాను. కులనాశకురాలినీ, కులటనూ అయాను. మూడు లోకాలనూ ఏలే తండ్రికి శత్రువునయాను. వెలలేని మాణిక్యంలాటి రాజకుమారుడికి చిక్కు తెచ్చిపెట్టాను. జగదంబ ఇచ్చిన వరం కూడా వృథా పోయేటట్టున్నది. నేనేం చేసేది? అదృష్టదేవతలారా, ఈ ఆపద తప్పించలేరా?” అంటూ ఆక్రోశించింది.


ఆమెను చూసి అనిరుద్ధుడు చిరునవ్వు నవ్వుతూ, " పిచ్చిదానా, నా పరాక్రమం నీకు తెలీదు. మీ తండ్రి బలగం మాట చెప్పకు, ఫాలాక్షుడు ప్రమథగణాలతో వచ్చినా గెలవగలను. నా శత్రువులను నా పిడికిళ్ళతో పొడిచి, నవరంధ్రాలా నెత్తురు కక్కించి, ఈ నగరానికి శోణపురం అనే పేరు సార్థకమయేటట్టు చేస్తాను, కిటికీ దగ్గిర నిలబడి చూస్తూ ఉండు. భయపడ వలసిన పనిలేదు,” అన్నాడు.


ఇలా అంటూనే అతను అంతఃపుర ద్వారం వద్ద ఉన్న పరిఘ ఒకటి తీసుకుని, రాక్షసుల పైకి వెళ్ళాడు. ఈ సమయంలో నారదుడు వచ్చి, ఆకాశాన నిలబడి వినోదం చూడసాగాడు.


రాక్షసులు అనిరుద్ధుడి మీద బాణాలూ, గదలూ, తమ వద్ద ఉండే సమస్త ఆయు ధాలూ ప్రయోగించారు. కాని అతను వాళ్ళను లక్ష్యపెట్టక, తన చేతనున్న పరిఘతో రాక్షసులను ఎడాపెడా చదమ సాగాడు; చేతికి అందిన వాళ్ళను పిడికిలితో పాడిచాడు. రాక్షసులలో కొందరు చచ్చారు. కొందరు గాయపడ్డారు. మిగిలినవాళ్ళు పారిపోయి బాణుడి ఎదట నిలబడ్డారు. బాణుడు వాళ్ళను చూసి కోపంతో నానా మాటలూ అన్నాడు:


"శత్రువుకు విజయం ధారపోసి, ప్రాణాలమీద తీపితో పారిపోయి వచ్చారా? శౌర్యపరాక్రమాలు పారిపోయి రావటానికా? ఒకప్పుడు మీ మీద ఆధారపడి లోకాలు జయిస్తెనే! నా కెంత అవమానం తెచ్చి పెట్టారు! పదండి, మీ వెనకనే రథగజ తురగపదాతులనూ, యోధులనూ పంపు తున్నాను. శత్రువు హతమారితీరాలి," అంటూ బాణుడు కాలకేయులనే రాక్షను లను అనిరుద్ధుడి పైకి పంపాడు. వాళ్ళు భూమ్యాకాశాలు ఆక్రమించి అతడి పైకి యుద్ధానికి వచ్చారు.


రాక్షసులు తన మీదికి యుద్ధానికి వస్తూ ఉండటం గమనించి అనిరుద్ధుడు ఒక కత్తి, డాలూ తీసుకుని రాక్షసుల పైకి వెళ్ళి, తన కత్తితో శత్రుబలాలను ఊచకోత కొయ్య నారంభించాడు. తాను ఒంటరి అయి ఉండి కూడా, అనేక వేల సంఖ్యగల రాక్ష సులతో తలపడి అనిరుద్ధుడు మెరుపులాగా యుద్ధం చేస్తుంటే నారదుడికి ఆ యుద్ధం అద్భుతంగా కనిపించింది. ఆయన ఎందరో మేటి వీరులు పోరాడుతూండగా చూశాడు. అనిరుద్ధుడిలాగా శత్రువులకు దిగ్భ్రామ కలిగించేలాగా యుద్ధం చేసినవాడు ఒక్కడూ లేడు.


బాణుడు పంపిన రాక్షసులు కొందరు చచ్చారు, కంగారులో ఒకరి నొకరు తొక్కు కున్నారు, కొందరు పారిపోసాగారు. అని రుద్దుడు పెడబొబ్బలు పెడుతూ వాళ్ళను తరిమికొట్టాడు.


అనిరుద్ధుడి చేత చావుదెబ్బలు తిని పారి పోయి వచ్చిన తన యోధులను చూసేసరికి బాణుడికి ఏదో సంకోచంలాటిది బయలు దేరింది. తన చేతి దెబ్బతిని, ప్రాణాలతో విడిచిపెట్టబడిన ఇంద్రాదులు ఇప్పటికీ తన పేరు చెబితే వణికిపోతారు. అటు వంటిది ఒక అనామకుడు తన బలాలను ఎదిరించి జయించాడు! అది చూసి బాణుడు తానే అనిరుద్ధుడితో యుద్ధం చెయ్యటానికి బయలుదేరాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)