26. బాణానిరుద్ధుల యుద్ధం | Battle of Banasura and Aniruddha | Lord Krishna Avatar Story in Telugu

writer
0
బాణుడి రథం వెయ్యి మూరల నిడివిగలది. దానికి వెయ్యి గుర్రాలు పూన్చివున్నాయి. రథం ఎలుగుబంటి తోలు కప్పి ఉన్నది. దానికి ఒక ఎర్రజెండా, నెమలి పతాకా ఉన్నాయి. ఆ రథం నిండా గదలూ, విల్లులూ, ఖడ్గాలూ, శక్తులూ పెట్టుకుని కుంభాండుణ్ణి సారధిగా చేసుకుని, బాణుడు అనిరుద్ధుడి పై యుద్ధానికి బయలుదేరాడు. అది చూసి అతని సేనాపతు లందరూ ఉత్సాహం తెచ్చుకుని, తమ సేనలను బాణుడి రథానికి ముందూ, పక్కలా నడి పించుకుంటూ వచ్చారు.

అనిరుద్ధుడు తన పైకి వచ్చే బాణుణ్ణి, అతని ఆయుధాలనూ, అతని చుట్టూ గల బలాలనూ చూసి ఏమాత్రం లక్ష్యపెట్టక, సూటిగా బాణుడి రథం కేసి ఎదురు రానారంభించాడు.

ఒక సామాన్య మానవుడు, అందులోనూ ఆయుధాలు విశేషంగా లేనివాడు, తన పైకి ధైర్యంగా వస్తూ ఉంటే బాణుడికి ఆశ్చర్యం కలిగింది. అతను తన రాక్షస సైనికులతో, 'చూస్తారేం? వాణ్ణి పట్టుకోండి! చంపి పారెయ్యండి!” అంటూ అనిరుద్ధుడి పై బాణవర్షం కురిపించాడు.

చేత ఒక్క కత్తి మాత్రమే గల అనిరుద్ధుడు ఆ బాణాలను లక్ష్యపెట్టక, తనకు అడ్డంగా వచ్చే రాక్షసులను తోసు కుంటూ బాణుడు ఎక్కవున్న రథాన్ని చేరుకున్నాడు. అది చూసి బాణుడి పరి వారం నిర్ఘాంతపోయింది.

రథాన్ని సమీపిస్తూనే అవిరుద్ధుడు రథపు గుర్రాలను చంపసాగాడు. రక్తం ఏరులై పారింది. ఈ లోపల బాణుడు అనిరుద్దుడి పై అనేక ఆయు ధాలు విసిరాడు. అనిరుద్ధుడు చచ్చాడనుకుని రాక్షసులు పెడబొబ్బ పెట్టారు. అయితే అనిరుద్ధుడు ముందుకు రాలేకపోవటం మాత్రమే జరిగింది.

ఇంతలో బాణుడు అనిరుద్ధుడి పైకి మహాశక్తిని విసిరాడు. అనిరుద్ధుడు దాన్ని చేత్తో పట్టుకుని, బలం కొద్దీ బాణుడి పైకే విసిరేసరికి, అది బాణుడి గుండెలను చీల్చుకుని, వీపులో నుంచి బయటికి వచ్చి, భూమిలో దిగబడి పోయింది. బాణుడు ధ్వజస్తంభాన్ని పట్టుకుని కూలిపోయాడు.

కుంభాండుడు బాణుడికి స్పృహ వచ్చే. టట్టు చేసి, "శత్రువు అసామాన్య ప్రతి భావంతుడు. ప్రపంచ మంతా ఎత్తి వచ్చినా లక్ష్య పెట్టేటట్టు కనపడడు. అతడి సాహసమూ, ధైర్యమూ చూశావా? అతన్ని గెలవటం తేలిక కాదు. ముందు నీ ప్రాణాలూ, నా ప్రాణాలు దక్కే ఉపాయం చూడకపోతే ఇతను రాక్షసకులానికే ఎసరు పెట్టేటట్టున్నాడు,” అన్నాడు.

బాణుడు తన మంత్రితో, "గరు త్మంతుడు పామును పట్టినట్టుగా ఈ క్షణం లోనే ఈ మూఢుణ్ణి పట్టేస్తాను చూడు,” అంటూ అదృశ్యుడై పోయి, తన కోసం దిక్కులు చూస్తున్న అనిరుద్ధుడి పైన కృష్ణ సర్ప ముఖాలు గల బాణాలు వేసి, అతని అవయవాలన్నీ బంధించి, కదలకుండా చేశాడు. తరువాత అతను కుంభాడుడితో, " యౌవన గర్వితుడైన ఈ దుర్మార్గుడు ఇప్పుడు మనకు చిక్కాడు. వీణ్ణి వెంటనే కత్తికి బలి చేద్దాం. లేకపోతే వీడు తెచ్చి పెట్టిన కళంకం మాయదు,” అన్నాడు.

ఆ మాటకు కుంభాడుడు, " అదినిజమే గాని, ఒక్క విషయం గమనించాలి. ఇతను మన ఉషకు గాంధర్వ వివాహం ద్వారా ఇదివరకే భర్త అయి ఉన్నాడు. ఇతనికి ఏదన్నా జరిగితే అమ్మాయికి తీరని దుఃఖం కలిగి తీరుతుంది. అసలు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడో, ఎవడో తెలుసు కోవలసిన అవసరం ఉన్నది. ఇతను మామూలు మనిషి మటుకు కాడు. ఇతని అందమూ, పరాక్రమమూ చూస్తే దేవత లను మించి ఉన్నాడు. ఇతను తప్పక చాలా గొప్పవాడే అయి ఉంటాడు. నీ వంటి మహా వీరుడితో ఎలా యుద్ధం చేస్తానా అన్న జంకు అతనిలో ఏ మాత్రమైనా కన బడిందా? అసహాయుడైపోయి కూడా అతని ముఖాన క్రోధం ఎట్లా తాండవిస్తు న్నదో చూడు! నీ కింతకన్న మంచి అల్లుడూ, అమ్మాయికి అంతకన్న మంచి భర్తా, నీ కింతకన్న మంచి ప్రత్యర్థి దొరుకు తాడా ? కాస్త ఆలోచించు," అన్నాడు.

కుంభాడుడి మాటలలో నిజం ఉన్నట్టే బాణుడికీ తోచింది. బాణుడు, "అదీ నిజమే,” నన్నట్టు తల ఆడించి, అనిరుద్దు డికి భటులను కావలి ఉంచి, తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు.

అప్పుడు నారదుడు అనిరుద్ధుణ్ణి సమీ పించి, ఊరడించి, " నేను వెళ్ళి కృష్ణుణ్ణి తీసుకు వస్తాను. అతని రాకతో నీ కష్టా నీ లన్నీ విచ్చిపోతాయి. అంతదాకా ఈ వచ్చిన కష్టాన్ని ధైర్యంగా ఓర్చుకో,” అని చెప్పి, వెళ్ళిపోయాడు.

అనిరుద్ధుడు తల ఎత్తి చూసే సరికి, కన్నీరు కార్చుతూ ఉష కిటికీ వద్ద కవి పించింది. అతను ఆమెతో, "నీ తండ్రి నాతో ముఖాముఖి యుద్ధం చెయ్యలేక, మాయోపాయంతో నన్ను బంధించాడు. అయినా విచారంలేదు. నా కష్టం తొలగించ కలవాడు కృష్ణు డున్నాడు. తన సుదర్శన చక్రంతో ఎందరో రాక్షసులను నిర్మూ లించినవాడు నాకు జరిగిన ఈ పరాభవాన్ని సహిస్తాడా? ఎందుకు దిగులు పడతావు ? నీ తండ్రికి మంచిరోజులు చెల్లిపోయాయి," అని చెప్పాడు.

తరువాత అతను దుర్గను స్తోత్రం చేసి ధ్యానించసాగాడు. కొంతసేపటికి లోకేశ్వరి అయిన దుర్గ అతని ఎదట ప్రత్యక్షమై, అతన్ని బంధించిన బాణాల పంజరాన్ని చేత్తో తాకి భగ్నం చేసి, అతన్ని బంధ విముక్తుణ్ణి చేసి, "త్వరలోనే కృష్ణుడు వచ్చి, బాణుడితో యుద్ధం చేసి ఓడించి, నిన్ను తీసుకు పోతాడు. నీకు శుభం చేకూరుతుంది,” అని చెప్పి అంతర్థాన మయిపోయింది.

ఈ లోపల ద్వారకలో చాలా గందర గోళం జరిగింది.

చిత్రరేఖ అవిరుద్ధుణ్ణి తీసుకు పోయాక అనిరుద్ధుడి భార్యలు స్పృహ తెలిసి, తమ భర్త జాడ తెలియక, పెద్ద పెట్టున శోకాలు పెట్టసాగారు.

అనిరుద్ధుడి మందిరం నుంచి స్త్రీల ఆర్తనాదాలు వెలువడటం విని నగరంలోని యాదవ ప్రముఖులు తమ తమ ఇళ్ళలో నుంచి బయటికి వచ్చేసరిక, సభాభవనంలో భేరీ మోగింది. త్వరలోనే కృష్ణ బల రాములు మొదలుగా అందరూ సభలో చేరారు. అనిరుద్ధుడు కనిపించటం లేదని తెలిసి అందరూ విచారగ్రస్తులయారు. కృష్ణుడు సైతం కంట తడిపెట్టాడు.

అది చూసి వికద్రుడు కృష్ణుడితో, "నీ చాటున యాదవవంశం క్షేమంగా ఉన్నది. దేవేంద్రుడే తన క్షేమానికి నీ మీద ఆధార పడి ఉన్నాడు. అలాటప్పుడు నువు కంట తడిపెడితే, అనిరుద్ధుడు కనపడక పోవటం కంటె కూడా ఇది పెద్ద విచారం అవుతుంది. అందుచేత నువు అందరికీ ఏదన్నా ధైర్యం చెప్పు," అన్నాడు.

దానికి కృష్ణుడు, "నా విచారం అనిరుద్ధుడి జాడ తెలుసుకోలేకపోతే జనం నన్ను ఏమంటారో ననే. చంటి పిల్లవాడుగా ఉండగానే ప్రద్యుమ్నుణ్ణి ఒక రాక్షసుడు ఎత్తుకు పోయాడు. ఆ రాక్షసుణ్ణి ప్రద్యు ముడే చంపి తిరిగి రావటంతో నా పరువు కొంతవరకు దక్కింది. ఈ సారి కూడా అలాగే అయినట్టు కనబడుతుంది. శత్రువు లెవరో నా మీద కసితో ఈ పని చేశారు. ఇది సాధారణ ఘటన మాత్రం కాదు. ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. దాన్ని అనుసరించి నా శక్తి కొద్దీ చెయ్య వలసినది చేస్తాను," అన్నాడు.

అప్పుడు సాత్యకి, వివిధ ప్రాంతాలకు మనుషులను పంపమని సూచించాడు. ఉగ్రసేనుడు ఆ సూచనను బలపరిచి, రథాలమీదా, గుర్రాలమీదా, కాలినడకనా, అనేక మందిని అనేక ప్రాంతాలకు పోయి, అనిరుద్ధుణ్ణి వెతకమని ఉత్తరు విచ్చాడు.

అనాదృష్టి అనే సేనాపతి కృష్ణుడితో జంకుతూ జంకుతూ, "అయ్యా, నా కొక అనుమానం ఉన్నది. దేవతలు చాలా సార్లు నీ వల్ల ఉపకారం పొందివున్న మాట నిజమే గాని, పారిజాతం తెచ్చినప్పుడు ఇంద్రుడు నీతో యుద్ధంచేసి ఓడిపోయాడు. ఆ అవమానం లోపల బాధిస్తూ ఉండ వచ్చు. ఇంద్రుడే అనిరుద్ధుణ్ణి మాయం చేశాడా అని నా అనుమానం,” అన్నాడు. 

కృష్ణుడు ఈ మాటకు నవ్వి, " దేవతలు ఇలాంటి పని ఒక్కనాటికి చెయ్యరు. ఇది రాక్షసులు చేసే పని. నా వల్ల తమకు ఉపకారం ఉన్నదని తెలిసిన దేవతలు ఇలాటి పని చెయ్యరు,” అన్నాడు.

అక్రూరుడు కూడా కృష్ణుడి మాటను బలపరిచాడు.

"అనిరుద్ధుణ్ణి ఇలా దొంగిలించుకు పోవలసిన పని పురుషుల కుండదు. ఎవతో పాపాత్మురాలైన స్త్రీయే ఈ పని చేసి ఉండాలి. దైత్య, దానవ, దేవతా స్త్రీలకు ఎన్నో మాయలు తెలుసు. వాళ్లు ఎక్కడికైనా పోగలరు, ఎవరినైనా భ్రమ పెట్ట 'గలరు. కనక మనం ఆ జాడలను బట్టి వెతకాలి," అన్నాడు కృష్ణుడు.

కొన్ని రోజులయాక, అనిరుద్ధుణ్ణి వెతకబోయిన చారులు తిరిగి వచ్చి, తమ ప్రయత్నం విఫలమయిందని చెప్పారు. 

ఆ మర్నాడు ఉదయం కృష్ణుడు సభకు వచ్చాడు. ఉగ్రసేనుడు మొదలైన యాదవు లందరూ సభ తీరి ఉండగా అక్కడికి నారదుడు వచ్చాడు. అతిథి మర్యాదలన్నీ పూర్తి అయాక నారదుడు అందరి కేసీ చూసి, " ఏమిటి మీరంతా పుట్టెడు విచా రంలో ముణిగి ఉన్నట్టున్నారు?” అన్నాడు. 

"ఏం చెయ్యం? అనిరుద్ధుడు కనిపించటం లేదు. అతని కోసం అంతటా వెతికించాం. కాని ఫలితం లేకపోయింది,” అన్నాడు కృష్ణుడు.

'అన్నట్టు, ఇన్ని యుద్ధాలు చూశాను గాని, మీ అనిరుద్ధుడు బాణుడితో చేసిన యుద్ధం ఉందే అలాంటిది ఎక్కడా, ఎన్నడూ చూసి ఎరగను. అసలు ఏం జరిగిందంటే, ఆ బాణుడి కూతురు ఉష అనేది అనిరుద్ధుణ్ణి ప్రేమించి, చిత్రరేఖ అనేదాన్ని పంపింది. అది కాస్తా వచ్చి అనిరుద్ధుణ్ణి తీసుకుపోయి ఉషతో చేర్చింది.

ఈ సంగతి బాణుడికి తెలిసి అనిరుద్ధుడితో యుద్ధానికి వచ్చి, చావుదెబ్బ తిని, మాయా యుద్ధానికి దిగి, సర్పబాణాలతో అనిరుద్ధుణ్ణి కాస్తా బంధించాడు. అందుచేత నువు వెళ్ళి ఆ బాణుడి అంతు తేల్చుకో. బాబు డుండే శోణపురం ఇక్కడికి చాలా దూరం. అందుచేత ఏ గరుత్మంతుడి సహాయంతోనో వెళ్ళు. ఈ మాట చెప్పటానికే వచ్చాను. శలవు," అంటూ నారదుడు నిష్క్రమించాడు. 

కృష్ణుడు గరుత్మంతుణ్ణి స్మరించాడు. గరుత్మంతుడు వచ్చాడు. వెంటనే కృష్ణుడూ, బలరాముడూ, ప్రద్యుమ్నుడూ గరుత్మంతుడి మీద ఎక్కారు. వాళ్ళు శోణనగరం చేర వచ్చేసరికి వారి ముందు ఒక అద్భుతమైన వెలుగు కానవచ్చింది. "కృష్ణా, ఈ వెలు గేమిటి?" అని బలరాముడు అడిగాడు.

"మనం ఇప్పుడు బాణుడి నగరాన్ని చేర వస్తున్నాం. శివుడు ఈ నగర రక్షణకు అగ్ను లన్నిటినీ నియోగించాడు. మనకు ఇప్పుడు ఎదురైనది ఆహవనీయాగ్ని. దీవి సంగతి గరుత్మంతుడు చూసుకుంటాడులే," అన్నాడు కృష్ణుడు.

కృష్ణు డలా అంటుండగానే గరుత్మం తుడు ఆకాశగంగ నుంచి జలం పుక్కిట పట్టి అగ్నిపై చల్లి, దాన్ని ఆర్పేశాడు. కృష్ణుడు గరుత్మంతుణ్ణి పొగడాడు.

గరుత్మంతుడు మరికొంత ముందుకు పోయేసరికి, శివుడు నియోగించిన మిగిలిన అగ్నులు పెద్దపెట్టున సింహనాదాలు చేశారు. వాటిని విని బాణుడు యుద్ధ సన్నాహాలు ప్రారంభించాడు.

ఈలోపల అంగిరసు డనే అగ్ని, జ్యోతి ప్టోముడూ, విభాంగుడూ అనే అగ్నులను ఇరు పార్శ్వాలా పెట్టుకుని, మిగిలిన అగ్నులన్నిటితో సహా కృష్ణుడితో యుద్ధం చేయ వచ్చాడు.

కృష్ణుడు అతనితో, "ఓ అంగిరసుడా, మునులు వేల్చిన ఆహుతులు మెక్కి, కొవ్వి నా పైకి యుద్ధానికి వస్తున్నావా? పో అవతలికి!” అన్నాడు.

అంగిరసుడు కోపించి, "దీనితో నీ ప్రాణం తీస్తాను,” అంటూ ఒక శూలం కృష్ణుడి పైన విసిరాడు. కృష్ణుడు దాన్ని తన బాణంతో దారిలోనే విరిచి, మరొక బాణంతో అంగిరసుడి రొమ్ము ఛేదించే సరికి, అంగిరసుడు నెత్తురు ఓడుతూ రథం మీద మూర్ఛపోయాడు. ఆ దెబ్బతో అగ్నులందరూ చెల్లాచెదరుగా పారిపోయారు.

వాళ్ళు అడ్డం తొలగగానే కృష్ణుడి కళ్ళ ఎదట శోణపురం కనడింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)