27. బాణుడి పరాభవం | Lord Krishna vs Banasura Battle | Lord Krishna Avatar Story in Telugu

writer
0
బాణుడి నగరాన్ని చూస్తున్న కృష్ణుడి దగ్గి రికి నారదుడు వచ్చి, "చూశావా, కృష్ణా? ఈ పట్టణాన్ని పార్వతీ సమేతుడైన శివుడు స్వయంగా కాపాడుతున్నాడు. అందుచేత నీకు కార్యసిద్ధి అయే మార్గం జాగ్రత్తగా చూసుకో,” అన్నాడు. 

దానికి కృష్ణుడు చిరునవ్వు నవ్వి, "మా పనికి ఈశ్వరుడే అడ్డపడినా సంతో షమే. మా శక్తి కొద్దీ మా ప్రయత్నం చేస్తామే గాని, వెనక్కు తిరిగి పోయి, కార్య హాని కానియ్యం,” అన్నాడు.

ఇలా అంటూనే కృష్ణుడు నగరద్వారం వద్దకు వెళ్ళి, పాంచజన్యం పూరించాడు. ఆ నాదం చెవుల పడుతూనే బాణుడి సేనలు మహా సముద్రం లాగా వచ్చి పడ్డాయి.

చెండా కృష్ణుడూ, బలరాముడూ, ప్రద్యుమ్నుడూ, గరుత్మంతుడూ కూడా విజృంభించి ఆ రాక్షససేనలను దారుణంగా డారు. చచ్చిన వాళ్ళు చావగా మిగిలిన వాళ్ళు నగరంలోకి పారిపోసాగారు.

అప్పుడు వాళ్ళను చూసి బాణుడు, "రాక్షసవీరులై పుట్టి, యుద్ధాలలో ఆరితేరి కూడా మీరిలా పారిపోయి వస్తున్నారా? నేను లేనా? నా మంత్రి కుంభాండుడు లేదా? ప్రమథగణాలు లేవా? మన ముందు ఈ శత్రువు లెంత? ఆగండి! నిలవండి!” అన్నాడు. కుంభాండుడు కూడా వారిని హెచ్చరించాడు. కాని అందువల్ల ప్రయో జనం లేకపోయింది. రాక్షససేనలు ఆగకుండా పారిపోయాయి.

ఈ విధంగా తన భక్తుడైన బాణుడికి కలిగిన అవమానం చూసి శివుడికి ఆగ్రహం వచ్చింది. ఆయన యుద్ధానికి సిద్ధమై, సింహాలు పూన్చిన రథం మీద వృషభ ధ్వజం ప్రకాశిస్తూండగా, నందిని సారథిగా పెట్టుకుని, కుమారస్వామిని కూడా వెంట బెట్టుకుని, ప్రమథవీరులు వెంట రాగా అట్టహాసంగా బయలుదేరాడు.

శివుడూ కృష్ణుడూ యుద్ధం ఆరంభం చారు. ఆరంభంలోనే శివుడు కృష్ణుడిపైన నూరు బాణాలు వేశాడు. దానికి సమాధా నంగా కృష్ణుడు ఐంద్రాస్త్రం ప్రయోగించాడు. దాని నుంచి వేలకొద్దీ బాణాలు వెలువడి శివుడి రథాన్ని కప్పేశాయి. అప్పుడు శివుడు ఆగ్నేయాస్త్రం ప్రయోగించేసరికి, చుట్టూ మంటలు పుట్టు కొచ్చి బాణాలన్నిటినీ తగల బెట్టేశాయి. తరవాత అవి తననూ, బలరాముణ్ణి, ప్రద్యుమ్నుణ్ణి, గరుత్మంతుణ్ణి చుట్టు ముట్టుతూంటే కృష్ణుడు వారుణాస్త్రం వేసి ఆ జ్వాలలను చల్లార్చాడు. 

అటు పైన శివుడు దారుణమైన అస్త్రా లను అయిదారింటిని ప్రయోగిస్తే వాటన్ని టినీ నిర్వీర్యం చేయగల అస్త్రాలను కృష్ణుడు ప్రయోగించి, చివరకు వైష్ణ వాస్త్రాన్ని మంత్రయుక్తంగా ప్రయోగిం చాడు. ఆ మహాస్త్రాన్ని ఎలా ప్రతిఘటిం చాలో పాలుబోక శివుడు అమిత కోపంతో యుగాంతకమై, ప్రళయభయంకరమైన పాశుపతాస్త్రాన్ని పైకి తీశాడు.

శివుడి ఉద్దేశాన్ని గ్రహించి కృష్ణుడు అతి వేగంగా జృంభకాస్త్రాన్ని ప్రయోగించాడు.  మరుక్షణమే శివుడికి చెప్పరాని నీరసమూ, ఆవలింతలూ వచ్చేశాయి. చేతి నుంచి ధనుర్బాణాలు పడిపోయాయి.

ఆ సమయానికే బాణుడు కూడా యుద్ధ రంగానికి వచ్చి ఉన్నాడు. అతను శివుడికి చైతన్యం కలిగించాలని ప్రయత్నించాడు. గాని, ప్రయోజనం లేకపోయింది. కృష్ణుడు దిక్కులు మారుమోగేలాగా పాంచజన్యం పూరించాడు.

ఇదంతా చూసి ప్రమథులకు చాలా కోపం వచ్చింది. వారు ప్రద్యుమ్నుణ్ణి చుట్టు ముట్టి ఆయుధాలతో ముంచివేశారు. రాక్ష నులు కూడా అతని పైన మాయాయుద్ధం సాగించారు. ప్రద్యుమ్నుడు అలిగి సమ్మో హనవిద్యతోవారందరికీ నిద్ర తెప్పించి, అనేకమంది రాక్షసులను చంపాడు.

ఈ లోపల కుమారస్వామి, తన తండ్రి యుద్ధ విముఖుడు కావటం చూసి, తానే ఆ స్థానంలో యుద్ధం చేయ బూనాడు. అతను కృష్ణబలరామ ప్రద్యుమ్నులతో పోరాడుతూ, వారిని తీవ్రంగా గాయపరచి, తానూ గాయపడ్డాడు. కుమారస్వామి అలిగి కృష్ణుడి పైన బ్రహ్మశిరోనామాస్త్రం ప్రయో గిస్తే కృష్ణుడు తన సుదర్శన చక్రంతో దాన్ని నిర్మూలించాడు. ఆ వెంటనే అతను కుమారస్వామి పైన తన చక్రాన్ని ప్రయో గించేసరికి, అది వచ్చి కుమారస్వామికి తగిలే లోపల లంబాదేవి అనే ఒక దేవతాస్త్రీ వచ్చి కుమారస్వామిని యుద్ధరంగం నుంచి తీసుకుపోయింది.

తనకు అంగరక్షగా ఉన్నవారంతా ఈ విధంగా తొలగిపోగా, యుద్ధం ద్వారా తన చేతులు తీట తీరే అవకాశం దొరికిందని సంతోషించి బాణుడు తానే స్వయంగా కృష్ణుడితో యుద్ధానికి వచ్చాడు. ఇద్దరికీ. జరిగిన యుద్ధంలో బాణుడి రథమూ, ఆయుధాలూ నుగ్గయాయి, టెక్కెం విరిగి పడింది. రొమ్ములో నుంచి కృష్ణుడి బాణం దూసుకుపోయి బాణుడు మూర్ఛిల్లాడు. 

ఆ స్థితిలో కృష్ణుడి చక్రాయుధానికి బలిగానున్న బాణుణ్ణి కాపాడటానికి శివ పార్వతులు మళ్ళీ లంబాదేవినే పంపారు. ఆమె వచ్చి బాణుడికి అడ్డంగా నిలబడింది. అదృశ్యంగా పార్వతి కూడా అక్కడే నిలబడింది.

అప్పుడు కృష్ణు డామెను చూసి, "దేవీ, ఎందుకీ కుయుక్తులు? నువు అడ్డంగా నిలిచి నంత మాత్రాన నేను శత్రువును ప్రాణా లతో వదులుతా ననుకున్నావా?” అన్నాడు.

ఆ మాటకు పార్వతి, "నువు సమర్థు డివి. ఏం చేసినా నేను నిన్ను అడ్డలేను. కాని ఈ బాణుణ్ణి నేను నా కొడుకుగా పెంచుకున్నాను. నాకు పుత్రశోకం కలి గిస్తావా? వీణ్ణి కాయి,” అన్నది.

దానికి కృష్ణుడు, "తల్లీ, వీడు తన వెయ్యి చేతులు చూసుకుని మదించి, ఎర్ర వీగుతున్నాడు. రెండు చేతులే ఉంచి, మిగిలినవన్నీ నరికేస్తేనే గాని వీడి దర్పం అణగదు. అప్పుడు వీడి రాక్షసత్వం పోయి, నీ అండన బతికే కొడుకులాగే మిగులు తాడు. అడ్డం రాకు," అన్నాడు.

పార్వతి లంబాదేవిని అడ్డం తొలగ మన్నది. పార్వతీదేవితో బాటు లంబాదేవి కూడా అంతర్ధానం కాగానే, కృష్ణుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. అది వెళ్ళి, బాణుడికి రెండు చేతులను మాత్రం మిగిల్చి, మిగిలిన చేతులన్నిటినీ ఖండించి, కృష్ణుడి చేతికి తిరిగి వచ్చింది.

అప్పటికీ బాణుడి పౌరుషం చావలేదు. అతను తనకు మిగిలిన రెండు చేతులతోనే ధనుర్బాణాలు తీసుకుని, కృష్ణుడిపై బాణ వర్షం కురిపించాడు. కృష్ణుడు ఆగ్రహించి తిరిగి చక్రాన్ని ప్రయోగించబోయేటంతలో శివుడు తన పరివారంతో సహా వచ్చి, "కృష్ణా, వీడు నా సంరక్షణలో ఉన్నవాడు. వీణ్ణి చంపి, నా అభయ దానాన్ని వ్యర్ధం చెయ్యకు. నీ చక్రాన్ని ఉపసంహరించు," అని కోరాడు.

కృష్ణుడు బాణుణ్ణి చంపే ప్రయత్నం మానుకుని, శివుణ్ణు కీర్తించి, గరుత్మంతుణ్ణి ఎక్కి, అనిరుద్ధుడున్న చోటికి వెళ్ళాడు. నందికేశ్వరుడు బాణుణ్ణి శివుడి దగ్గిరికి చేర్చాడు. శివుడు బాణుడికి చేతులు పోయిన బాధ మాన్పి, అతనికి ప్రమథులలో చాలా ఉన్నతమైన స్థానం ఇచ్చి, నందికి సమ మైన హెూదా ఇచ్చాడు. బాణుడి పేరు మహాకాళుడుగా మారిపోయింది. శివుడు అంతర్థానమయాడు.

అక్కడ గరుత్మంతుణ్ణి చూడగానే అని రుద్ధుణ్ణి పాముల రూపంలో బంధించిన బాణాలన్నీ, తిరిగి బాణాల రూపం పొంది పడిపోయాయి. అక్కడికి నారదుడు వచ్చాడు, చిత్రరేఖ కూడా వచ్చింది. కృష్ణ బలరామ ప్రద్యుమ్నులు అనిరుద్ధుణ్ణి కౌగ లించుకున్నారు. అతను వాళ్ళకు భక్తితో నమస్కారాలు చేశాడు.

నారదుడు కృష్ణుణ్ణి చూసి, " ఇంకా ఆలస్యం దేనికి ? అబ్బాయికి వివాహం చేసెయ్యి, ” అన్నాడు.

ముహూర్తం కూడా సమీపంలోనే ఉన్నది. కుంభాండుడు పెళ్ళి ప్రయత్నా లన్నీ పూర్తి చేసి వచ్చి, కృష్ణుడికి నమ స్కారం చేసి, "నన్ను తమరు అనుగ్ర హించి కాపాడాలి," అన్నాడు.

కృష్ణుడు అతనితో, "నువు చాలా "నువు చాలా యోగ్యుడవని విన్నాను. బాణుడి సర్వ స్వమూ నువే తీసుకుని నిశ్చింతగా అనుభ వించు,” అన్నాడు.

తరువాత ఉషానిరుద్ధులకు వైభవంగా వివాహం జరిగింది. కృష్ణుడు నూతన వధూ వరులను శివపార్వతులున్న చోటికి తీసుకు పోయి, వారికి నమస్కారాలు చేయించాడు. ఆ ఆదిదంపతులు వారిని ఆశీర్వదించారు. పార్వతి అనిరుద్ధుడికి వాహనంగా బాణుడి నెమలినే ఇచ్చింది.

ఆ సమయంలో కుంభాండుడు, కృష్ణుడు బయలుదేరి పోబోతూండగా, "బాణుడి ఆవులమందలు వరుణుడి దగ్గిర ఉన్నాయి. వాటి పాలు తాగితే ఎంతో బలవీర్యాలు కలుగుతాయి. వాటిని తమరు స్వాధీన పరుచుకోవటం మంచిది, " అన్నాడు.

ఇకనేం? కృష్ణుడు గరుత్మంతుడి మీద తనతోబాటు అన్ననూ, కొడుకునూ తీసుకుని పడమటి సముద్ర తీరానికి అతి వేగంగా వెళ్ళి, అక్కడి వనాలలో తిరుగుతున్న గోవులను అనేక లక్షల సంఖ్యలో చూశాడు. గోవులను మాలిమి చేసుకోవటం తనకు చిన్నతనం నుంచీ అలవాటైన విద్యే గనక, కృష్ణుడు నేల మీద దిగి ఆ గోవుల దగ్గరికి వెళ్ళాడు. అవి గబగబా సముద్రంలో ప్రవే శించి, అదృశ్యమయాయి.

కృష్ణుడు నిరాశ చెంది గరుత్మంతుడితో, "నా ప్రయత్నం ఇలా గయిందేమిటి? ఇప్పుడు ఏం చెయ్యాలి?" అన్నాడు.

" చేసేటందు కేమున్నది? వరుణుడితో యుద్ధం చేయక తప్పదు!" అన్నాడు గరుత్మంతుడు.

అతను రెక్కలతో బలంగా విసిరేసరికి సముద్రపు నీరు తొలగి, ఆడుగున నాగ లోకం దాకా దృగ్గోచరమయింది. కృష్ణుడు పాంచజన్యం పూరిస్తూ వరుణుడి ఇంటి మీదికి ఎత్తి వెళ్ళాడు.

మరుక్షణమే శంఖాలు ఊదుతూ, అరవై ఆరు రథాల మీద వరుణుడి భటులు కృష్ణుడి పైకి వచ్చారు. కృష్ణుడు వారితో దారుణమైన యుద్ధం చేశాడు. అతనికి సహాయంగా బలరాముడూ, ప్రద్యుమ్నుడూ కూడా పోరాడారు. గరుత్మంతుడు కూడా వారికి సహాయం వెళ్ళాడు. ఈ నలుగురూ చేసిన యుద్ధానికి తట్టుకోలేక వరుణుడి భటులు పారిపోయారు.

"కృష్ణుడు ఇంత పని చేస్తాడా?" అని ఆగ్రహించి వరుణుడు స్వయంగా యుద్ధా నికి వచ్చాడు. కృష్ణుడికి వరుణుడికి జరి గిన యుద్ధంలో కృష్ణుడు వైష్ణవాస్త్రం ప్రయో గించేసరికి వరుణుడు, ప్రాణం మీదికి వచ్చి, కాళ్ళ బేరానికి దిగాడు.

"నన్ను శరణు వేడినంతమాత్రాన లాభం లేదు. నీ దగ్గిర ఉండే బాణుడి పశువులను ముందు నా పరం చెయ్యి, " అన్నాడు కృష్ణుడు.

"అది మాత్రం అడగవద్దు. బాణుడు తన పశువులను నాకు అప్పగించేటప్పుడు, ప్రాణం ఉన్నంతదాకా యుద్ధమైనా చేస్తాను గాని వాటిని ఎవరికీ ఇవ్వనని ప్రమాణం చేశాను. ఉన్నమాట చెప్పాను. తరువాత నీ కెలా తోస్తే అలాగే చెయ్యి." అన్నాడు వరుణుడు.

కృష్ణుడు పశువుల మీది ఆశ వదులుకుని తన దివ్యాస్త్రాన్ని ఉపసంహరించాడు. వరుణుడు కృష్ణుడికి అతిథి మర్యాదలు చేసి తన లోకం నుంచి సాగనంపాడు.

వరుణుడికి వీడ్కొలు చెప్పి, కృష్ణుడు బలరామ ప్రద్యుమ్న అనిరుద్ధులతో సహా గరుడవాహనం మీద తన నగరాన్ని చేరు కుని, విజయసూచకంగా పాంచజన్యం పూరించాడు. అది విని యాదవ ప్రము ఖులు పెద్ద బలగాన్ని వెంటబెట్టుకుని ఎదురు వచ్చారు. వారు వచ్చేసరికి కృష్ణుడు నగరం వెలపల ఉండే ఉద్యానాలలో దిగి, విహరి స్తున్నాడు. అతని వెంట ఇంద్రాది దేవతలు కూడా ఉన్నారు. యాదవులు వారినందరినీ వైభవోపేతంగా రథాలలో నగరంలోకి తీసుకు పోయారు. కృష్ణుడు విజయుడై తిరిగి వచ్చా డన్న వార్త తెలిసి పురజనులు వీధుల వెంబడి కిక్కిరిసి నిలబడ్డారు. కృష్ణుడు శోణపురంలో అగ్నులను జయించటమూ, శివుణ్ణి నిగ్రహించటమూ, పార్వతికి పుత్ర భిక్ష పెట్టటమూ, బాణుణ్ణి చేతులు నరికి ప్రాణాలతో వదలటమూ మొదలైన వృత్తాంతాలు వారు చెప్పుకుంటున్నారు. వాళ్ళ మాటలు చెవిని పడుతుంటే కృష్ణుడికి ఆనందం కలిగింది.

నగరు చక్కగా అలంకరించి ఉన్నది. అక్కడికి చేరగానే కృష్ణుడు తన మంది రానికి వెళ్ళిపోయాడు: ఉషానిరుద్ధులు తమ మందిరానికి వెళ్ళారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)